YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరానికి తెరలేపింది. వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలకు ముందుగా 29 మంది నేతలకు కీలక పదవులు కేటాయించింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు పార్టీలోని 24 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. జూలై 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ జరుగనున్న సంగతి తెలిసిందే. శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడుగా నియమితులు కాగా ఎమ్మెల్సీ పోతుల సునీతకు మహిళా విభాగం అధ్యక్ష పదవి ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం 24 అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయా నాయకుల అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులను అభినందిస్తున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విభాగం అధ్యక్షులు
- యువజన విభాగం బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి (నందికొక్కూరు)
- మహిళా విభాగం పోతుల సునీత, ఎమ్మెల్సీ (చీరాల)
- విద్యార్ధి విభాగం పోనుగంటి చైతన్య (గుంటూరు పశ్చిమ)
- రైతు విభాగం ఎంవిఎస్ నాగిరెడ్డి (గుడివాడ)
- బీసీ సెల్ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ ( గురజాల)
- ఎస్టీ సెల్ ఎం వెంకట లక్ష్మి (కొండ ప్రాంతం) పాడేరు
- ఎస్టీ సెల్ హనుమంత్ నాయక్ (మైదాన ప్రాంతం) మాచర్ల
- కార్మిక విభాగం పూనూరు గౌతమ్ రెడ్డి (విజయవాడ సెంట్రల్)
- వాణిజ్య విభాగం వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే (విజయవాడ వెస్ట్)
- పోలింగ్ బూత్ ఎ హర్షవర్ధన్ రెడ్డి (తాడికొండ)
- మైనార్టీ సెల్ హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే (కర్నూలు)
- సాంస్కృతిక విభాగం వంగపండు ఉష (విజయనగరం)
- వైఎస్ఆర్ సేవా దళ్ ఎం రుహుల్లా, ఎమ్మెల్సీ (విజయవాడ సెంట్రల్)
- డాక్టర్స్ సెల్ పితాని అన్నవరం (కాకినాడ రూరల్)
- సోషల్ మీడియా గుర్రంపాటి వెంకట దేవేంద్రరెడ్డి (మైదుకూరు)
- సోషల్ మీడియా పుట్ట శివశంకర్ (కమలాపురం)
- సోషల్ మీడియా చల్లా మధుసూధనరెడ్డి (కమలాపురం)
- సోషల్ మీడియా సామిరెడ్డి మధుసూధనరెడ్డి (నంద్యాల)
- ప్రచార విభాగం పుత్తా ప్రతాప్ రెడ్డి (కమలాపురం)
- ప్రచార విభాగం ఆర్ ధనుంజయరెడ్డి (రైల్వే కోడూరు)
- క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఫాదర్ మద్దు బాల స్వామి (తాడికొండ)
- పంచాయతీరాజ్ విభాగం మేకల హనుమంతరావు, ఎంపీపీ (పెదకూరపాడు)చీ
- ఉపాధ్యాయ విభాగం కల్పలతారెడ్డి , ఎమ్మెల్సీ (కదిరి)
- గ్రీవెన్స్ సెల్ అంకంరెడ్డి నారాయణమూర్తి (తుని)
- ఐటీ సెల్ సునీల్ పోసింరెడ్డి (నెల్లూరు)
- ఎన్ఆర్ఐ సెల్ మేడపాటి వెంకట్ (ఆచంట)
- వికలాంగుల విభాగం బందెల కిరణ్ రాజు (విజయవాడ సెంట్రల్)
- సెంట్రల్ ఆఫీస్ ఇన్ చార్జి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ (గుంటూరు)
- క్రమశిక్షణ కమిటీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ (బాపట్ల)