YV Subba Reddy: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత వీరికి ఆలయ చైర్మన్ సోమినాయుడు, ఇఓ భ్రమరాంబ ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రెండవ సారి టీటీడీ చైర్మన్ గా నియమితులైన వైవీ సుబ్బారెడ్డి నిన్న తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
తొలుత రెండవ సారి టీటీడీ చైర్మన్ పదవిని స్వీకరించడానికి అయిష్టత వ్యక్తం చేసిన వైవీని చివరికి పార్టీ పెద్దలు ఒప్పించారు. టీటీడీ చైర్మన్ గా రెండవ సారి బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ముందుగా నేడు దుర్గమ్మను ఆయన సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ , ఇఓలు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంలోనే పలువురు ప్రముఖులు టీటీడీ చైర్మన్ గా మరో సారి నియమితులైన వైవీ సుబ్బారెడ్డిని అభినందంచారు.