YS Sharmila : ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పార్టీ పెడతారనే వార్తలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
YS Sharmila ఏపీలో
YS Sharmila ఏపీలోని పార్టీలు ఈ విషయంలో పెద్దగా స్పందించకపోయినా… తెలంగాణలోని అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో స్పందించాయి. తమదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, దీనిపై షర్మిల ఊహించని కామెంట్లు ఎదుర్కుంటున్నారు. ఏపీ వాళ్లు తెలంగాణలో పార్టీ పెట్టడం అవసరమా, ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ రుద్దుతారా అని తెలంగాణలోని పలు పార్టీలు మండిపడ్డాయి. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ జేఏసీ కూడా స్పందించింది.
ఓయూ జేఏసీ ఏమంటోంది ?
తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడాన్ని ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఆంధ్రలో చేయలేని పెత్తనం తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించింది. అధికార దాహం కోసం తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నం చేస్తే ఓయూ విద్యార్ధి జేఏసీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో సమైక్య వాదుల పెత్తనం వద్దని.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలు అవసరం లేదని ఓయూ జేఏసీ స్పష్టం చేసింది.
రేవంత్ అయితే ఓ అడుగు ముందుకు వేసి…
వైఎస్ కు తెలంగాణలో అభిమానులు ఉన్నారన్న ఆయన ఇందిరమ్మ పార్టీలోనే వైఎస్ సీఎం అయ్యారని అన్నారు. వైఎస్ ఏ పథకం తెచ్చినా కాంగ్రెస్ నాయకుడుగా చేశారని అందుకే వైఎస్ అంటే తెలంగాణ సమాజానికి గౌరవం, అభిమానం ఉందని ఆయన అన్నారు. అంత మాత్రాన షర్మిల పార్టీ పెడితే ప్రజలు అంగీకరించరన్న రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికి రాష్ట్రం తెచ్చుకున్నాం కానీ… రాజన్న బిడ్డగా ఏలుకోవడానికి కాదని అన్నారు. రాజన్న బిడ్డగా సారె పెట్టి పంపుతా కానీ, పార్టీ పెడితే ప్రజలు ఆమోదించరని అన్నారు. కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల పార్టీ అని రేవంత్ రెడ్డి అన్నారు.