YSRCP: ఏపిలో అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జూలై 8,9 తేదీలలో రెండు రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రకటించారు. ఈ వేడుకల నిర్వహణకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్లీనరీ వేదికను ఆ పార్టీ నేతలు ఖరారు చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీ నిర్వహిస్తామని వైసీపీ వెల్లడించింది. పార్టీ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడంతో పాటు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సారి పార్టీ ప్లీనరీని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు ప్రారంభించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇటీవలే తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో జరిగిన విషయం తెలిసిందే. ఈ మహానాడుకు ఆ పార్టీ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది హజరై సక్సెస్ కావడం ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు వైసీపీ దానికి ధీటుగా ప్లీనరీకి జనసమీకరణ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలన్న ఆలోచనలో ఉంది. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి కమిటీల ఏర్పాట్లలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.