YSR Vahana Mitra: జగన్మోహనరెడ్డి (YS Jaganmohan Reddy) సర్కార్ వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం 2022 – 23 లబ్దిదారులుక గుడ్ న్యూస్ చెప్పింది. వాహన మిత్ర లబ్దిదారులకు ఈ నెల 13వ తేదీ ఆర్ధిక సహాయం అందించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అర్హుల నుండి ధరఖాస్తుల స్వీకరణకు రవాణా శాఖ (Transport Department) చర్యలు చేపట్టింది. వాహన మిత్ర పథకం (YSR Vahana Mitra) అర్హులైన వారు ఈ నెల 7వ తేదీలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ధరఖాస్తులు చేసుకోవాలని రవాణా శాఖ కమిషనర్ పి రాజాబాబు తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ ఆరంచెల విధానంలో పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు. ధరఖాస్తుదారు తనకు సంబంధించిన భూమి, ఆస్థి వివరాలు, ఆస్థి పన్ను కట్టిన వివరాలు, విద్యుత్ వినియోగం, ఆదాయపన్ను, కులం వివరాలు తెలపాల్సి ఉంటుందని తెలిపారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే వైఎస్ఆర్ వాహన మిత్ర ఆర్ధిక సాయం పొందుతున్న వారు వాహనంతో నిలబడిన ఫోటోను గ్రామ సచివాలయం ద్వారా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే ఆర్ధిక సహాయం అందిస్తామనీ, వాహనదారులు ఆధార్ కార్డుతో పాటు తెల్ల రేషన్ కార్డు కల్గి ఉండాలన్నారు. ధరఖాస్తు దారు విద్యుత్ వినియోగం ఆరు నెలల సగటు మీద నెలసరి 300 యూనిట్లు దాటితే పథకానికి అనర్హులు అవుతారని తెలిపారు. వాహన యజమాని హక్కులు మార్పు చేసినా, తప్పుడు పత్రాలు సమర్పించినా వారిని అనర్హులుగా పరిగణిస్తామని పి రాజబాబు తెలిపారు. అర్హులైన వారికి ఈ నెల 13వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా సాయం అందించడం జరుగుతుందని వెల్లడించారు.