వైసీపీలోని వివిధ అనుబంధ సంఘాలకు ఆ పార్టీ అధిష్టానం అధ్యక్షులను నియమించింది. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మరేకు 22 అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు. యువజన విభాగం అధ్యక్షుడుగా శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి నియమితులైయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ పోతుల సునీతను నియమించారు. బీసీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎస్టీ సెల్ అధ్యక్షుడుగా మత్సరస వెంకట లక్ష్మి, రైతు విభాగం అధ్యక్షుడుగా ఎంవీఎస్ నాగిరెడ్డి, విద్యార్ధి విభాగం అధ్యక్షుడుగా పానుగంటి చైతన్య లు నియమితులైయ్యారు.
వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ (వైఎస్ఆర్ టీయుసీ) అధ్యక్షుడుగా గౌతమ్ రెడ్డి నియమితులైయ్యారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉష, ప్రచార విభాగం అధ్యక్షులుగా ఆర్ ధనుంజయ్ రెడ్డి, పుత్తా ప్రతాప్రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, న్యాయ విభాగం అధ్యక్షుడుగా ఎం మనోహర్రెడ్డి, ఐటీ విభాగం అధ్యక్షుడుగా సునీల్ పోసింరెడ్డి, ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడుగా మేడపాటి వెంకట్, వైయస్ఆర్ టీఎఫ్ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షేక్ వి. ఖాదర్బాషా, వైయస్ఆర్ సేవాదళ్అధ్యక్షుడుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డాక్టర్ల విభాగం అధ్యక్షుడుగా బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, క్రిష్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడుగా జాన్సన్ మేడిది, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా పల్లపోతు మురళీకృష్ణ, చిప్పగిరి ప్రసాద్ నియమితులైయ్యారు.
ఎన్నికలకు ముందు పార్టీ అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయడానికి అధ్యక్షులను నియమించారు. వెంటనే ఆయా అనుబంధ సంఘాలు పార్టీ శ్రేణులతో కలిసి వైసీపీ మరింత శక్తివంతం చేయడానికి కృషి చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆదేశించింది.
పర్చూరుకు ఆమంచి.. వెంకటగిరికి నెదురుమల్లి ఇన్ చార్జిలుగా నియమించిన వైసీపీ.. ఆనంపై వేటు