NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకే వైసీపీ మద్దతు .. ఇదీ ప్రూఫ్..

YSRCP: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ అభ్యర్ధి గెలుపునకు తటస్థంగా ఉన్న వైసీపీ, బీజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలే కీలకమన్న సంగతి తెలిసిందే. ఈ రెండు పార్టీల మద్దతు ఇస్తే ఎన్డీఏ అభ్యర్ధి గెలుపు ఖాయం. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఏమిటి.. కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ ఎంపీలు పేర్కొంటూ వచ్చారు. అయితే నిన్న అధికార ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

YSRCP support decided in presidential poll
YSRCP support decided in presidential poll

YSRCP: ద్రౌపది ముర్మును కలిసి అభినందనలు తెలిపిన విజయసాయి

ఒడిషాకు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ స్టాండ్ స్పష్టం అయ్యింది. స్వరాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ది కావడంతో బీజేడీ మద్దతు ఖాయమైంది. ఇదే క్రమంలో ఏపీలోని వైసీపీ మద్దతుపైనా ఒక క్లారిటీ వచ్చేసింది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేడు ద్రౌపది ముర్మను కలిసి అభినందనలు తెలియజేశారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతోనే విజయసాయి రెడ్డి ఆమెను కలిసి ఉంటారు. సో..బీజేపీ ప్రకటించిన ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి వైసీపీ మద్దతు ఖాయమైనట్లు దీన్ని బట్టి అర్ధం అవుతోంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిత్వం విషయంలో చత్తీస్‌ఘడ్ గవర్నర్ అనసూయ ఉయికీ పేరును బీజేపీ పరిశీలిస్తున్న సమయంలో మూడు రోజుల క్రితం విజయసాయిరెడ్డి చత్తీస్‌ఘడ్ వెళ్లి రాజ్‌భవన్ లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి జ్ఞాపికను అందజేసి వచ్చారు. దాంతోనే ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతు అని ఒక క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది.

YSRCP: వైసీపీ ఓటు విలువ 45,957

అయితే బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో మొత్తం 20 మంది పేర్లపై చర్చలు జరిపిన తరువాత తొలి సారిగా గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలని భావించి ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ద్రౌపది ముర్మును కలిసి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీకి 22 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు, 151 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాష్ట్రం నుండి మొత్తం 53,513 ఓట్ల విలువ ఉండగా, వైసీపీకి ఉన్న సంఖ్యాబలం కారణంగా 45,957 ఓట్ల బలం ఉంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju