YS Sharmila: తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని భావిస్తూ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల ఆదిలోనే చేతులు ఎత్తేశారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న షర్మిల ఇందుకోసం కలిసి వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా ఆమె చేసిన కామెంట్లను ప్రస్తావిస్తున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల అనేక అంశాలపై స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, తాను రెండు వేరువేరు ప్రాంతాలకు ప్రతినిధులమని చెప్పుకొచ్చారు.
Read More: YS Sharmila: షర్మిల కలలో కూడా ఊహించని కామెంట్ చేసిన కేటీఆర్
నా గురించి అలా మాట్లాడవద్దు..
మతంతో పనేంటని షర్మిల ఆసక్తికర కామెంట్లు చేశారు. “నాకు మతాన్ని, కులాన్ని ఆపాదించొద్దు. నేను మతాలకు కులాలకు అతీతం. నేను ఎవరో వదిలిన బాణం కాదు..తెలంగాణ ప్రజల బాణాన్ని!“ అని షర్మిల క్లారిటీ ఇచ్చారు. మహిళగా పార్టీ పెట్టకూడదా? అని ఆమె ప్రశ్నించారు. తాను ఉన్నా లేకున్నా పార్టీ ఉంటుందని షర్మిల చెప్పుకొచ్చారు. తనకు అధికారదాహం లేదని వైఎస్ షర్మిల తెలిపారు. తాను చూడని అధికారం లేదు, అనుభవించని భోగం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాను 15 ఏళ్ళ క్రితమే సీఎం బిడ్డనని ప్రకటించారు.
Read More:
ఆయనతో పని చేస్తే తప్పేంటి?
ప్రశాంత్ కిషోర్ తో పనిచేస్తే తప్పేంటని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు.! హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి షర్మిల మాట్లాడుతూ, తాము ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదన్నారు. భావోద్వేగాల ఆధారంగా జరిగే ఈ ఎన్నికు తాము దూరంగా ఉంటామని షర్మిల ప్రకటించారు. తద్వారా హుజురాబాద్ ఎన్నికల్లో సత్తా చాటుకునే చాన్స్ షర్మిల పోగొట్టుకున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.