Sharmila : తెలుగు రాజకీయాలలో షర్మిల కొత్త పార్టీ న్యూస్ కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. పార్టీ పెట్టొద్దు అని జగన్ మరియు వైసీపీ పార్టీకి చెందిన పెద్దలు నిలువరించినట్లు..అయినా కానీ ఆమె వెనక్కి తగ్గనట్లు ఇటీవల వైసీపీ పార్టీ పెద్దలు చెప్పటం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఆమె సొంత నిర్ణయమని.. ఆ నిర్ణయానికి వైసీపీ కి ఎటువంటి సంబంధం లేదని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి…జగన్ కి అత్యంత సన్నిహితులు తెలపటం జరిగింది. ఇటువంటి తరుణంలో వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తాజాగా షర్మిల తో ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ తో ఆర్కే భేటీ అవ్వటం తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
జగన్ దూతగా షర్మిల తో మాట్లాడటానికి ఆళ్ల రామకృష్ణా రెడ్డి రంగంలోకి దిగినట్లు.. కొత్త పార్టీ విషయంలో షర్మిల ని వెనక్కి తగ్గిన ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. దీంతో జగన్ ఆలోచన మేరకు షర్మిల వెనక్కి తగ్గుతుందా లేదా ముందుకు దూసుకుపోతున్న అన్నది ఆసక్తికరంగా ఉంది. మరో పక్క చూస్తే తెలంగాణలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయటానికి గ్రౌండ్ స్థాయి నుండి చకచకా పనులు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 21వ తారీఖున ఖమ్మం జిల్లాలో వైఎస్ అభిమానులతో మరియు ఆయనతో పనిచేసిన నాయకులతో ఆత్మీయులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. అంతేకాకుండా గిరిజనులతో కూడా సమావేశం అవటానికి షర్మిల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి రాకతో షర్మిల వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది సస్పెన్స్ గా నెలకొంది.