YSRCP: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటి పోయింది. అయితే పార్టీ అధికారంలోకి వస్తే తమకు తిరుగు లేదు కాలర్ ఎగరేసుకుని తిరగవచ్చు, ఏ పని అయినా చేయించుకోవచ్చు అనుకున్న కేడర్ కు మాత్రం సరైన గుర్తింపు లేదనే ఆవేదన ఉంది. ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి ఎన్నికల తరువాత పార్టీలో చేరి ఎమ్మెల్యేలకు భజన చేస్తూ వారి పక్కన తిరిగే వాళ్ల హవానే నడుస్తుందని కొన్ని చోట్ల నుండి వ్యాఖ్యానాలు వినబడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ వ్యవహారాలపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో పార్టీ అనుబంధ సంఘాలు బలోపేతం కావడం లేదన్న మాట వినబడుతోంది.
Read More: AP High Court: రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక తీర్పు..రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..
YSRCP: జెండా మోసిన కార్యకర్తలకు ఆదరణ కరువు..?
క్షేత్ర స్థాయిలో జెండా మోసిన వారిపై పార్టీ నేతలు కన్నెత్తి చూడటం లేదనీ వారికి ఆదరణ కొరవడిందని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షించి సరి చేయాల్సిన అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. బూత్ కన్వీనర్లు మండల స్థాయి కన్వీనర్ లకు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అంటున్నారు. వాలంటీర్లతోనే మొత్తం అన్ని వ్యవహారాలను జరిపించేస్తుంటే పార్టీ కార్యకర్తల మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ల నియామక సమయంలోనూ పార్టీ కోసం పని చేసి వారికి కాకుండా ఎమ్మెల్యేలకు అనుకూలమైన వారినే నియమించుకున్నారని దీంతో వారు పార్టీ కార్యకర్తల మాట లెక్కచేయడం లేదని వాపోతున్నారు.
పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి
ఈ తరుణంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రీసెంట్ గా పార్టీ అనుబంధ సంఘాల ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డిని నియమించారు. ఆయనకు రాజ్యసభ రెన్యువల్ చేయకుండా ఉండేందుకే ఈ పదవి ఇచ్చారన్న మాట వినబడుతోంది. ఈ తరుణంలో ఇన్ చార్జిగా బాధ్యతలు చేపట్టిన విజయసాయిరెడ్డి క్షేత్ర స్థాయిలో క్యాడర్ పరిస్థితులను తెలుసుకుని సరి చేయగలరా..? అని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్న విజయసాయిని పార్టీకే పరిమితం చేస్తారనడం పట్ల అభిమానులు నిరుత్సాహపడుతున్నారుట.