YS Jagan: పరిపాలనలో తన దైన ముద్ర వేసుకుంటున్న ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలలో 50కిపైగా ఉప కులాల అభ్యున్నతికి ప్రత్యేకంగా కార్పోరేషన్ లు ఏర్పాటు చేసిన జగన్ సర్కర్ ఇప్పుడు అగ్రకులాలైన రెడ్డి, క్షత్రియ, కమ్మ సామాజిక వర్గాలకు సైతం ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సామాజిక వర్గాల్లో కొందరు ధనికులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. ఆ వర్గాల్లో ఆర్థికంగా వెనుక బడిన వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్పోరేషన్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఎన్నికల సమయంలోనే వివిధ కులాలలో ఆర్థికంగా వెనుక బడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీల మేరకు తొలుత ఏపి మాల వెల్ఫేర్ కార్పోరేషన్, ఏపి మాదిగ వెల్ఫేర్ కార్పోరేషన్, ఏపి రెల్లి కార్పోరేషన్ లను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. ఆ తరువాత బీసిలలోని ఉప కులాలకు 59 కార్పోరేషన్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా మూడు అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం జగన్ సర్కార్ కార్పోరేషన్ లు ఏర్పాటు చేస్తూ ఆ మేరకు జీవో విడుదల చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?