YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకున్న వేళ ఆస్తుల కోసం అల్లుడే హత్య చేయించి ఉంటాడనీ, ఆయన కు కుటుంబ వివాదాలు, ఆస్తుల వివాదాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగానూ మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ వివేకా పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం దారుణమని ఆమె అన్నారు.
తన చిన్నాన్న వివేకా ఆస్తులన్నీ సునీత పేరు మీదనే ఉంచారనీ, అన్ని ఆస్తులు ఎప్పటి నుంచో సునీత పేరు మీదే ఉన్నాయని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటప్పుడు అస్తుల కోసం హత్య చేయించారని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. వివేకా ప్రజల మనిషి, అలాంటి వ్యక్తి గురించి కొన్ని మీడియా హౌస్ లు పని గట్టుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కథనాలు ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు లేని వ్యక్తి మీద, తనకు తాను సంజాయిషీ ఇచ్చుకోలేని వ్యక్తి మీద కొన్ని మీడియా హస్ లు ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వార్తలు, కథనాలు ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా వివేకా పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరి తల్లిపై వివేకా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనీ, అందుకే అతను కక్ష పెట్టుకుని వివేకా ను హత్య చేశాడని చెప్పారు. మరో పక్క ఆయన రెండో భార్య షమీమ్ కూడా సీబీఐ వద్ద ఆస్తులు, షటిల్మెంట్ ల కు సంబంధించి వివరాలను తెలియజేస్తూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరణంలో ఆ కుటుంబానికే చెందిన వైఎస్ షర్మిల.. సునీతకు మద్దతుగా కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో హాటా టాపిక్ అయ్యింది.