YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర చాటుకోవాలని వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. గత కొద్దిరోజులుగా తెలగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న ట్రెండ్లో ఆమె సైతం భాగం కానున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నాయకుల పాదయాత్రల పర్వం కొనసాగుతుండగా అందులో షర్మి లసైతం చేరుతున్నారు. తన పాదయాత్రకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు సమాచారం.
Read More: YS Sharmila: తెలంగాణలో షర్మిల దూకుడు మామూలుగా లేదుగా
పాదయాత్రల ట్రెండ్
ప్రజా జీవన యాత్ర పేరుతో బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర ఆలోచనలో ఉన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అదే ఫార్ములాను నమ్ముకుంటూ వైఎస్ షర్మిల పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్తున్నారు.
Read More: Eatela Rajendar: ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగానే ఈటల నిప్పులు…
షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారు….
గతంలో తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలక పాత్ర పోషించిన షర్మిల పాదయాత్ర చేసి పార్టీని ఉనికిలో ఉంచారు. అదే ఒరవడిలో ఈ ఏడాది అక్టోబర్ 18 న వైఎస్ షర్మిల చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అక్టోబర్ 18 నుంచి ప్రారంభించబోయే ఈ సుదీర్ఘ యాత్రలో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అమలు చేస్తారు, ఎలాంటి పాలన అందిస్తారు తదితర విషయాలను వైఎస్ షర్మిల ప్రజలకు ఈ యాత్రలో వివరిస్తారని సమాచారం. పాదయాత్ర పేరుతో పాత ఫార్ములానే నమ్ముకుంటున్న షర్మిల ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇవ్వనుందో వేచి చూడాలి.