Eluru Elections: ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ లో వైసీపీ విజయ దుంధుబి మోగించింది. మొత్తం 50 డివిజన్ లకు గానూ మూడు డివిజన్ లు వైసీపీ ఏకగ్రీవం అవ్వగా 47 డివిజన్ లకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన 47 డివిజన్ లలో 44 వైసీపీ కైవశం చేసుకోగా ముడు డివిజన్ లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు విజయం సాదించారు. 47 డివిజన్ లు వైసీపీ కైవశం చేసుకోవడంతో ఆ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 28,37,47 డివిజన్లలలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా మిగిలిన అన్ని డివిజన్లను వైసీపీ కైవశం చేసుకుంది.
మేయర్ పదవిని ఈ సారి జనరల్ మహిళకు కేటాయించారు. వైసీపీ మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ ను ఆ పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. 50వ డివిజన్ నుండి నూర్జహన్ బేగం విజయం సాధించారు. మేయర్ స్థానాన్ని అయిదుగురు ఆశిస్తున్న నేపథ్యంలో వైసీపీ..సంవత్సరానికి ఒకరు చొప్పున అంటూ ప్రతిపాదన చేశారు. మేయర్ రేసులో ఉన్న మిగిలిన నలుగురు డిప్యూటి మేయర్లుగా కూడా పార్టీ ప్రకటించింది.
47 డివిజన్ లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఏలూరులో పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ క్యాడర్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తున్నారు. విజయం సాధించిన కార్పోరేటర్ లను కార్యకర్తలు, నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు.