NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అది టీడీపీ బలం కాదు .. సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించినా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకు తార్కారణమని, రాబోయే ఎన్నికల్లో విజయానికి టీడీపీ విజయానికి ఇది సంకేతమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఈ ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

sajjala Rama Krishna Reddy

 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు వైసీపీని బాగా ఆదరించారన్నారు సజ్జల. ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ఏదో అయిపోయిద్ది అని అనుకోవద్దని ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చురకలు అంటించారు. ఈ ఎన్నికల్లో ఓట్లు వేసింది సమాజంలోని చిన్న సెక్షన్ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ఇవి సొసైటిని రిప్రజెంట్ చేసేవి కావని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు అన్నీ టీడీపీవి కావనీ, పీడీఎఫ్, ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీకి వెళ్లాయని పేర్కొన్నారు. ఈ ఫలితంతో టీడీపీ బలం పెరిగిందని అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.  ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకత ను ప్రతిఫలించవని చెప్పారు. టీడీపీ సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని అన్నారు. ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదన్నారు. ఎందుకంటే ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదనీ, ఒక వర్గం ఓటర్లను సమాజం మొత్తానికి ఎలా ఆపాదిస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు ఎక్కువగా లేరని సజ్జల అన్నారు. యువతకు పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ లు జారీ చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా టీడీపీ పోటీ చేస్తొందనీ, తెలంగాణ తరహాలోనే టీడీపీ ప్రయత్నాలు చేయొచ్చని సజ్జల అభిప్రాయపడ్డారు. అయితే.. తొలి సారి టీచర్ ఎమ్మెల్సీలు గెలవడం తమకు పెద్ద విజయమని అన్నారు సజ్జల. ఉపాధ్యాయులు తమను బాగా ఆదరించారని చెప్పారు. “మా ఓటర్లు వేరే ఉన్నారు, మాకు సంతృప్తికరంగానే ఓట్లు వచ్చాయి. అలాగని ఈ పలితాలు ఎలాంటి ప్రభావం చూపవు” అని సజ్జల స్పష్టం చేశారు.

నాలుగేళ్లలో మొదటి సారి టీడీపీలో ఉత్సాహం .. రెండు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ విజయంతో..

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju