YS Sharmila: వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తన ముద్ర చాటుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ప్రజల్లో ఉన్న భావనను క్యాష్ చేసుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటుగా ప్రజల సెంటిమెంట్ విషయంలోనూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా సిరిసిల్లా జిల్లాలో పర్యటించిన షర్మిల ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బోనాల పండుగలో సైతం పాల్గొని చర్చల్లో నిలిచారు.
Read More : Sharmila: కేటీఆర్ను షర్మిల మామూలుగా ఇరికించట్లేదుగా
కేసీఆర్ పై నిప్పులు…
మంత్రి కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్లాలో పర్యటించి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో రోజుకో నిరుద్యోగి ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకుంటుంటే.. దున్నపోతు మీద వానపడినట్లు కేసీఆర్ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు అని మండిపడ్డారు. “యువత చావులకు నిరుద్యోగమే కారణం. ఈ నిరుద్యోగానికి కేసీఆర్ కారణం. నిరుద్యోగ చావులన్నీ ప్రభుత్వ హత్యలే. 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నా , నిరుద్యోగులు చస్తున్నా .. చచ్చేది నా వాడు కాదు కదా అంటున్న కేసీఆరే ఈ చావులకు కారకుడు. నిరుద్యోగుల చావులకు కారణమవుతున్న కేసీఆర్ ముఖ్యమంత్రి పదివికి అనర్హుడు. ఉద్యోగాలు నింపడం చేతకాని సీఎం వెంటనే రాజీనామా చేయాలి“ అని షర్మిల ఆరోపించారు.
Read More : YS Sharmila: ఏంటో ఈ వింత… లక్షలు తీసుకొని షర్మిల పార్టీలో పదవుల అమ్మకం
బోనాల పండుగలో…
వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎష్ షర్మిల మొయినాబాద్ లో అమ్మవారికి బోనం సమర్పించారు. ఆషాడ మాస బోనాల సందర్భంగా వైఎస్ఆర్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించారు. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి బోనాల ఉత్సవాలల్లో పాల్గొన్నారు. బోనాల పండగతో పాటు ఇవాళే స్నేహితుల దినోత్సవం. అందుకే తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి ఫ్రెండ్ షిప్ డేతో పాటు బోనాల వేడుకల్లో పాల్గొన్నట్లు షర్మిల తెలిపారు.