YSRCP: సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా ఎమ్మెల్యే గా ఎన్నికైన నాయకుడు మంత్రి పదవి ఆశిస్తుంటారు. మంత్రి పదవికి సమాన స్థాయి నామినేటెడ్ పోస్టు ఇచ్చినా అంతగా సంతృప్తి చెందలేరు. తాము అభిమానించే నాయకుడు మంత్రి పదవి ఆశించాలని ఆయా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు కోరుకుంటుంటారు. అయితే మంత్రి పదవి వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ఆ నేతకు పార్టీలో ఓ కీలక పదవి అప్పగిస్తే ఇక మంత్రి పదవి రానట్లేనని తెలిపోతుంది. కాకపోతే తమ అభిమాన నాయకుడికి కీలకమైన పదవి లభించినందుకు సంతోషించడం తప్ప చేసేది ఏమీ ఉందడు. ఆ పరిస్థితి విశాఖ జిల్లాలోని ఓ యువ ఎమ్మెల్యేకి ఏర్పడింది.
YSRCP: మంచి వాగ్దాటితో దూకుడుగా
విషయంలోకి వెళితే… విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ సీఎం జగన్ కు వీర విధేయుడుగా పేరుంది. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన అమరనాధ్ మంచి వాగ్దాటితో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. అమరనాధ్ దూకుడు స్వభావం నచ్చిన జగన్మోహనరెడ్డి జిల్లాలో ఎంతో మంది సీనియర్ లు ఉన్నా వారిని కాదని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ అమరనాధ్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అమరనాధ్ ఓటమి పాలైనా పార్టీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ వచ్చారు. దీంతో 2019 ఎన్నికల్లోనూ సీనియర్ నేత దాడి వీరభద్రరావు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి గుడివాడ అమరనాథ్ కు అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో 8వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో అమరనాధ్ విజయం సాధించారు.
పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు
సీఎం జగన్మోహనరెడ్డికి అమరనాధ్ సన్నిహితుడు కావడంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి లభిస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ తరుణంలో అమరనాథ్ కి అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు వైఎస్ జగన్. మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పట్లో లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. అమరనాథ్ కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించినందుకు క్యాడర్ సంతోషంల ఉన్నా కానీ మంత్రి పదవి దక్కక పోతుండటం పట్ల నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?