YS Sharmila : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని స్థాపించేందుకు క్రియాశీలంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నేతలతో ఆమె వరసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే నల్లగొండ , ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమైన షర్మిల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లాల నేతలతో ఆమె ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
షర్మిల ఏమంటున్నారంటే….
వరంగల్తో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి అనుబంధం ఉందని షర్మిల గుర్తు చేసుకున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు నిర్లక్ష్యం చేశారని ఆమె మండిపడ్డారు. వరంగల్ ను స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పారని, అదేమైందో ఇప్పటివరకు తెలియదని షర్మిల ఎద్దేవా చేశారు. కనీసం కాకతీయ యూనివర్శిటీకి వీసీ కూడా లేని పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థులు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే వరంగల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదని షర్మిల వ్యాఖ్యానించారు.
ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ పై ఫైర్
కాగా, షర్మిల తన రాజకీయ దూకుడు పెంచుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత కొద్దికాలంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా కేంద్రంపై సైతం బాణం ఎక్కుపెట్టారని పలువురు అంటున్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ , స్మార్ట్ సిటీ వంటి అంశాల్లో కేంద్రం తీరును ప్రశ్నించేలా షర్మిల కామెంట్లు ఉన్నాయని చెప్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?