YSR Jayanti: పులివెందులలో జరిగిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలో ఏపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరు వైఎస్ షర్మిల వేరువేరుగా పాల్గొన్న విషయం తెలిసిందే. జగన్ ఏపి సీఎంగా, వైసీపీ అధ్యక్షుడుగా ఉండగా, జగన్ ఇష్టానికి భిన్నంగా షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే అన్న చెల్లి మునుపెన్నడూ లేని విధంగా వేరువేరుగా తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొనడంపై అనేక పుకార్లు షికారు చేశాయి. జగన్, షర్మిల మధ్య గ్యాప్ బాగా పెరిగిందనీ, కుటుంబంలో విబేధాలు తలెత్తాయంటూ పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ అభీష్టానికి భిన్నంగా షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించారన్నారు. తొలుత షర్మిల రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నప్పుడే జగన్ వద్దన్నారనీ, కానీ షర్మిల తన రాజకీయ భవిష్యత్తును వెతుకున్నారన్నారు. ఈ తరుణంలో ఇద్దరు ఒకే వేదికపై కలుసుకుంటే అనేక అనుమానాలు, ఊహాగానాలు వస్తాయని సజ్జల తెలిపారు. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ షర్మిలను కలవకుండా తన షెడ్యుల్ ను మార్చుకున్నారని సజ్జల పేర్కొన్నారు.
Read More: Krishna Board: కృష్ణా బోర్డు సమావేశం వాయిదా..!!
పులివెందులలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ఆమె తల్లి విజయమ్మ, భర్త అనిల్ తదితర కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించి ప్రార్థనలో పాల్గొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లగా, సాయంత్రం వైఎస్ జగన్ భార్య భారతితో కలిసి పులివెందులకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇలా వైఎస్ కుటుంబ సభ్యులు వేరువేరుగా జయంతి కార్యక్రమంలో పాల్గొనడంతో అనేక వార్తలు వచ్చాయి.