YSRCP: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేతలు పార్టీ జెండాలను ఎగురవేసి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జెండాలను ఎగురవేసి వేడుకలను నిర్వహిస్తున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందేశం ఇచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. “12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైయస్ఆర్ సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గత 12 ఏళ్లుగా నా ఈ ప్రయాణంలో నాతో నిలబడి, నాకు వెన్నుదన్నుగా ఉన్న ప్రతి ఒక్కరికీ, మన పార్టీ జెండాను తమ గుండెగా మార్చుకున్న నా కార్యకర్తలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రయాణం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ జగన్ ట్వీట్ చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఊహించని ట్విస్ట్ .. ఓ యువతి కోసం ఉద్యోగి నిర్వాకం బట్టబయలు..?
12 వసంతాలు పూర్తి చేసుకుని, నేడు 13 వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా వైయస్ఆర్ సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ @YSRCParty ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1/2 pic.twitter.com/Vfdm7MWeaj
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2023