YS Sharmila: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణలో తన సత్తా చాటుకోవాలని కొత్త పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. YS రాజశేఖర్ రెడ్డి పేరుతోనే YSR తెలంగాణ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు షర్మిల. పార్టీ ఏర్పాటులో భాగంగా నాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
Read More: Eatela Rajendar: షర్మిల పార్టీలోకి ఈటల.. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?
ప్రతి ఇంట్లోనూ..
వైఎస్ఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని జులై 8 వ తేదీన పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు షర్మిల తెలిపారు. పార్టీ జెండా మరియు అజెండా అన్నింటిని అదే రోజున ప్రకటించనున్నట్లు షర్మిల వివరించారు. వైఎస్ ద్వారా లబ్ది పొందని ఇల్లే తెలంగాణలో లేదని షర్మిల అన్నారు. పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని షర్మిల ప్రకటించారు. నేటి కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు అవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: YS Jagan: జగన్ బాటలోనే తెలంగాణ సీఎం కేసీఆర్….
కొత్త పంథాలో షర్మిల రాజకీయం
వైఎస్ సంక్షేమ పాలనను మళ్లీ గుర్తు తెచ్చేలా, తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలకు అద్దం పట్టేలా పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలని షర్మిల సూచించారు. ఇందుకోసం కార్యకర్తలు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి కష్ట సుఖాలను తెలుసుకోవాలని ఆమె సూచించారు. కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్లి వారి వివరాలు, ఇష్టాలు, సమస్యలు తెలుసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతమని పేర్కొన్న షర్మిల అదే పార్టీ రాజ్యాంగం అని ప్రకటించారు. అయితే, షర్మిల చేస్తున్న ఈ కొత్త రాజకీయం వర్కవుట్ అవుతుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు.