BJP Plan: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు అంశం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉంది. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా, ముఖ్యంగా కడప జిల్లాలో ప్రతి ఒక్కరిలోనూ వివేకా హత్య కేసు క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనే దానిపై చర్చించుకుంటున్నారు,. వివేకా హత్య కేసు జరిగి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తుంది. ఇప్పుడు కేసు దాదాపు క్లైమాక్స్ వచ్చేసింది. వైసీపీలోకి ఓ కీలక నాయకుడి చుట్టూ ఆ అంశం తిరుగుతోంది. ఆయనపై అనుమానులు ఉన్నట్లు సీబీఐ కూడా చార్జి షీటులో పేర్కొంది. రేపో మాపో ఆయనను అరెస్టు చేయబోతున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అందుకే కొందరు సీనియర్ సీబీఐ అధికారులు కడప జిల్లాకు వచ్చారు, హత్య కేసుకు సంబంధించి పూర్తి సాక్షాలను సేకరించి కోర్టుకు సమర్పించే పనిలో ఉన్నారని అంటున్నారు.
Read More: CM YS Jagan: రాజధాని విశాఖపట్నం ఖాయం..జగన్ టేబుల్ పై ఓ ప్లానింగ్..?
BJP Plan: కఛ్చితంగా రాజకీయ కోణం
అయితే ఈ కేసును కఛ్చితంగా రాజకీయ కోణంలో చూడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నారు. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక రాజకీయ నాయకుడి హత్య. ఓ పెద్ద పొలిటికల్ నాయకుడి కుటుంబానికి చెందిన వ్యక్తి హత్య. ఆరోపణలు ఉన్నది కూడా రాజకీయ నాయకుడి చుట్టూనే. ఈ హత్యను రెండు ప్రధాన రాజకీయ పక్షాలు వాడుకోవాలనీ చూశాయి. ఈ కేసును కేంద్రంలోని రాజకీయ పార్టీ కూడా వాడుకోవాలని చూస్తోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర ప్రభుత్వంలో కీలక నేత, బీజేపీలో అగ్రనేత. పీఎం మోడీ. షా ద్వయం దేశంలో ఏమి చేయాలన్నా చేయగలరు అనేది అందరికీ తెలిసిందే. ప్రధాన వ్యవస్థలు అన్నీ వీరి ఆధీనంలో ఉన్నాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం.
ఏమి మాట్లాడలేని పరిస్థితిలో వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగాలి అని కోరుకుంటుంది. బీజేపీ ఎదగాలి అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీపడాలి అనుకున్నది. కానీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనపడినా ఆ ఓట్లు బీజేపీకి రావు వైసీపీకి వెళతాయి అని బీజేపీ గ్రహించింది. వైసీపీ బలహీనపడితేనే ఆ ఓట్లు బీజేపీకి వస్తాయని ఊహించిన బీజేపీ వైసీపీని బలహీనపర్చేందుకు గేమ్ స్టార్ట్ చేసింది. కరెక్టుగా ఇదే సమయంలో బీజేపీ పెద్దలకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలోని సీఎం జగన్మోహనరెడ్డి అదుపులో పెట్టుకుని బీజేపీ పెద్దలు కేంద్రంలో అవసరాలకు వైసీపీని ఉపయోగించుకున్నారు. పార్లమెంట్ లో, రాజ్యసభలో వైసీపీ మద్దతును తీసుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నా వైసీపీ ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. వివేకానంద రెడ్డి కేసును అడ్డం పెట్టుకుని కూడా కేంద్రంలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.