YSRCP: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ ఇటీవల దాదాపు 135 నామినేటెడ్ పోస్టులను భర్తీను భర్తీ చేసింది. పదవులు వచ్చిన వారు హాపీగా ఉన్నారు. ప్రాంతాలు, కులాలు, మతాల సమీకరణలతో పదవుల పందారం అయితే చేశారు గానీ కొన్ని చోట్ల స్థానిక ఎమ్మెల్యేలకు పెద్ద సమస్య అయ్యింది. నామినేటెడ్ పదవుల్లో వైసీపీ సర్కార్ ఎస్సీ, బీసీ, మైనార్టీ, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
Read More: Mysura reddy: గ్రేటర్ రాయలసీమకు ప్రత్యేక ప్రభుత్వం ఉండుంటే అంటూ మైసూరా సంచలన వ్యాఖ్యలు..
ఇక విషయానికి.. వస్తే రాష్ట్రంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం మినహా ఇతర ఆలయాలకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న స్థానిక నాయకులకే ఆయా ఆలయాల పాలకమండలి చైర్మన్ పదవులు దక్కుతుంటాయి. చిత్తూరు జిల్లాలో తిరుమల శ్రీవారి ఆలయం తరువాత శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు ప్రముఖ పుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి. ఈ ఆలయాల చైర్మన్ పదవులపై ఆ ప్రాంత వైసీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయా ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే ఈ రెండు ఆలయాల చైర్మన్ పదవులను స్థానికేతరులకు వైసీపీ ప్రభుత్వం అప్పగించింది.
శ్రీకాళహస్తి వైసీపీ నేతలు అక్కడి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ ను, కాణీపాకం ఆలయ చైర్మన్ పదవి విషయంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆలయ చైర్మన్ పదవులు స్థానికులకు కాకుండా వేరే వారిని నియమిస్తుంటే ఎలా అంగీకరించారంటూ ఆ ప్రాంత వైసీపీ నేతలు ఎమ్మెల్యేలను నిలదీస్తుంటే తమకు తెలియకుండానే నియామకాలు జరిగిపోయాయని చెబుతున్నారుట. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా సత్యవేడు మండలానికి చెందిన బీరేంద్ర వర్మ నియమితులు కాగా, కాణిపాకం ఆలయ చైర్మన్గా మాజీ ఎంపి జ్ఞానేంద్రరెడ్డి వదిన చిత్తూరుకు చెందిన ప్రమీలమ్మ రెడ్డి నియమితులయ్యారు. కాణీపాకం ఆలయ చైర్మన్ పదవిని స్థానికేతరులకు ఇవ్వడంపై ఆ ప్రాంత వైసీపీ నేతలు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దృష్టికి తెచ్చినా పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగారు. ఆలయ చైర్మన్ పదవి స్థానికేతరులకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరిస్తున్నారుట.
జిల్లా మంత్రి ఒత్తిడి కారణంగానే ఈ ఆలయాల చైర్మన్ పదవులు స్థానికేతరులకు ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దశాబ్ధాలుగా వస్తున్న ఆనవాయితీని కాదని స్థానికేతరులకు చైర్మన్ పదవులు ఇస్తే తమను నమ్ముకున్న నాయకులకు ఏమి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు మధనపడుతున్నారని సమాచారం. చిత్తూరు జిల్లాలో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసంతృప్తి వైసీపీ నేతలను ఏ విధంగా సమాధానపరుస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?