వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా రెండు రోజుల క్రితం హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి పార్టీ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ ను హ్యాకర్ లు మార్చేశారు. ఇందులో క్రిప్టో కమ్యునిటీ పోస్టులు పెట్టారు. ప్రొఫైల్ పిక్ తో పాటు బయోడేటా వివరాలను మార్చేశారు. శుక్రవారం రాత్రి నుండే వైసీపీ ట్విట్టర్ ఖాతాలో పార్టీకి, ప్రభుత్వానికి సంబంధం లేని పోస్టులు వెలువడ్డాయి. క్రిప్టో కు సంబంధించిన పలు ట్వీట్లు పార్టీ ఖాతాలో ప్రత్యక్షం అయ్యాయి. పార్టీ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు క్రిప్టో కు సంబంధించిన సమాచారాన్ని రీట్వీట్ చేశారు. ఎలాన్ మస్క్ ఎన్ఎఫ్టీలు ప్రీగా ఇస్తున్నారని రీ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ఎకౌంట్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉంచేసిన హ్యాకర్లు .. బయోను మాత్రం ఎన్ ఎప్టీ మిలియనీర్, అమెరికా అని మార్చేశారు.
తమ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ కు గురైన విషయాన్ని వెంటనే వైసీపీ సాంకేతిక బృందం ట్విట్టర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ కు సమాచారం ఇచ్చింది. తీవ్రంగా శ్రమించిన ట్విట్టర్ టీమ్ ఆదివారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాను పునరుద్దరించింది. తమ ఖాతా పునరుద్దరణపై వైసీపీ స్పందించింది. హ్యాకింగ్ అనంతరం తొలి ట్వీట్ చేసింది. “గతంలో ఎన్నడూ లేని విధంగా మా ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. గత 36 గంటలుగా మా ట్విట్టర్ ఖాతా మా ఆధీనంలో లేదు. ఇప్పుడు మా ట్విట్టర్ ఖాతా పునరుద్దరించారు. ఈ సహాయానికి ట్విట్టర్ మద్దతు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ లో పేర్కొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ కు దాదాపు 8 లక్షల 50వేలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
జగన్ సర్కార్ కీలక ఆదేశాలు .. వారికి ఆర్ధిక సాయం
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?