YS Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తన సంచలనాల పరంపర కొనసాగిస్తున్నారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసుకున్న షర్మిల పార్టీ ఏర్పాటుపై హైదరాబాద్ లోటస్ పాండ్ లో పలువురు అనుచరులతో సమావేశం అవుతున్నారు. పార్టీ ని వచ్చే నెల 9న ప్రకటించాలని భావిస్తుండగా, అంతకు ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ కి జెండా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ జెండా డిజైన్ ఫైనల్ చేసినట్టు సమాచారం.
YS Sharmila షర్మిల సంచలనాల పరంపర …
పార్టీ జెండాకు సంబంధించి వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లేత ఆకుపచ్చ, తెలుపు, నీలి రంగుతో జెండాను రూపొందించినట్లు తెలిసింది. జెండా మధ్యలో తెలంగాణ చిత్ర పటం, అందులో వైఎస్సార్ ఫొటో ఉండేలా డిజైన్ చేయనున్నట్టు సమాచారం. ఇదే సమయంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
భారీ న్యూస్ రెడీ…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు , ప్రజల్లోకి వేగంగా చేరువ అవడంతో భాగంగా పార్టీ కోసం ఆఫీసును కూడా నిర్మించాలని భావిస్తున్నారు. హైదరాబాద్ శివారులో, మెట్రో రైల్ రూట్ కనెక్ట్ అయే విధంగా 2 ఎకరాల్లో పార్టీ ఆఫీసును ఏర్పాటు చేసేందుకు ల్యాండ్ చూడాలని అనుచరులకు షర్మిల చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు అనువైన స్థలం సిద్ధం కాగానే పార్టీ ఆఫీసు నిర్మాణం మొదలుపెట్టి త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారని సమాచారం.