YS Jagan: రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్న తరువాత వారు తమ ప్రసంగాల్లో ఏదో సందర్భంలో టంగ్ స్లిప్ అవ్వడం కామనే. కాకపోతే వారు మాట్లాడిన మాటల్లో దొరికిన తప్పులను ఎత్తి చూపుతూ ప్రత్యర్థి పార్టీలు ట్రోల్స్ చేస్తుంటారు. ఇంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ప్రసంగంలో మంగళగిరి బదులు మందళగిరి అనడం, పరామర్శించడానికి బదులు పరవశించడానికి అంటూ ఇలా టంగ్ స్లిప్ అవ్వడం తెలిసిందే. వైసీపీ సోషల్ మీడియా వింగ్ వెంటనే ఆ మాటల వీడియోలను షేర్ చేసి విమర్శలు చేయడం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా సీఎం వైఎస్ జగన్ టంగ్ స్లిప్ అయి ప్రత్యర్థి సోషల్ మీడియాకు చిక్కారు. ఏపి సీఎం ఓ మహిళ అంటూ సీఎం జగన్ నోరు జారారు. గొల్లపూడిలో మంగళవారం దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో జగన్ తడబాటుకు గురయ్యారు. దిశ యాప్ గురించి వివరిస్తూ “ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షత్తు ఓ మహిళ కాబట్టి” అన్నారు. వెంటనే పక్కనే ఉన్న హోంమంత్రి మేకతోటి సుచరిత కల్పించుకుని హోమ్ మినిస్టర్ అని గుర్తు చేశారు. దీంతో వెంటనే జగన్ ఆ మాటలను సవరించుకుని ప్రసంగాన్ని కొనసాగించారు. ఆయితే ఈ వీడియోను టీడీపీ..సోషల్ మీడియాలో షేర్ చేసి “ఏమి మాట్లాడుతున్నారు సార్?” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఇంతకు ముందు కూడా జగన్ తెలుగు పదాలను తప్పుగా ఉచ్చరించిన సందర్భంలోనూ ఇదే విధంగా టీడీపీ నేతలు ఆ వీడియోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన సంగతి విదితమే. లోకేష్ కే కాదు సీఎం జగన్ కు అయినా టంగ్ స్లిప్ కావడం సాధారణమేనని జనాలు అంటున్నారు. ఏదో తడబాటులో నేతలు చేసిన ఉఛ్చారణ దోషాలను పట్టుకుని అదే పనిగా విమర్శలు చేయడం మంచిది కాదంటున్నారు.
ఏమి మాట్లాడుతున్నారు సార్? ? pic.twitter.com/OijYSnCkw0
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) June 29, 2021