YS Jagan : ఏపి APలో స్థానిక సంస్థల ఎన్నికల Local body elections సందర్భంగా జగన్ సర్కార్ jagan govt, ఎస్ఈసీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ Nimmagadda ramesh kumar మధ్య వార్ ఏ స్థాయిలో జరుగుతుందో అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ ఎస్ఈసీ చైర్ లో ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో జగన్ ప్రభుత్వం, రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో ఎట్టిపరిస్థితిల్లోనూ ఎన్నికలు నిర్వహించే పదవీ విరమణ చేయాలన్న దృఢ సంకల్పంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహలు – ప్రతివ్యూహాలు రాష్ట్ర ప్రజానీకానికి ఓ సినిమానే చూపించాయి. అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా అనే పరిస్థితి వచ్చింది, చివరకు సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్రంలో స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. సజావుగా తొలి దశ పోలింగ పూర్తి అయింది, ఫలితాలు వెల్లడి జరిగింది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాల అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఉన్న తన ఓటు ను సరెండర్ చేసి స్వగ్రామంలో ఓటు కోసం అర్జీ పెట్టుకుంటే తహశీల్దార్ గ్రామంలో ఉండటం లేదని తన అర్జీని తిరస్కరించారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ కు అప్పీల్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ శ్రేణులు… ఓటు హక్కు కూడా కల్పించుకోలేని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమర్ అంటూ సెటైర్ లు వేశారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల తన సొంత గ్రామం అని నిమ్మగడ్డ చెప్పుకోవడంతో వైసీపీ శ్రేణుల అందరి దృష్టి ఆ గ్రామంపై పడింది.
తొలి విడతే దుగ్గిరాల పంచాయతీకి ఎన్నిక జరిగింది. ఈ గ్రామంలో వైసీపీ బలపర్చిన బాలావత్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాదించడం గమనార్హం. అదే విధంగా నిమ్మగడ్డ నివాసం ఉన్న వార్డులోనూ వైసీపీ అభిమాని అత్మకూరు నాగేశ్వరరావు 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి విజయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన నిమ్మగడ్డకు ఆయన స్వగ్రామంలోనే ఎదురుదెబ్బ తగిలిందనీ, వైసీపీ హవా చాటిందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. “నిమ్మగడ్డ స్వగ్రామంలో జగన్ మద్దతు దారులు ఘన విజయం, అధికార పార్టీకి ఇది ఎంతో ప్రత్యేకం” అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ లు ట్రోల్ చేస్తున్నారు.