Ysrcp : పంచాయతీ ఎన్నికలలో వైసిపి పార్టీ ఊహించని రీతిలో ప్రజాక్షేత్రంలో మొదటి విడతలో రాణించిన సంగతి తెలిసిందే. దాదాపు మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 3249 స్థానాలలో ఎన్నికలు జరగగా దాదాపు 2640 చోట్ల వైసీపీ గెలవడం అందరికీ తెలిసిందే. ఏకగ్రీవ లలో కూడా ఊహించని రీతిలో స్థానాలు రాబట్టిన అధికార పార్టీ వైసీపీ.. ప్రజా క్షేత్రంలో కూడా రికార్డు స్థాయిలో స్థానాలు గెలవడంతో వైసిపి శ్రేణులలో ఉత్సాహం నెలకొంది. 2019 ఎన్నికలలో ప్రజలలో ఉన్న పాజిటివ్ వాతావరణం ఇంకా అదే రీతిలో ఉంది అని నిరూపించుకోవడానికి జగన్ సర్కార్ ఎన్నికల్లో కీలకంగా రాణించడం జరిగింది.
ఈ క్రమంలో టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని టార్గెట్ గా చేసుకుని బరిలోకి దిగిన వైసీపీ..ఒకప్పుడు టీడీపీ పార్టీకి కంచుకోట గా ఉండే మండలాలలో కుప్పం టౌన్, గుడిపల్లె, శాంతిపురం, రామకుప్పం వంటి చోట్లఈ మంపంచాయతీ ఎన్నికలలో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. స్వయంగా చంద్రబాబు మరియు లోకేష్ పర్యవేక్షణలో రాజకీయం నడిచే ఈ మండలాలలో… ఎలాగైనా వైసీపీ విజయం సాధించే దిశగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా రాణించినట్లు సమాచారం.
Ysrcp : చంద్రబాబు అడ్డా లోనే వైసీపీ
ఇక మొత్తం పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఏమాత్రం టీడీపీ రాణిస్తుందో అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సస్పెన్స్ నెలకొంది. పంచాయతీ ఎన్నికల టైంలో.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో వ్యవహరిస్తున్నట్లు… మంత్రి పెద్దిరెడ్డి మీడియా ముందే ఆరోపించడం అందరికీ తెలిసిందే. కాగా ఈ పరిణామంతో పంచాయతీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చంద్రబాబు అడ్డా లోనే వైసీపీ జెండా ఎగిరేలా పెద్దిరెడ్డి వెనకుండి చక్రం తిప్పినట్లు… తనని హౌస్ అరెస్టు చేయాలని, మీడియా ముందు రాకుండా చేయాలని నిమ్మగడ్డ, బాబు వేసిన ఎత్తుగడలకు సరికొత్త రివేంజ్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.