NewsOrbit

Author : siddhu

https://newsorbit.com - 65 Posts - 0 Comments
Featured న్యూస్ రివ్యూలు సినిమా

Nithin check movie Review : చెక్ మూవీ రివ్యూ

siddhu
check movie Review : నితిన్ హీరోగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్‘ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మనమంతా’ చిత్రం తర్వాత నాలుగేళ్ల గ్యాప్ తో...
న్యూస్ బిగ్ స్టోరీ

అన్నీ బ్యాడ్ న్యూస్ ల మధ్యలో జగన్ సర్కార్ కి సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హై కోర్టు !

siddhu
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం హైకోర్టులో అట్టర్ ఫ్లాప్ అవుతోంది. దీంతో వైయస్ జగన్ కి అసలైన ప్రతిపక్షం రాజకీయ పార్టీలు కాదని హైకోర్టు అంటూ నెటిజన్ల...
బిగ్ స్టోరీ

కూతురు – మేనల్లుడు అలా చేయడం చూసిన మామ స్పాట్ రియాక్షన్ ఇదే !

siddhu
సమాజంలో రోజురోజుకీ మానవ విలువలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. టెక్నాలజీ పుణ్యమో లేకపోతే సినిమాల పుణ్యమో తెలియదుగానీ మనిషి ఆలోచనలు మృగం కంటే హీనంగా మారుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు కూడా బిడ్డలను అలానే పెంచుతున్నారు. ఎవరైనా...
బిగ్ స్టోరీ

జగన్ కే ఎందుకులా జరుగుతోంది – సీక్రెట్ కారణం ఇదేనా ?

siddhu
జగన్ రాజకీయాల్లో అడుగు పెట్టిన నాటి నుండి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. 2009 ఎన్నికల్లో జగన్ ఎంపీ అవటం ఆలస్యం తండ్రి వైయస్ చనిపోవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక...
బిగ్ స్టోరీ

మహానాడు పూర్తయిన 24 గంటల్లోనే చంద్రబాబు కి ఊహించని వార్త!

siddhu
  సాధారణంగా ప్రజల ప్రయోజనాలు మరియు వారి అభివృద్ధే లక్ష్యంగా రాజకీయ పార్టీలు పని చేయాలి. అంతేకానీ కక్ష సాధింపు చర్యలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయే సభల వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కానీ నయాపైసా ఉపయోగం కూడా ఉండదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కి అర్ధం కానట్లుంది. ప్రతి సంవత్సరం టిడిపి నిర్వహించుకునే ‘మహానాడు’ ఈసారి డిజిటల్ మహానాడు గా జరిగిన విషయం తెలిసిందే. సాధారణంగా మూడు రోజులు జరిగే మహానాడుని కరోనా ప్రభావం వల్ల రెండు రోజులకే కుసించారు. ప్రతి సంవత్సరం అయితే ఈ మహానాడు లో పార్టీ లోని లోపాలు మరియు పార్టీ కేడర్ ను పటిష్టం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు చర్చిస్తారు. కానీ ఈసారి మహానాడు అందుకు పూర్తిగా విరుద్ధంగా జరిగింది. జరిగిన రెండు రోజులు కూడా కేవలం జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికే సమయం మొత్తాన్ని ఉపయోగించారు. చంద్రబాబు ఈసారి వారి నాయకుల మధ్య జరిగిన చర్చలు మరియు చేసుకున్న తీర్మానాల తీరు విచిత్రంగా ఉంది. రెండు రోజులు జరిగిన ప్రసంగాలు అన్నీ జగన్ చుట్టూ తిరగడం మరియు చంద్రబాబు గత పాలనను పొగడటం…. జగన్ చేస్తున్న ప్రస్తుత పాలనపై బురద చల్లడంతోనే కాలం గడిచిపోయింది. సరే ప్రభుత్వంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడంలో తప్పేముంది అని అనుకుందా…. అయితే ప్రభుత్వానికి సంబంధం లేని విషయాలకు ఇక్కడ జగన్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసం? మహానాడు జరిగిన 24 గంటల్లో బయటకు వచ్చిన రిపోర్టులను పరిశీలిస్తే చంద్రబాబు కి పెద్ద షాక్ తగిలింది అనే చెప్పాలి. ఈసారి మహానాడు అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోగా ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు మరియు ప్రతిపక్షాలు చేసిన రచ్చ ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇక అన్నదాత వెన్నువిరవటం గురించి కూడా తప్పుడు ఆరోపణలు, కథనాలే రాయిస్తున్నారు అని రిపోర్టులు తేల్చి చెప్పేశారు. ఇక రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశారు అన్నదానికి ఆధారాలు లేవు కానీ అధికార పార్టీ మాత్రం నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు వేయడం ఇంకా ఏడాది కాకుండానే రెండుసార్లు అకౌంట్లోకి నగదు జమ చేసిన తీరు ఇప్పుడు బాబు అన్న మాటలను నవ్వులపాలు అయ్యేలా చేసింది. ఇదిలా ఉండగా కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం పంటలను పొలాల దగ్గరికి వెళ్లి కొనుగోలు చేసింది. ఇన్ని సానుకూలాంశాల మధ్య మరలా సాగునీటి ప్రాజెక్టులు సంక్షోభంలో పడ్డాయి అవాస్తవ ప్రచారానికి మహానాడుని ఉపయోగించుకున్న తీరు రిపోర్ట్ లో స్పష్టంగా కేంద్రీకృతమైంది. కరోనా సంక్షోభం కారణంగానే పోలవరం తదితర ప్రాజెక్టుల పనులు ఆగాయని బాబు తెలుసుకోలేని తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగానో లేకపోతే ప్రభుత్వాన్ని నిందించటానికి, బురద చల్లటానికే మహానాడు పరిమితం కాకుండా ఆత్మ పరిశీలన కూడా చేసుకునుంటే బాగుండేది.. లేకపోతే ఇటువంటి మహానాడులు ఎన్ని జరుపుకున్నా ఉపయోగం ఉండదని చంద్రబాబు గ్రహించాలి....
బిగ్ స్టోరీ

టాప్ మినిస్టర్ కి జగన్ క్లాస్… నిఘా పెట్టి మరి నిజాలు లాగిన సి‌ఎం?

siddhu
అవకాశం దొరకాలే కానీ రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్న తమ చేతిలో పదవి మరియు అధికారం ఉంటే అవినీతి సొమ్ముని సంపాదించుకునేందుకు వెనుకాడరు. అసలు అలాంటి ఉద్దేశం లేని నాయకుడు ఒక రాజకీయ నాయకుడే కాదు అనే రేంజ్ లో నేటి తరం నాయకులు బ్రతుకుతున్నారు. ఈ విషయానికి ఎవరూ అతీతులు కాదు అన్న విషయం యావత్ ప్రజానీకం గుండెల్లో బలంగా పాతుకుపోయింది. పార్టీ అధినేత తమను పట్టించుకోకపోతే చాలు…. నాయకులు అవకాశం వెత్తుక్కొని మరీ చెలరేగిపోతారు.. దొరికిన కాడికి దోచేసుకుంటారు. ఫలితంగా అవినీతి కంపు రాష్ట్రవ్యాప్తంగా పాకుతుంది. గతంలో అవినీతి నేతలను మొదట్లో కంట్రోల్ చేసిన చంద్రబాబు చివరి రెండేళ్ళలో పూర్తిగా చేతులెత్తేయడమే ఆ పార్టీ ఘోరంగా పరాజయం పాలవడానికి గల కారణాల్లో ఒకటిగా నిలిచింది అని పలువురు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. మరి పరిస్థితి అలా జరిగితే ఒక్క తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉన్న ఏ పార్టీ అయినా మట్టికొట్టుకునిపోవడం ఖాయం. అందుకే అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండి జగన్ అటు అధికారులతో పాటు ఇటు సొంత ఎమ్మెల్యే లను మరియు మంత్రులను హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో రాజకీయ నాయకుల స్వభావంపై ఎటువంటి నమ్మకం లేని జగన్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మరియు రూల్స్ ఎంత కఠినం చేసినా అనివార్య పరిస్థితుల్లో పరిస్థితి తప్పు దారి పట్టే ప్రమాదం ఉందని గమనించిన ఆయన పురపాలక శాఖ శాఖ, ఎక్సైజ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, గ‌నుల శాఖ‌ వంటి కీలక శాఖల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ రిపోర్టు కూడా తీసుకుంటున్నారని గతంలోనే వైసీపీలో చర్చకు వచ్చింది. ఇక మహిళా మణులు మంత్రులుగా శాఖల్లో వారి భర్తలు చక్రం తిప్పుతున్నారు అని జగన్ కు సమాచారం అందింది. అయితే తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి విషయంలో ఇదే జరిగే సరికి జగన్ సదరు మినిస్టర్ కి గట్టిగానే క్లాస్ పీకారన్న ప్రచారం తాజాగా వెలుగు చూసింది. బదిలీలు, ప్రమోషన్లు విషయంలో అతని చేతులు టేబుల్ కిందకి వెళ్లాయని మరియు దీనికి సంబంధించి ఒత్తిళ్లు పెరగడంతో జగన్ ఇక జోక్యం చేసుకోక తప్పలేదని వైసిపి వర్గాల్లో ఈ విషయం మారుమోగుతుంది. ఇదే విధంగా మిగిలిన శాఖల్లోనూ ఇదే తరహాలో కొన్ని ఫిర్యాదులు అందాయని వారికి కూడా జగన్ చాలా గట్టిగా క్లాస్ పీకిన ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయనకు అత్యంత విశ్వాస పాత్రులుగా ఉన్నవారిని తీసుకుని వచ్చి ఆయా శాఖలకు పీఆర్వో లుగా, ముఖ్య కార్యదర్శులుగా నియమించి ఎటువంటి అవినీతి జరిగేందుకు వీలు లేకుండా జగన్ చేసేశారట. దీంతో స‌ద‌రు మంత్రులు ఇప్పుడు అడుగు ఎటు తీసి ఎటు వేయాల‌న్నా కూడా హ‌డ‌లి పోతున్నార‌ని, వారు ఏం చేసినా క్షణాల్లోనే జ‌గ‌న్‌కు స‌మాచారం వెళ్తోంద‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు మంత్రుల శాఖ‌ల‌కు సంబంధించి స‌మీక్షలు కూడా నేరుగా సీఎం చేసే ప‌రిస్థితి ఉందంటున్నారు...
5th ఎస్టేట్

జగన్ చేసే పనులకి చంద్రబాబు  సెటైర్ అద్దిరింది గురూ ! 

siddhu
తెలుగుదేశం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని సంపాదించేందుకు మహానాడు ని ఉపయోగించుకుంటున్న విషయం తెలిసిందే.లాక్ డౌన్ కారణంగా నేరుగా పార్టీ కార్యకర్తలతో మరియు నాయకులతో భేటీ కాలేని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లోనే మహానాడు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దానిని వాయిదా వేద్దాం అనుకుంటే సరిగ్గా జగన్ సర్కారు ఏర్పడి ఏడాది పూర్తయిన కారణంగా అతని పార్టీని ఎత్తిపొడవడానికి ఇదే సరైన సమయం అని బాబు భావించి ఎట్టిపరిస్థితుల్లో మహానాడుని నిర్వహించాలి అని ఫిక్స్ అయ్యారు. అయితే పార్టీ ప్రక్షాళన విషయంపై ఫోకస్ చేయడం మానేసి జగన్ సర్కార్ ని ఆడిపోసుకునే<దుకే నేతలు ఎక్కువగా ఇక్కడ సమయం వెచ్చించడం గమనార్హం. ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం పై వెటకారంగా వ్యాఖ్యలు చేసేందుకు ఎప్పుడూ ముందు ఉండే చంద్రబాబు ఈసారి అదే శైలిలో జగన్ ను ‘ది జంగిల్ రాజ్’ అని సంబోధించడం గమనార్హం. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చేసిన విమర్శలు ఈసారి కొద్దిగా ఘాటుగా ఉన్నాయి.  అధికారంలోకి వచ్చిన మొదట్లో ప్రజా వేదికను కూల్చేసిన జగన్ తాజాగా జరిగిన మూడు లాంతర్ల స్థంభాల వరకు అనేక కూల్చివేతకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఎద్దేవా చేశారు. జగన్ కి జంగిల్ రాజ్ అన్నా పేరుని ఒక కౌంటర్ గా సిద్ధం చేసుకున్న చంద్రబాబు అతని  సంవత్సరపు పాలనను ఉదాహరణగా చూపిస్తూ అతనికి ఈ పేరు పెట్టానని వివరించారు....
5th ఎస్టేట్

చంద్రబాబు తన ఫోన్ నుంచి డయల్ చేసినా ఎత్తని ఎమ్మెల్యే…!

siddhu
చాలా రోజులు గ్యాప్ తర్వాత బాబు రాష్ట్రం లోకి ప్రవేశించిన వెంటనే వైసీపీ పై ఎదురు దాడి చేసేందుకు మహానాడు ని తల పెడుతున్న ప్రస్తుతం వారి పార్టీలో ఉన్న 23 ఎమ్మెల్యేల లో ఎంతమంది ఉంటారో ఎంతమంది జంప్ అవుతారో తెలియని పరిస్థితి. ఇక మహానాడు సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే చాలా యాక్టివ్ గా పాల్గొనవలసి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫ్యూచర్ ప్లాన్స్ పైన చర్చ మరింత జోరందుకుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం వంటివారు తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీ చెంతకు చేరారు. ఇప్పుడు వారితో పాటు మరో ముగ్గురు లైన్ లో ఉన్నారని వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అంతెందుకు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా ఛానల్స్ లోనే ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారు అంటూ ఖచ్చితమైన వార్తలు వస్తున్నాయి. పేపర్లలో అయితే కథనాలు బలంగా వినిపిస్తున్నారు. వారిలో ఒకరు ప్రకాశం జిల్లా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కాగా మరొకరు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కూడా జగన్ చెంతకు చేరనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే వీరందరిలో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అయితే పార్టీలోని చాలా కీలక వ్యక్తి. ఈ న్యూస్ తెలుసుకున్న వెంటనే టిడిపి అధినేత రంగంలోకి దిగి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఏలూరు సాంబశివరావు మరియు గొట్టిపాటి రవి వారి నిర్ణయాలను మార్చుకునే ఛాన్సులు ఉన్నా కూడా సత్య ప్రసాద్ విషయంలో మాత్రం చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారు అని తెలుస్తోంది. పార్టీలో మహానాడు ప్రారంభించిన నేపథ్యంలో ఇతర నాయకులలో ఉన్న జోష్ అనగాని లో ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఏకంగా చంద్రబాబు గారు మహానాడులో పాల్గొనేందుకు అనగాని కి స్పెషల్ ఫోన్ కాల్ చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు అంటే విషయం అర్థం చేసుకోవచ్చు ఇక అటువైపు నుండి జగన్ కూడా సత్యప్రసాద్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారని వైసిపి వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది. ఇప్పటికే రేపల్లె నుండి వైసిపి నాయకుడిగా మోపిదేవి రమణ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలోని బలమైన నాయకుడిగా ఉన్న అనగానిని వైసీపీ వైపు వస్తే ఇక ఆ జిల్లాలో తమకు ఎదురే ఉండదు అన్నది జగన్ వ్యూహం. రెండు సార్లు గెలిచి రేపల్లె లో మంచి పట్టు సంపాదించుకున్న అనగాని సత్యప్రసాద్ తో వారి ఓటు బలాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్నది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది....
5th ఎస్టేట్

వాట్సాప్ లో ఆర్డర్ చేస్తే గుమ్మం దగ్గరకి సరుకులు!

siddhu
  కరోనా ప్రభావం వల్ల లాక్ డౌన్ మొదలైన తొలినాళ్లలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సంశయించేవారు. ఒకేసారి ఒక్కరే బయటికి వెళ్లి 4 రోజులకు సరిపడా సరుకులు తెచ్చుకుని ఇంట్లోనే కాలం గడిపిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు సడలింపులు ఇచ్చిన తర్వాత అసలు కరోనా అన్న పదమే మాకు తెలియదు అన్నట్లు రోడ్ల మీద ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. సాయంత్రం వరకు షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడం మరియు ప్రజలు ఒకే చోట గుమిగూడి, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా షాపింగ్ లంటూ తిరుగుతూ ఉండటం కూడా గత వారం పది రోజులుగా కామన్ అయిపోయింది. అయితే రెడ్ జోన్స్ మరియు కంటెంట్ క్లస్టర్స్ ఉన్న ఏరియాల్లో మాత్రం ఇప్పటికీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఈ సమయంలోనే ఆన్ లైన్ సేవలను వారి ఉపయోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో ఈ కార్ట్ సంస్థలు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో మార్ట్ సేవలను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ముంబై, పూణే లలో  మాత్రమే జియో మార్ట్ సేవలను ప్రారంభించారు. అయితే కొద్ది కాలంలోనే ఆ సేవలు విస్తరించేందుకు జియో సంస్థ తన ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీంతో దేశవ్యాప్తంగా 200 పట్టణాలలో ప్రస్తుతం జియో సేవలు వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫేస్ బుక్…. జియో లో పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్త కొద్దిరోజుల ముందే దేశవ్యాప్తంగా హల్ చల్ చేసింది. ఇప్పుడు దీనివల్ల వాట్సాప్ ద్వారా జియో మార్ట్ సేవలను వినియోగదారులు పొందే అవకాశం లభించింది. మనం రోజు మెసేజింగ్ మరియు స్టేటస్ అప్ లోడ్ చేసుకునేందుకు ఉపయోగించే వాట్సాప్ ద్వారా మనకు కావాల్సిన సరుకులను ఆర్డర్ చేస్తే కొద్ది గంటల్లోనే మన ఇంటి వద్దకే సరుకులను డెలివరీ చేస్తారు. అయితే జియో లో ఫేస్బుక్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ సంస్థలు కూడా భారీ ఎత్తున వాటాలను కొనుగోలు చేశాయి. ఈ క్రమంలో త్వరలో జియో మార్ట్ సేవలను దేశంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం…? ఈ వాట్సాప్ నెంబర్ ను జియో మార్ట్ కు లింక్ చేసి మీ పట్టణంలో ఈ సేవలు పొందవచ్చో కూరగాయలను డోర్ డెలివరీ చేయించుకోచ్చో లేదో చెక్ చేసుకోండి....
5th ఎస్టేట్

40 ఇయర్స్ ఇండస్ట్రీ గారికి క్వారంటైన్ లేదా మాస్టారు?

siddhu
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు తన సొంత రాష్ట్రానికి దూరమై అచ్చంగా 68 రోజులు అవుతోంది. ఇకపోతే ఈ రోజునే బాబుగారు ఆంధ్రాలో ల్యాండ్ అయి నేరుగా అమరావతి లోని తన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన విశాఖ ఎల్జి దుర్ఘటన బాధితులను పరామర్శిస్తారు అని తెలుస్తోంది. ఆ తర్వాత కూడా నేరుగా వెంటనే అమరావతి లోని తన స్వస్థలానికి వెళ్లి ఇంటిలో సేద తీరుతారు. అయితే ఇదంతా మీడియా ద్వారానే తెలిసింది తప్ప ఏపీ ప్రభుత్వం ఏమీ అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. అయితే తెలంగాణ డిజిపి కి చంద్రబాబు తన పర్యటన గురించి తెలియజేయగా ఆయన అనుమతి ఇచ్చాడని అంటున్నారు. ఇక ఆంధ్ర తరపు నుండి కూడా నిజంగా చంద్రబాబు అనుమతి కోరితే పర్యటనుకు తప్పక అనుమతిస్తామని కూడా అన్నట్లు కొందరి నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బాబు ఏపీకి రావాలని ఇలా దాగుడుమూతలు ఆడుతున్నారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు ఏపీ పర్యటనకు వస్తే దానిపైన అనుమతించే విషయంలో నిర్ణయం తీసుకుంటామని  మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. మొత్తానికి బాబు అయితే నేరుగా అమరావతి లోని తన ఇంటికి వెళ్లారు కానీ తన పర్యటన విషయమై ఏపీ డిజిపి మాత్రం ఇంకా ఆమోదం లేదని అంటున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రం నుండి సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. అదీ కూడా రోజుకి అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న హైదరాబాద్ నుండి. రెండు తెలుగు రాష్ట్రాలు కోవిడ్ 19 నివారణ విషయమై విధించుకున్న కొన్ని రూల్స్ ప్రకారం ఆ రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చినా లేదా ఈ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రానికి వెళ్లిన 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి లేదా ప్రభుత్వం వారి పర్యవేక్షణలో క్వారంటైన్ లో అయినా తప్పక ఉండాలి. వందలాది మంది ప్రజలు ఇప్పటికీ అలాగే చేస్తూ ఉన్నారు కూడా అయితే ఒకవైపు మహానాడుని బాబు అతి త్వరలో నిర్వహించాలని భావిస్తుండగా అందుకు తగిన ఏర్పాట్లు చేసే సమయంలో క్వారంటైన్ ను ఏం పాటిస్తారు అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క వైసీపీ మంత్రులు మాత్రం బాబు వస్తే కచ్చితంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిందే అని నొక్కి వక్కాణిస్తుండడా ప్రస్తుతం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరి దీనికి బాబు ఒప్పుకుంటారా లేదా అన్నది వేచిచూడాలి. ఇక పోతే రాష్ట్రంలో రాజకీయానికి ఇదే సరైన సమయమని ఏపీకి వచ్చిన ఆయనకు తన పర్యటనకు అనుమతి ఇవ్వకపోయినా.. సెల్ఫ్ క్వారంటైన్ చేయమని అతనిపై ఒత్తిడి పెంచినా నానాయాగీ చేస్తారన్నది 40 ఏళ్లుగా బాబు ని చూస్తున్న వారెవరికైనా అర్థమయ్యే విషయం. అసలు ఇంత వాదన ఏమిటి? ఇది ప్రభుత్వం నిర్ణయం…. అతి సామాన్య ప్రజల నుండి మాజీ ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన నిబంధనలు అని ఆదేశాలు జారీ చేయకుండా రాజకీయ కోణంలో ఇంత బుజ్జగింపు ఏమిటన్న విషయం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు రుచించడం లేదు....
బిగ్ స్టోరీ

తిరుమల ఆస్తుల అమ్మకాల్లో న్యాయం – ధర్మం ఉంది… తప్పదు – తప్పులేదు ! 

siddhu
ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనమైన విషయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం తమ ఆస్తులను విక్రయించడానికి తీసుకున్న నిర్ణయమే. దేవస్థానానికి చెందిన 50 ఎందుకూ ఉపయోగపడని ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు టిటిడి సన్నాహాలు జరుపుతుండగా…. ఏకంగా దేవుడి ఆస్తులు అమ్మేస్తారా అంటూ జగన్ సర్కార్ హిందూ ధర్మాన్ని తొక్కివేయడమే పనిగా పెట్టుకుంది అని పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో చూస్తే ఈ పాలక మండలి దేనికి? అధికారులు ఎందుకు ఉన్నట్లు? అంటూ ఒక రేంజ్ లో ఏపీ సర్కారును ఒక రేంజ్ లో ఏసుకుంటున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంపై స్పందించడం మానేసి జగన్ ను హెచ్చరిస్తూ.. సవాళ్ళు, చాలెంజ్ విసురుతున్నారు. ఇక ఈ విషయం గురించి టిటిడి బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కొన్ని టీవీ ఛానళ్లలో ఈ విషయానికి సంబంధించి అవాస్తవ సమాచారంతో భక్తుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. వాస్తవాలు ఇవే అంటూ ఆయన కొన్ని వివరాలను తెలియజేశారు. జివో ఎంఎస్ నెం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్ -1), (09 – 04 – 1990) రూల్ -165, చాప్ట‌ర్ – 22, ద్వారా టీటీడీకి మేలు క‌లిగే అవ‌కాశం ఉంటే దేవ‌స్థానం ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం, లీజుకు ఇవ్వ‌డం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయని చెప్పారు.  అదేవిధంగా బోర్డు నిర్ణయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఇదే క్ర‌మంలో చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి అధ్య‌క్షులుగా ఉన్న పాల‌క‌మండ‌లి తీర్మానం నంబ‌రు 84 (28 – 07 – 2015) మేర‌కు టీటీడీకి ఏర‌కంగాను ఉప‌యోగ‌ప‌‌డ‌ని ఆస్తుల‌ను గుర్తించి బ‌హిరంగ వేల‌ం ద్వారా వాటిని విక్ర‌యించ‌డానికి గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించ‌డానికి ఒక స‌బ్ క‌మిటీని నియ‌మించినట్లు చైర్మన్ చెప్పారు. అప్పటి స‌బ్ క‌మిటీ నివేదిక మేరకు , అప్పటి తీర్మానం నెం. 253 (తేదీ 30 – 01- 2016) ద్వారా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పాటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌లో స‌బ్ క‌మిటీ గుర్తించిన 50 నిర‌ర్థ‌క ఆస్తుల‌ను బ‌హిరంగ వేల‌ం ద్వారా విక్ర‌యించ‌డానికి చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి ఆధ్య‌క్ష‌త‌న పాలక మండ‌లి ఆమోదం తెలిపినట్లు చెప్పారు.. ఇంకా గట్టిగా మాట్లాడితే అసలు దేవుడికి అక్కరకురాని మరియు భక్తులకు ఏ విధంగా ఉపయోగపడని.. ఏ రకమైన ఆధ్యాత్మిక లేదా ధార్మిక కార్యక్రమానికి పనికిరాని సుదూర ప్రాంతాల్లోని ఆస్తులను తిరుమల వెంకన్న వదిలించుకుంటే తప్పేమిటి? అసలు ఎక్కడో దూరంగా తమిళనాడులో ఖాళీ స్థలాలు మరియు భూములు ఎవరి కబ్జాలో ఉన్నాయో తెలియదు. అసలు ఇన్నాళ్ళు ఏమాత్రం టిటిడి కి సంబంధం లేకుండా పడి ఉన్న భూములు వారి పేరిట మిగలడమే గొప్ప. వాటిని అమ్మేసి ఏమీ ప్రభుత్వం తమ ఖజానాలో వేసుకోవడం లేదు కదా…. టిటిడి కార్పస్ ఫండ్ కే చివరికి వాటిని జమచేస్తారు. దానిని టిటిడి అభివృద్ధికి సమర్పిస్తారు. పైన సుబ్బారెడ్డి చెప్పినట్లు తమ నిఘా మరియు పర్యవేక్షణ కరువైన వాటిని అమ్మడం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఇంకా జాప్యం చేస్తే మిగిలిన వాటికి లీగల్ చిక్కులు పెట్టేసి ఎవరైనా కబ్జా చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. టిటిడి చైర్మన్ ఖచ్చితంగా చెప్పిన మాట ఏమిటంటే 1974 నుండి నిరర్ధక ఆస్తుల ను అమ్మడం జరుగుతోందని 2014 వరకు కనీసం 129 ఆస్తులను అమ్మారని.. ఇప్పుడు అదనంగా ఒక 50 అమ్మితే అందులో విచిత్రం ఏముందని…. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దు అని అన్నారు....
బిగ్ స్టోరీ

చిరంజీవి కొత్త సినిమా పై క్రేజీ రూమర్…! 

siddhu
  మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత అతను నటించిన ప్రతి చిత్రం గురించి సెన్సేషనల్ న్యూస్ ఏదో ఒకటి బయటకు వస్తూనే ఉంది. సినిమాల్లోకి పునరాగమనం చేసేందుకు ఎంచుకున్నది ఒక రీమేక్ చిత్రం కావడం విశేషం. ఆ తరువాత ‘సైరా’ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించిన చిరు…. ప్రస్తుతం టాలీవుడ్ లోని సక్సెస్ ఫుల్ దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. మొన్ననే ఒక స్టేజి పైన పొరపాటున సినిమా టైటిల్ కూడా చిరు నోటి నుండి వచ్చింది. అయితే ఈ మధ్యలో అతని కొడుకు రామ్ చరణ్ మలయాళం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను కొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి కోసమే ఈ చిత్రం హక్కులను రామ్ చరణ్ కొన్నారని తెలుస్తుండగా ఈ చిత్రాన్ని సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించనున్నాడు. మలయాళంలో మోహన్ లాల్ లీడ్ క్యారెక్టర్ గా చేసిన సినిమా లో పృథ్వి రాజ్, మంజు వారియర్ వంటి ప్రత్యేక తారాగణం నటించారు. అయితే మలయాళంలో ఉన్న చిత్రాన్ని మక్కీకి మక్కీ దించేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సుజిత్ తో మార్పులుచేర్పులు రామ్ చరణ్ దగ్గరుండి చేయించుకుంటున్నారు .కానీ మూలకథ మరియు పాత్రలు మాత్రం మారే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కాస్టింగ్ విషయంలో చిత్రయూనిట్ తర్జనభర్జనలు పడుతున్నారు. అయితే లూసిఫర్ సినిమాలో అత్యంత ప్రాధాన్యం ఉన్న లేడీ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ పాత్రను మలయాళంలో మంజు వారియర్ పోషించింది. తెలుగులో ఈ పాత్రను విజయశాంతితో చేయించాలని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 13 ఏళ్ల విరామం తర్వాత విజయశాంతి ఈ మధ్యనే మహేష్ బాబు హీరోగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరే సినిమాకు ఆమె ఒప్పుకోలేదు. తనను ఎవరూ అడగట్లేదా లేక ఆమె సినిమాలలో నుండి మరల తప్పుకున్నారా అన్న విషయం తెలియడం లేదు. సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్టేజి పైన విజయశాంతి తో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చాలా వ్యక్తిగతమైన విషయాలను ఎంతో సున్నితంగా మరియు ప్రేమతో అడిగిన చిరంజీవి ఇప్పుడు ఆమెతో కలిసి నటిస్తే మెగా అభిమానుల్లో జోష్ మామూలుగా పెరగదు. ఇలాంటి త‌రుణంలో చిరు, సుజీత్‌.. మంజు పాత్ర కోసం విజ‌య‌శాంతిని అడుగుతున్నార‌ని.. ఆమె ఓకే చెప్పే అవ‌కాశ‌ముంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అప్పుడు సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో వాళ్ల కెమిస్ట్రీ ప‌ట్ల ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. గ‌తంలో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించిన ఈ జోడీ.. మ‌ళ్లీ తెర‌పై క‌నిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందన‌డంలో సందేహం లేదు....
5th ఎస్టేట్

రాజకీయ చదరంగం లో అత్యంత కీలక ‘పావు’ ని కదిపిన జగన్…!

siddhu
  రాజకీయాల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటో జగన్ కు బాగా తెలిసొచ్చింది. తన పాలన పట్ల విశ్లేషకుల అభిప్రాయంఎలా ఉన్నా కూడా ప్రజల్లో మాత్రం తనకంటూ మంచి పేరు సంపాదించుకునేందుకుచాలా పాట్లు పడ్డాడు. జగన్ ఎన్నికల్లో గెలిచి ఏడాది. తన పాలనలో చేసిన తప్పులే చివరికి తనకి చంద్రబాబుకి ప్రతికూలతలుగా మారి జగన్ అడిగిన ఒక్క ఛాన్స్ ను ప్రజలు ఇచ్చేశారు. మరి అతను ఆ ఛాన్స్ను సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాడా…. లేదా? ఇవన్నీ పక్కన పెడితే ముందు జగన్ ను అతని తండ్రి వైయస్ తో, పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ తో, మాజీ సీఎం చంద్రబాబు తో పోల్చడం అనవసరం. జగన్ లెక్క వేరు.. అతనికున్న తిక్క వేరు. వారిలో ఎవరూ16 నెలల పాటు జైల్లో కాలం గడపలేదు. అలాగే సొంత పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళు వరుసగా విపక్షం లో ఉండి ఆటుపోట్లు పడి పైకి రాలేదు. కచ్చితంగా చెప్పాలంటే అతనికి అధికారం ద్వారా వెన్నుపోటు రాలేదుమరియుఅతను ఏ పార్టీని హైజాక్ చేయలేదు. ఇక కెసిఆర్ లాగా సెంటిమెంట్ తో ధనిక రాష్ట్రం ఏమి పట్టలేదు. అతనికి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఓనమాలు దిద్దించడానికి పెద్ద వారు ఎవరూ లేరు. అటువంటి వ్యక్తి కొన్ని విషయాల్లో కటువుగా ఉంటే ఏమైపోతుంది అన్నది అతని మద్దతుదారుల అందరి వాదన. అంతెందుకు మొన్న ఒకరోజు హైకోర్టు ఐదారు అంశాలమీద జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకతీర్పు ఇచ్చింది. ఒక వైద్యుడి అరెస్టు అంశాన్ని ఏకంగా సిబిఐ కి అప్పగిస్తూ ఈ ప్రభుత్వం తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించడం ఎంత పెద్ద విషయం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్మాజీ డిజిపి యొక్క సస్పెన్షన్ ను ఎత్తివేయడం, ప్రభుత్వ భూముల విక్రయం పై నోటీసులు జారీ చేయడం, ప్రభుత్వ భవనాల రంగుల జీవో ను కొట్టివేయడం వంటివి ఎన్నో ఆదేశాలను జారీ చేసింది. వైసీపీశ్రేణులు అయితే అసహనంతో ఊగిపోయి ఏకంగా హై కోర్టు తీర్పు పై సోషల్ మీడియాలో వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన తీరు కూడా చూశాం. అయితే ఇక్కడే జగన్ సంయమనం పాటిస్తూ తన రాజకీయ చతురతను ఉపయోగించాడు. ప్రస్తుతం నడుస్తున్నది లాక్ డౌన్ కాబట్టి పరిస్థితి అంతా ఆకలి బాధలతో అల్లాడిపోతున్నారు. ఈ సమయంలోహైకోర్టు పై విమర్శలు చేయడం లేదా సుప్రీం కోర్టుకి పంతం నెగ్గించుకునేందుకు వెళ్లడం వంటి అవసరమైన పనులు చేయకుండా ప్రజలకు ఏం కావాలో అవే చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ టార్గెట్ చేసిందిసంక్షేమ కోణం. అనుకున్నంత ఆదాయం లేని రాష్ట్రాన్ని చంద్రబాబు చేతికి ఇచ్చి వెళ్లిపోయాడు. దానికి తోడు మితిమీరి చేసిన ఎన్నికల వాగ్దానాలు. ఇక ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేసిన కరోనా ప్రభావం. వీటన్నింటి మధ్య జగన్ తాను ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే మామూలు విషయం కాదు. కానీ నీ కష్టమో నష్టమో…. జగన్ మాత్రం పట్టువదలకుండా అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తం,వాహనమిత్ర, విద్య దీవెన, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జీతాలు, వాలంటీర్లకు జీవితాలు, నేతన్న నేస్తం, విద్య దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలను ఈ ఏడాదిపొడుగునా కొనసాగించడం చిన్న విషయం అయితే కాదు. ఈ సంక్షోభ సమయంలో ప్రతి కుటుంబం ఖాతాలోకి డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చి చేరుతుంది. దీంతో జగన్ ప్రజలకు చాలా కనెక్ట్ అయిపోయాడు ఎన్నికల ప్రణాళికను చెప్పిన విధంగా అనుసరిస్తూ తానురాజకీయంగా బలంగా ఈ రాష్ట్రంలో పాతుకుపోవడానికి ఇదే సరైన మార్గం అనుకున్న జగన్ తన ఆలోచన శైలితో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. విపక్షాలు మరియు అతని వ్యతిరేకులు ఎంతఏడ్చినా జగన్ ఆడిస్తున్న రాజకీయ చదరంగంలో వారి గోడు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు....
బిగ్ స్టోరీ

థియేటర్ల శకం ముగియనుందా?

siddhu
కరోనా వల్ల దేశంలో ఎన్నో  రంగాలకు విపరీతమైన నష్టం వాటిల్లగా వాటిలో ప్రప్రధమంగా చిత్ర పరిశ్రమ గురించి మనం చెప్పుకోవాలి. ఒక్క టాలీవుడ్ కే ఈ లాక్ డౌన్ కారణంగా ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో లక్షలమంది చిత్ర పరిశ్రమ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. పదుల సంఖ్యలో సినిమాల షూటింగ్ ఆగిపోయింది. చాలా సినిమాలు ఇక ఈ సమస్యలను భరించలేక విడుదల ను రద్దు చేసుకుని ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే థియేటర్ ను ఆందోళన పరిచే రీతిలో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ అనగా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ వంటి యాప్స్ లో చిత్రం విడుదలైన నెలరోజుల్లోనే ప్రేక్షకులు వాటిని తిలకిస్తున్నారు. పెద్ద హీరోల చిత్రాలు అంటే కచ్చితంగా అందరికన్నా ముందే చూడాలి అని ఉత్సాహంతో థియేటర్ల ముందు వాలిపోతున్నారు కానీ మీడియం బడ్జెట్ సినిమాలు మరియు చిన్న సినిమాలను ఒక నెల అయితే మన ల్యాప్ టాప్ లేదా టీవీ లో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ మరియు యాప్స్ ద్వారా చూసుకోవచ్చని జనాలు థియేటర్లకు వెళ్లడం మానేశారు. ఇక ఈ డ్రామా వెబ్ సిరీస్ లు వచ్చిన తర్వాత సినిమాల పై ఇంట్రెస్ట్ కూడా కొద్దిగా తగ్గుతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  ఎంతో మంది ప్రొడ్యూసర్లు దేశవ్యాప్తంగా థియేటర్లో సినిమాలు విడుదల చేయకుండా ఈ లాక్ డౌన్ నేపథ్యంలో నేరుగా ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ లోకి తమ చిత్రాలను మంచి రేట్లకు అమ్మివేసిన విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో సినిమా ఆడుతుందో లేదో గ్యారెంటీ లేని పక్షంలో తమ నిర్మాణానికి అయ్యే బడ్జెట్ ను తగ్గించుకొని మంచి రేటుకి ఈ ఓటిటి యాప్ లకు  తమ సినిమాను ఆమ్మే దిశగా కూడా వారి అడుగులు పడుతున్నాయి అని సమాచారం. ఇక థియేటర్ల విషయానికి వస్తే కరోనా తర్వాత ఎవరూ ధైర్యం చేసి మునుపటిలా సినిమా హాళ్ళకు…. మల్టీప్లెక్స్ లకు వెళ్లే పరిస్థితి అయితే లేదు. అదీ కాకుండా ఇంట్లోనే హాయిగా కూర్చుని తమకు నచ్చిన సిరీస్ ను లేదా సినిమాను స్మార్ట్ టీవీ లో చూడటానికే ప్రజలు క్రమేపీ మొగ్గుచూపుతున్నారు. ఈ క్ర‌మంలో ఔత్సాహిక ఫిలిం మేక‌ర్ల‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకునేందుకు ఓ చ‌క్క‌ని మార్గం ల‌భిస్తుంది. మూవీల‌ను తీసి ఓటీటీ యాప్‌ల‌లో రిలీజ్ చేయ‌వ‌చ్చు. ఒక‌ వేళ వారు విడుద‌ల చేసే సినిమాలు హిట్ అయితే.. ఇక వారు వెను దిరిగి చూడాల్సిన పని ఉండ‌దు. పుష్క‌లంగా అవ‌కాశాలు ల‌భిస్తాయి. సినిమా చాన్స్‌లు వెతుక్కుంటూ వ‌స్తాయి. దీంతో వారు త‌మ క‌ల‌ల‌ను నిజం చేసుకోవ‌చ్చు. ఈ విధంగా ఓటీటీ యాప్‌లు ఔత్సాహిక ఫిలిం మేక‌ర్ల‌కు చ‌క్క‌ని అవ‌కాశాన్ని అందిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో థియేటర్ల గతి ఎలా ఉండబోతోందో....
5th ఎస్టేట్

హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా…! ఇక మామూలు జనం పరిస్థితి చూస్తే….

siddhu
  భారతదేశంలో కరోనా విజృంభణ నానాటికీ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి దెబ్బతో ప్రపంచం అంతా ఎలా విలవిలలాడుతోందో గత రెండు నెలలుగా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే దేశంలోని నగరాలలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉంది. వైరస్ వ్యాప్తి మహానగరాలలో విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఇక పోలీసులు అయితే ప్రస్తుతం వచ్చిన లాక్ డౌన్ సడలింపుల తో అటు ప్రజలను కంట్రోల్ చేయలేక… ఇటు తమని తాము రక్షించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర నమోదయ్యే కేసుల్లో 95% జిహెచ్ఎంసి పరిధిలో ఉండటం గమనార్హం. ఇకపోతే హైదరాబాద్ పోలీసులు ఈ మహమ్మారి బారిన పడకుండా అహర్నిశలు కష్టపడుతూ విపరీతంగా తినిపిస్తూ ఉండగా ఈ కొద్ది కాలంలోనే మరే డిపార్ట్మెంట్ కు రానంత పేరు ప్రఖ్యాతులు వీరికి దక్కాయి. అయితే ఈ విపత్తి వేళ విరుచుకుపడే ముప్పుకి అడ్డుగా నిలిచి డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది అనే చెప్పాలి. ఒకే రోజులో ముగ్గురు పోలీసులకు కరోనా సోకడాం ఒక ఎత్తు అయితే అందులో ఇద్దరూ అధికారులు ఉండడం అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. శుక్రవారం నమోదైన కేసులో ముగ్గురు హైదరాబాద్ పోలీసులు ఉన్నారు. వారిలో ఒకరు ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉంటే మరొకరు ఎస్ఐ స్థాయిలో ఉన్నారు. ఇంకొకరు కానిస్టేబుల్. ఇదిలా ఉండగా అటు హైదరాబాద్ పరిధిలో ఉండే సామాన్య ప్రజల తీరు కూడా పోలీసులను మరింత ముప్పు కు గురి చేస్తోంది. జంటనగరాల్లో రోజుకి సరాసరిన 40 కేసులు నమోదు అవుతుండగా ఇంకా విస్తృత స్థాయిలో టెస్టులు చేపట్టని నేపథ్యంలో ప్రజలు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాల్సింది పోయి రోడ్డు మీదకు వచ్చి వైరస్ వ్యాప్తికి తోడ్పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కా చోట అని కాకుండా సిటీ నలుమూలల లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటం ఆందోళన పరిచే విషయం. ఇదిలా ఉండగా తాజాగా మొన్ననే ఒక హైదరాబాద్ పోలీసు కరోనా వైరస్ వల్ల మృతి చెందగా తాజాగా నమోదవుతున్న కేసుల్లో ప్రతి ఒక్కరూ తమ డ్యూటీ నిర్వహిస్తూనే వైరస్ బారిన పడుతున్నారు. పైన చెప్పుకున్న ముగ్గురిలో ఇద్దరు గాంధీ ఆసుపత్రి వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా లేని రీతిలో హైదరాబాద్ మహానగరంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ.. అనూహ్యంగా పోలీసులు బాధితులుగా మారటం ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారింది.రక్షకులుగా నిలుస్తున్న పోలీసులకు పాజిటివ్ గా తేలడం మరియు ప్రజలు ఇవేవీ పట్టనట్లు రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లు తిరగడం చూస్తుంటే హైదరాబాద్ మహానగరం రానున్న రోజుల్లో ఇంకెంత మృత్యుఘోష అనుభవిస్తుందో తల్చుకుంటేనే భయంగా ఉంది....
బిగ్ స్టోరీ

వలస ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే లా బాబు వ్యూహం..! ఇది ‘మహా’ స్కెచ్

siddhu
  రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉంటేనే నిలబడగలం అన్నది బాబు సూత్రం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి పార్టీ ఉన్నంత బలహీనంగా దేశంలో మరే విపక్షం లేదు అన్నది వాస్తవం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం గత కొన్నాళ్లుగా రాష్ట్రంలో కనీస గుర్తింపుకి నోచుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ఉన్నది 23 ఎమ్మెల్యేలు…. మళ్లీ వారిలో సగం మంది వైసీపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఐదు పేర్లు ఖరారు అయినట్లు కూడా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇవి బాబు చెవిన కూడా పడ్డాయి. అంతే ఉన్నఫలంగా పరిస్థితులతో సంబంధం లేకుండా వెంటనే ‘మహానాడు’ ని ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని బాబు చూస్తున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకుల్లో నూతనోత్సాహం తెచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు మహానాడు తలపెట్టాలని చూస్తుండగా ప్రస్తుతం నెలకొన్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో కాకపోయినా అతి కొద్ది మంది ముఖ్య నాయకులతో మరియు ఎవరైతే వైసిపి వైపు చూస్తున్నారో వారందరినీ పిలిచి దీన్ని నిర్వహించాలని బాబు ఆలోచిస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎలాగో మహానాడు లాంటి సభకు అనుమతిని ఇవ్వదు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ‘జూమ్’ యాప్ లో నిర్వహించాలన్న పట్టుదలతో బాబు ఉన్నాడు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహానాడు జరగలేదు.ఈ ఏడాది కరోనా కారణంగా అది కూడా వాయిదా పడుతుందని అందరూ అంచనా వేయగా, బాబు మాత్రం మహానాడు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక మరోవైపు వైసీపీ వీలైనంత త్వరగా తన వైపు వచ్చే నాయకులను తమ పదవులకు మరియు పార్టీకి రాజీనామాలు చేయించి టిడిపికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గట్టి దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఉందని తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీలో వచ్చేందుకు ఆసక్తి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల లిస్ట్ మొత్తం వైసీపీ రెడీ చేసుకుంది.పార్టీలో చేరేందుకు ఏ క్షణమైనా పిలుపు రావచ్చని, మీరంతా సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే వారికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఇక విషయాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు పార్టీ మారే ఆలోచన ఉన్న నాయకులందరికీ ఫోన్ చేసి బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బాబు కి ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్క మహా నాడే పెద్ద దిక్కులా కనిపిస్తుంది. దాని ద్వారానే వైసిపి దూకుడుకు చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నాడు....
బిగ్ స్టోరీ

ఒక రోజు విలన్.. పక్క రోజు హీరో…! జగన్ గ్రాఫ్ పైపైకి 

siddhu
  దేశమంతా లాక్ డౌన్ వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురి అవుతుంటే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మాత్రం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను ఎలా సమయానికి అమలు చేస్తున్నారో అర్థం కాక అటు విపక్షాల తో పాటు ఇటు రాజకీయ పండితులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అంతెందుకు వాటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రతి సామాన్యుడిని ఒక ప్రశ్న వేధిస్తోంది. ఇలా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు జగన్ కనబరుస్తున్న చిత్తశుద్ధి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే పాలకులను చూసిన వాళ్ళకు… అనాదికాలంగా వస్తున్నా రాజకీయాలకు విరుద్ధంగా కష్టకాలంలో మేనిఫెస్టో అమలుకు ఏకంగా క్యాలెండర్ ను విడుదల చేసిన ఘనత ఒక్క జగన్ కే చెల్లింది. జగన్ ను ఏ కోరికతో అయితే సీఎం గా అందరూ గెలిపించుకున్నారో…. ఆ జనం.. ఇప్పుడు కష్టకాలంలో జగన్ తను చెప్పిన మాట పై నిలబడి ప్రజల్లో మరింత నమ్మకం మరియు అభిమానం పెంచుకున్నాడు అని అనుకుంటున్నారు. అయితే జగన్ సర్కార్ పై ఒక చిన్న అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయింది. దానిని కూడా జగన్ పరిగణలోకి తీసుకొని వెంటనే పరిష్కారం చేయడం గమనార్హం. అది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు పూర్తి స్థాయిలో అందక పోవడమే. నిజానికి లాక్ డౌన్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం జరిగింది. ఇక మన రాష్ట్రం దానికి ఏమీ మినహాయింపు కాదు. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల్లో 2, 3 డిపార్ట్మెంట్ లకు తప్ప మిగిలిన ఉద్యోగుల వేతనాల్లో కోత విధించారు. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి సృష్టించబడ్డ సచివాలయం ఉద్యోగాలు జీవితాల్లో కూడా 10% వేతనాలను కట్ చేయడం గమనార్హం. ప్ర‌తి నెలా వివిధ క‌మిట్‌మెంట్ల‌కు పోనూ వేత‌నాన్ని పొదుపుగా వాడుకుంటున్న ఉద్యోగుల‌కు స‌గం జీతంతో ఇబ్బందులు పడ్డారు. అయితే క‌రోనాతో ఆర్థిక ఇబ్బందుల‌ని స‌రిపెట్టుకుంటున్నా….మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల‌ను య‌ధావిధిగా జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌లు చేస్తుండ‌టం ఉద్యోగ వ‌ర్గాల్లో ఓ ర‌క‌మైన అసంతృప్తి వచ్చి జగన్ కొద్ది రోజులు వాళ్ళ జీవితాల్లో విలన్ గా మారాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జగన్ ఆ వేతనాల్లో కోత ను కేవలం రెండు నెలల కే పరిమితం చేయడం నిజంగా అభినందనీయం. వచ్చే నెల నుండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిస్థాయి వేతనాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకపక్క మద్యం షాపులు తెరుచుకోవడం మరియు మరొక పక్క మిగతా షాపులకు నిర్దేశిత సమయం లో వ్యాపారం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగిన మరునాడే ఉద్యోగులందరికీ వచ్చేనెల నుండి పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జగన్ గ్రాఫ్ మరింత పైకి పెరిగిపోయింది. ఇక మిగిలి ఉన్నదల్లా ఇప్పటివరకు కోత విధించిన వేతనాలను మళ్లీ ఎప్పటికీ తిరిగి ఉద్యోగులకు అందజేస్తారు అన్న విషయంపై స్పష్టతే. ఇన్ని చేసినా ముఖ్యమంత్రి అది ఒకటి చేయకుండా పోతాడా ఏమి?...
బిగ్ స్టోరీ

సరికొత్త టీం తో చినబాబు… సరికొత్త ప్లానింగ్… కథ ఎటు?

siddhu
  ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అన్న విషయం ముమ్మాటికీ వాస్తవం. చంద్రబాబు తర్వాత పార్టీని ముందుండి నడిపించేది ఎవరు అన్న ప్రశ్నకు పెద్దలు అంతా...
బిగ్ స్టోరీ

బొత్స ని ‘ఖాతరు ‘ చెయ్యడం లేదహో… !

siddhu
రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ యొక్క ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల తరపున వ్యాఖ్యలు చేసే...
బిగ్ స్టోరీ

టైగర్ కి టైమొచ్చింది… ఫుల్ జోష్ లో హైదరబాద్ పోలీసులు

siddhu
గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భయంకరంగా విస్తరించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు చేశారు. ఇక హైదరాబాద్ మహానగరం అయితే పూర్తిగా పోలీసులు కంట్రోల్ లోకి వెళ్లి...
బిగ్ స్టోరీ

రేవంత్ రాజకీయానికి ఊపిర్లు ఊదిన జగన్ – కే‌సి‌ఆర్?

siddhu
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కాకుండా మరొక హాట్ టాపిక్ ఉంది. కరువు ప్రాంతం రాయలసీమకు నీరు అందించేందుకు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయగా తెలంగాణ...
బిగ్ స్టోరీ

హై కోర్టు తలనొప్పి నుంచి తప్పించుకున్న ఏపీ గవర్నమెంట్ ?

siddhu
గత కొద్దికాలంగా జగన్ సర్కారు తీసుకుంటున్న పాలనాపరమైన నిర్ణయాలు మరియు జీవోలపై హైకోర్టు నుండి ప్రతికూల తీర్పులు మరియు కామెంట్స్ రావడం గమనిస్తూనే ఉన్నాం. ప్రతిసారి జగన్ ప్రభుత్వం ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్లు వ్యవహరిస్తున్న...
బిగ్ స్టోరీ

ప్రాణాల కంటే – ఎకానమీ ముఖ్యం అనేది ఇందుకే 

siddhu
  ది గ్రేట్ బ్రిటన్… దశాబ్దాల క్రితం ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలలో ఒకటి. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కూడా ఆవిర్భవించింది. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిన దేశం. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసిన దేశం. అయితే ఇప్పుడు అదంతా చరిత్ర. వర్తమానంలో బ్రిటన్ పరిస్థితి చాలా విచారకరంగా తయారయింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దేశాలలోని ఒకటైన బ్రిటన్ ఇక పై ఏ మాత్రం అగ్రదేశం కాదు. ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయి కాదు కదా సొంత ఇంటిని సైతం చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉంది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తా చాటిన వేళనే బ్రిటన్ ఒక్క స్థానం అంతర్జాతీయ యవనికపై ఒక నామమాత్రంగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు వచ్చిన కరోనా మహమ్మారి అయితే ఈ దేశాన్ని కుదిపేసింది. ఈ నెల 3వ తేదీ నాటికి ఆ దేశంలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదు కావడం గమనార్హం. 30 వేల మంది ఇప్పటికే కన్నుమూశారు. ఏకంగా దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా బారి నుండి తప్పించుకుని కొద్దిలో బయటపడ్డాడు అంటే అక్కడి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. సమీప భవిష్యత్తులో పరిస్థితి చక్కబడే అవకాశమే లేదని నిపుణుల అభిప్రాయం. నిజానికి బ్రిటన్ లో పరిస్థితి తేడాగా ఉంది అన్న సమయంలోనే కరోనా ఎంటర్ అయింది. అంతే…. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేక బ్రిటన్ లాక్ డౌన్ ను తక్షణమే అమలు చేసింది. ఎంత పటిష్టంగా అమలు చేసింది అంటే ఒక్క దెబ్బకు ఆ దేశ స్టాట్ మార్కెట్ అంతా కూలిపోయింది. వారి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దానివల్ల ఏమన్నా ప్రాణాలు కాపాడగలిగారా అంటే వైరస్ వ్యాధి నియంత్రణలో కూడా ఏ మాత్రం మార్పు లేదు. అటువైపు మిగతా ప్రపంచ దేశాలు మరియు చిన్న చిన్న దేశాలు లాక్ డౌన్ ను సరైన ప్లాన్ తో వైరస్ కంట్రోల్ చేస్తూ అటు ఆర్థిక వ్యవస్థని కూడా కాపాడుకుంటే బ్రిటన్ మాత్రం రెండిట్లో చతికిలపడింది. కరోనా వైరస్ సోకితే దాదాపు 80 శాతం పైన రికవరీ రేటు ఉంటుంది. 70 ఏళ్లకు పైబడిన వారి ప్రాణాలకు మాత్రమే రిస్క్ అయితే ఈ విషయంలో కొద్దిగా అతి జాగ్రత్త పడిన ఇంగ్లాండ్ చివరికి వైఫల్యానికి తగ్గ మూల్యం చెల్లించుకుంది. లాక్ డౌన్ ను పటిష్టంగా మరియు కఠినంగా అమలు చేసి దేశం మొత్తాన్ని ఆర్థిక సంక్షోభం లోకి నెట్టేసింది. ఫలితంగా వ్యాపార, వాణిజ్య అవకాశాలు గతంలో మాదిరిగా లేవు. ప్రజల ఆకలిబాధలు తీర్చేందుకు దేశవ్యాప్తంగా సుమారు 1200 ఆహారబ్యాంకులు పనిచేస్తున్నాయి. వీటిని మున్ముందు పెంచాల్సిన అవసరం కనపడుతోంది. జాతియంగా, అంతర్జాతీయంగా మారుతున్న పరిస్ధితులు, కరోనా బ్రిటన్ పై తీవ్రప్రభావాన్ని చుాపుతున్నాయి. ఒకప్పటి ప్రపంచశక్త నేడు గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న మాట చేదునిజం. ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడలు కావడం అంటే ఇదేనేమో....
5th ఎస్టేట్

ఆత్మ ‘నిర్భర’ భారత్ కి ఆత్మ ‘నిబ్బరం’ ఎవడిస్తాడు? 

siddhu
  20 లక్షల కోట్లు… ఇంత మొత్తం దేశం కరోనాను ఎదుర్కునేందుకు సహాయార్థం గా కేంద్రం ప్రకటిస్తే ప్రతి ఒక్క భారతీయుడు ముక్కున వేలు వేసుకున్నారు. ఇప్పుడు ఇదంతా మన కోసమేనా మనలను ఈ క్లిష్టతరమైన పరిస్థితి నుంచి బయటపడడానికేనా అని ఆశ్చర్యపోయారు…. ఆనందపడ్డారు. కట్ చేస్తే అంతటి బృహత్తర ప్యాకేజీని డైలీ సీరియల్ లా ప్రకటిస్తూ చాలా హంగామా చేశారు. చిన్న చిన్న విషయాలను బోలెడంత డప్పు కొట్టుకుని బిజెపి శ్రేణులు తమ మైలేజీ పెంచుకునే పనిలో పడ్డారు. చివరికి చూస్తే అవి రుణాలు గా ప్రజలకు అందుబాటులో ఉండే డబ్బు తప్పించి మన ఖాతాలోకి చిల్లిగవ్వ కూడా రాదు అన్న విషయం అర్థం అయిపోయింది. ఇక ఈ మధ్యలో మన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆమెలో ఒక రాజకీయ నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలు కనిపించకపోగా ఒక బ్యూరోక్రాట్ పాత్రను ఇన్నిరోజులు పోషించింది. సరే చివరికి ఈ ఐదు రోజుల సీరియల్ ప్రకటనలో జనానికి కనెక్ట్ అయ్యే అంశం ఒక్కటైనా ఉందా అంటే…. అదీ లేదు. కరోనా కష్టాల్లో ఉండి ఉపాధి కోల్పోయి.. తినడానికి అన్నం దొరక్క…. భవిష్యత్తుపై ఎలాంటి భరోసా లేకుండా ఎవరో వచ్చి సాయం చేస్తారని ఎదురు చూసే జనాలకు ఐదు రోజులు బడ్జెట్ ప్రసంగం వినిపించింది. కొన్ని అంశాలను అయితే చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇక ఎప్పటి నుండో కేంద్ర పాలనకు అలవాటు పడిపోయి కొద్దిగా అనుభవం ఉన్నవారు అయితే మోడీ తన ఖజానా నుంచి ప్రజలకు ఏమీ రాదు అని ముందే ఫిక్స్ అయిపోయారు. ఈరోజున పేదలే కాదు మధ్యతరగతి వారు కూడా ఎదురు చూస్తున్నది ఆర్థిక సహాయం. అయితే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించాక చివరికి అందులో కొంత భాగం అయినా తమకు ఉపయోగకరంగా మారుతుందని విశ్వాసాన్ని కల్పించడంలో విఫలమైంది కేంద్రం. కేంద్రం ఆదాయం తగ్గింది సరే…. రాష్ట్ర స్థితిగతులు కూడా ఘోరంగా ఉన్నాయి దానికి ఒప్పుకుందాం. కానీ ఏదో ఒక మార్గంలో ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానిదే కదా కెసిఆర్ వంటి ముఖ్యమంత్రులు కొన్ని సూచనలు ఇచ్చారు. భారీ కరెన్సీ ముద్రణ, హెలికాప్టర్ మనీ వంటి సాహసాలకు మోడీ ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎఫార్బీం పరిమితి పెంపు మాత్రమే రాష్ట్రాలకు ఉన్న ఏకైక ఉపశమనం. మోడీ అంత పెద్ద ప్యాకేజీని ప్రకటించే నాడే ముఖ్యాంశాలు చదివి వినిపించకుండా అందులో తాను చెప్పడానికి ఏమీ లేదు.. ఆ సంగతేదో నువ్వే చూసుకో.. ఆ తిట్లు ఏదో నువ్వే పడు అన్నట్లు నిర్మలాసీతారామన్ చేతికి అంతా ఇచ్చినపుడే మనం అర్థం చేసుకునే ఉండాల్సింది… ‘ఆత్మనిర్భర్ భారత్’ అంటే గుండె నిబ్బరం చేసుకొని అన్ని ఆశలు చంపుకొని కాలం వెళ్లదీయడమే అని....
బిగ్ స్టోరీ

తండ్రి ఆశయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్… అందుకే ‘ఆయన’ నియామకం? 

siddhu
ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిగా సమయం తీసుకున్నా జగన్ కూడా తన తండ్రి లాగే సాగునీటి ప్రాజెక్టుల పైన దృష్టి పెడుతున్నారు. తను తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న జగన్ ప్రస్తుతం కేసీఆర్ కే నీటి ప్రాజెక్టుల విషయంలో ఎదురెళ్ళిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం నుండి విడిపోయాక ఏపి పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ వంటి మహానగరాన్ని పోగొట్టుకున్నాక టెక్నాలజీలో, పారిశ్రామికంగా ఏపీ దశ మరియు దిశ మారాలంటే చాలా సమయం పడుతుంది. ఏపీలో ఇప్పటివరకు టైర్3, టైర్ 2 నగరాలు మాత్రమే ఉన్నాయి. పైగా మౌలిక సదుపాయాల కొరత కూడా ఎక్కువే. కాబట్టి జగన్ ముందుచూపుతో ఆలోచించి గత ప్రభుత్వ పాలనలో గాడితప్పిన ఆర్థిక పరిస్థితిని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే వ్యవసాయానికి ఊతమివ్వడమే ఏకైక మార్గమని డిసైడ్ అయ్యారు. దానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతైనా ఉంది. గతంలో చూసుకుంటే అతని తండ్రి వైఎస్సార్ కూడా వీటిపైన దృష్టిని కేంద్రీకరించాడు. పోలవరం ప్రాజెక్టు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైయస్సార్ దాదాపు 30 ఏళ్ల క్రితం శంకుస్థాపన రాయిని వేసి వదిలిపెట్టిన ప్రాజెక్టును కదిలించాడు. చంద్రబాబు దాన్ని కొంతమేరకు కొనసాగించినా చివరికి దానిని పూర్తి చేయవలసిన బాధ్యత జగన్ పైనే పడింది. తన ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మక అంశం కూడా పోలవరం అని జగన్ బాగా నమ్ముతున్నాడు. అంతటి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో తనకు సలహాలు మరియు సూచనలు ఇవ్వడం కోసం తన తండ్రి కాలంనాడు పనిచేసిన రమాకాంత్ రెడ్డిని ముఖ్య సలహాదారుగా జగన్ పోతున్నట్లు సమాచారం. ఆయన వైయస్ రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. అలాగే ఉమ్మడి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా కూడా పని చేసిన అనుభవం ఉంది. చాలా కాలం నుండి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న రమాకాంత్ రెడ్డిని తన సలహాదారుడు గా నియమించడం ద్వారా పోలవరం ప్రాజెక్టుని వీలైనంత త్వరగా పూర్తి చేయవచ్చని జగన్ భావిస్తున్నాడు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఘనత అంతా నాటి వైఎస్, నేటి జగన్ కే దక్కుతుంది తప్ప తెలుగుదేశానికి కానే కాదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా చూస్తే జగన్ సర్కార్ కి ప్రాణవాయువు పోలవరం అని తెలుస్తోంది. అందుకే దాన్ని తమ కుటుంబానికి నమ్మకంగా ఉన్న రమాకాంతరెడ్డికి జగన్ అప్పగించారు. మరి పోలవరం పూర్తి అయి అటు వైసీపీకే కాదు, ఇటు ఏపీకి కూడా వరం అవుతుందేమో చూడాలి....
బిగ్ స్టోరీ

‘సోషల్ బబుల్’ దిశగా ప్రపంచం ?

siddhu
  కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని ప్రజలందరినీ బయట అడుగు పెట్టనీయకుండా భయబ్రాంతులకు గురి చేస్తోంది. మొదట్లో ఈ పరిస్థితి కొద్ది రోజులే అనుకున్నారు కానీ రోజులు కాస్తా వారాలు అయ్యాయి. ఇప్పుడు నెలలు నిండుతున్నాయి. ఈ సమయంలో ఒక్కసారిగా ఇళ్ళలో లాక్ అయిపోయిన చాలామందికి విపరీతంగా బోర్ కొడుతోంది. గతంలో స్కూల్ కి సెలవలు ఇస్తే ఆనందంగా ఇంట్లో గడిపేవారు మరియు ఆఫీస్ లో కొద్దిగా వెసులుబాటు దొరికితే లీవ్ పెట్టుకొని సొంత గ్రామానికి వచ్చే వారు కూడా ఇప్పుడు ఇంటి దగ్గర జీవితాన్ని జైలులా భావిస్తున్నారు. సరే అలా బయటకు వెళ్లి వద్దాం అనుకున్నా కూడా వెళ్లలేని పరిస్థితి దీంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అటువంటి వారి కోసమే న్యూజిలాండ్ ప్రభుత్వం సోషల్ బబుల్ మరియు ట్రావెల్ బబూల్ అంటూ రెండు కొత్త కాన్సెప్ట్లను తీసుకొచ్చింది. ఈ విధానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు ఎక్కువ మందిని కలవకుండా నియంత్రించే విధానం. తాము ఎంపిక చేసుకున్న కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను కలిసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతిని ఇస్తాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పరిమిత సంఖ్యలో మాత్రమే బయట వారితో కాంటాక్ట్ ఉంటుంది. దీని వల్ల మనస్సుకు కొద్దిగా ప్రశాంతత దొరకడమే కాకుండా ఆ గ్రూపులో ఎవరైనా పాజిటివ్ అని తేలితే మిగిలిన వారిని కూడా గుర్తించడం కూడా తేలిక అవుతుంది. లాక్ డౌన్ అనంతరం ఈ విధానాన్ని న్యూజిలాండ్ దేశం అమలు చేస్తే ఇప్పుడు బెల్జియం, జర్మనీ దేశాలు కూడా దీనిని పాటిస్తున్నాయి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మరియు డెన్మార్క్ లలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొన్నిచోట్ల పది మంది మాత్రమే కలుసుకునేందుకు అనుమతిస్తుండగా కొన్ని చోట్ల కేవలం కుటుంబ సభ్యులు వరకే పర్మిషన్ దొరుకుతుంది. అయితే ఈ కాన్సెప్ట్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంది. జర్మనీలో రెండు కుటుంబాల్ని మాత్రమే కలుసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఎలాంటి వారిని ఎంపిక చేసుకోవాలన్న అంశంపై స్వేచ్ఛ ఉంటుంది. కాకుంటే.. అలా బబుల్ గా మారిన వారు మాత్రం తమను తాము క్షేమంగా ఉంచుకోవటంతో పాటు.. సురక్షితంగా ఉంచుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. బెల్జియంలో కూడా రెండు కుటుంబాల్ని కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. సోషల్ బబుల్ ఎలానో.. ట్రావెల్ బబుల్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుంది. కొద్ది మంది కలిసి ప్రయాణిస్తారు....
5th ఎస్టేట్

“మహా నటుడు” సినిమా తీసేయచ్చు అయ్యా మోడీ నీ మీద 

siddhu
  కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగానే బిజెపి మద్దతుదారులు అంతా ఆహా…. ఓహో.. అని ప్రభుత్వాన్ని ఒక రేంజ్ లో ఎత్తేసారు. అయితే మోడీ ఆ ప్రకటన చేసిన మరునాడే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒక్కరోజులో వివిధ రకాల ప్రయోజనాలను వెల్లడించవచ్చు కానీ దాని వల్ల తమ పార్టీకి లభించే ప్రచారం ఒక్క రోజు తోనే ఆగిపోతుంది. ఇలా సీరియల్ తరహాలో ఒక్కొక్కటిగా వెల్లడించడం వల్ల ప్రభుత్వ పథకాల పై చర్చ జరిగి మైలేజీ గరిష్టస్థాయిలో లభిస్తుంది. సరే ఎలాగోలాగా వాటిని స్పష్టంగా వెల్లడించినా పర్వాలేదు కానీ ఆర్థిక సహాయం? ఎంత అప్పు రూపాలు ఎంత? అన్న విషయంపై నిర్దిష్టమైన స్పష్టత లేకుండా చాలా తెలివిగా వ్యవహరించడం పైన ఇప్పుడు విపరీతమైన చర్చ నెలకొంది. ప్యాకేజీ మొత్తం కేంద్ర సాయం కాదు…. రుణ సదుపాయం మాత్రమే అని ఎప్పుడో అర్థమైంది. ఆ అంశాన్ని విడదీసి చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించకుండా నగదు లభ్యత ను నగదు పంపిణీ గా ప్రజలు భావించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్నా అజెండా ఒక్కటే…. కష్టకాలంలో కనీసం అప్పు లభించినా చాలనుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇక కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని డబ్బు కోణంలోనే చూస్తోంది. ప్రజలకు విద్య వైద్యం అందించి వారి కాళ్లపై వారు నిలబడేందుకు దోహదపడటం వంటి పనులు చేయడం ఎప్పుడో మానేసింది. ప్రజలు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వంపై ఆధారపడేలా పరిస్థితిని మార్చి వేస్తున్నాయి.. తద్వారా తాము అధికారంలో ఉన్నన్ని రోజులే మీకు మేలు జరుగుతుంది అన్న భావనను కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి..  లాక్ వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో అవసరానికి మించి నగదు పంపిణీ చేయడంతో ఇప్పుడు వచ్చిన క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం దగ్గర నిధులు ఉండటం లేదు. ఇక కరోనా వంటి అసాధారణ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కుదేలు అయిపోయేది మధ్యతరగతి వర్గం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంక్షేమం పేరిట చేస్తున్న చేస్తున్న విచ్చలవిడి వ్యయానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కాబట్టి ఈ సమయంలో మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ఏ రూపంలో నిధులు దొరక్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు మరియు చోటా ఉద్యోగాలు చేసుకొనే వారు విపరీతంగా దెబ్బతిన్నారు. కానీ ఇవన్నీ తెలియనట్లు తమ 20 లక్షల కోట్ల రూపాయలతో ఇప్పుడు దేశం మొత్తం నడుస్తుంది అన్నట్లు మోడీ చేసిన ప్రకటన ఇప్పుడు అతను ఎంత పెద్ద నటుడో అందరికీ తెలియజేస్తుంది. గట్టిగా మాట్లాడితే 20 లక్షల కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వంపై నేరుగా పడే భారం నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఉంటుందని అంచనా. కాబట్టి మోడీ ఇకనైనా తన సాధారణ ప్రదర్శనను ఆపి ప్రజలకు జరుగుతున్న పరిస్థితులను గురించి వివరంగా తెలపడం మంచిది....
బిగ్ స్టోరీ

ఏపీ మంత్రులు – ఏ శాఖకి ఎవరెవరో .. ఎవరు దేనికి స్పందిస్తారో 

siddhu
  సాధారణంగా భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మరియు మంత్రులు. అధిష్టానం ఇచ్చిన మంత్రి పదవులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖను ఖరారు చేసి ఉంటారు. ఆయా శాఖల పై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపించవలసిన బాధ్యత మంత్రులది. దానికి సంబంధించి ఏ శాఖలో అయినా ఎలాంటి సమస్య వచ్చినా సంబంధిత మంత్రి స్పందిస్తాడు మరియు బాధ్యుడు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు మాత్రం వేరు. అతను ఏ శాఖకు సంబంధించిన మంత్రి అయినా సరే అన్నింటిపైనా స్పందిస్తారు. తనకు సంబంధం లేని శాఖలపై ప్రెస్ మీట్ పెట్టి విమర్శకులకు ఎడాపెడా సమాధానాలు ఇచ్చేస్తారు. ఇక ఆ శాఖకు సంబంధించిన మంత్రి అయితే కనీసం అడ్రస్ కూడా ఉండరు. మొన్న రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన రచ్చ లేపిన కరెంటు బిల్లుల విషయంలో కూడా ఇదే జరిగింది. విద్యుత్ శాఖ మంత్రి ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి. కరెంట్ బిల్లు విషయంలో అంత పెద్ద రచ్చ జరిగితే ఆయన తాపీగా కేవలం రెండు ముక్కలు మాట్లాడేసి అసలు కరెంటు బిల్లులు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అని చెప్పారు. ఇక ఇతర మంత్రులు బుగ్గన, కన్నబాబు, హోంమంత్రి సుచరిత అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇస్తున్నారు. ఈ కరోనా దెబ్బకు తమ శాఖ ఏదో మంత్రులంతా మర్చిపోయినట్లుంది. ఇతరుల మంత్రుల శాఖల లోని అంశాలను వివరిస్తూ అసలు ఇది తమ శాఖే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందుకి వచ్చి కెమెరా ఉంది కదా అని గంటల తరబడి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇక విపత్తు నిర్వహణ శాఖా మంత్రి కరోనా వ్యవహారాన్ని డీల్ చేయాలి కానీ మన వ్యవసాయ మంత్రి కన్నబాబు మాత్రం ఒక సీనియర్ గా బాధ్యతలు తీసుకొని కెమెరా ముందు తన వాదనను వినిపించారు. విపక్షాల నుంచి ఏ ఒక్క మాట వచ్చిన తనే బాధ్యత తీసుకొని వారికి సమాధానం ఇస్తారు. అసలు నా శాఖ వ్యవసాయం కాదు విపత్తు నిర్వహణ అన్నట్లుగా ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు మంత్రి మాత్రం ప్రెస్ మీట్ కు వచ్చి రెండు ముక్కలు మాట్లాడేసి హడావిడిగా వెళ్ళిపోతారు. ఇక మొన్న జరిగిన ఘోరమైన ఎల్ జి పాలిమర్స్ గ్యాస్ లీక్ విషయంలో మాట్లాడాల్సిన పరిశ్రమ శాఖ మంత్రి బదులు ఒక శాసనసభ్యుడు వచ్చి మాట్లాడాడు. కరెంట్ బిల్లు విషయంలో ఆర్థిక మంత్రి బుగ్గన విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. సీనియర్ గా బాధ్యతలు పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీరంతా స్పందించారు అనుకుందాం కానీ అన్నీ మంత్రిత్వశాఖలలో ఇదే పరిస్థితి కొనసాగితే ఏమని చెప్పాలి? ఆర్థికమంత్రి పంచాయతీరాజ్ చట్టం గురించి అనర్గళంగా ప్రసంగిస్తారు స్థానిక ఎన్నికల గురించి పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పాలి కానీ ఆయన ఆర్థిక అంశాలు, వ్యవసాయ అంశాలపై ప్రకటనలు ఇస్తూ ఉంటారు. రైతుల విషయంలో అయితే బొత్స కలగజేసుకున్నట్లు మరెవరూ కలగచేసుకోరు. పౌరసరఫరాల శాఖ మంత్రి రేషన్ పంపిణీ విషయంలో ఇవ్వాల్సిన వివరణ సమాచార శాఖ మంత్రి పేఱ్ని నాని అని పిలుస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో. ప్రభుత్వానికి కొంత మంది సలహాదారులు ఉన్నారు. వారే అనధికారిక పాలకులు. ఇద్దరు ముగ్గురు సలహాదారులు చాలా యాక్టివ్ గా ఉంటారు. మొత్తం వ్యవహారాలన్నీ వాళ్లే చక్కబెడతారని.. సెక్రటేరియట్‌లో ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇదంతా అదేనంటారా మరి?...
బిగ్ స్టోరీ

660 లక్షల కోట్ల నష్టం లో ప్రపంచం 

siddhu
  కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలో ప్రతీ దేశం ఆర్థికంగా కుదేలు అయిపోయిన సంగతి తెలిసిందే. కంటికి కనిపించని క్రిమి వల్ల వచ్చిన ఈ మాయదారి రోగం తో ప్రపంచమంతా ఎంతలా తల్లడిల్లిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజులు గడిచేకొద్దీ దీని తీవ్రత ఎక్కువ అవుతోందే తప్ప ఏ మాత్రం కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించట్లేదు. పైగా కొత్త కేసులు పెరగటమే కాకుండా మరణాలు కూడా భారీగా చోటుచేసుకుంటున్నాయి. విపరీతమైన ప్రాణ నష్టంతో పాటు సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన ఈ వైరస్ వల్ల ఈ భూమిపైన చాలా కష్టంగా మారింది. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రత్యేక పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఆర్ధిక నష్టం అంచనా వేస్తే అంతా నోరు తెరుస్తారు. ఎందుకంటే ఆ సంఖ్య అంత భారీగా ఉంది కాబట్టి. తాజాగా జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.435- 660 లక్షల కోట్ల వరకు కరోనా వల్ల నష్టం వాటిల్లిందని పరిశోధకులు చెప్పారు. ప్రపంచ జీడీపీలో ఈ విలువ 6.4 శాతం నుండి 9.7 శాతం వరకు ఉంటుందని అంచనా. దానికన్నా షాకింగ్ విషయం ఏమిటంటే ప్రపంచ బ్యాంకు లెక్కకట్టి చెప్పిన నష్టానికి మూడు రెట్లు అధికంగా ఎడిబి నివేదిక ఉండటం. ఇకపోతే మార్చి నెల ఆరవ తేదీ నుండి 6 లక్షల కోట్ల నుండి 26 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లితే…. ఏప్రిల్ 3 నాటికి అది కాస్త రూ.150 నుండి 300 లక్షల కోట్లకు పెరిగింది. ఈ నష్టం మే 15 నాటికి రూ.435- 660 లక్షల కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితులు మరో మూడు నెలల పాటు సాగితే ఆసియా పసిఫిక్ ఆర్థిక వ్యవస్థకు సుమారురూ.128లక్షల కోట్ల నష్టం వస్తుందని.. అదే ఆర్నెల్ల పాటు ఆంక్షలు నెలకొని ఉంటే ఈ మొత్తం రూ.185లక్షల కోట్ల మేర ఉంటుందని చెబుతున్నారు. మాయదారి రోగంతో చైనా ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే నష్టమే రూ.80 నుంచి రూ.120 కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు....
బిగ్ స్టోరీ

ప్రచారం పక్కనెట్టి .. గట్టి ప్లానింగ్ తో జగన్ విశ్వరూపం !

siddhu
  ముఖ్యమంత్రిగా జగన్ తీరు మిగతా వారితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అంతటి ఘన విజయం సాధించాక అసలు అతను తన పొలిటికల్ మైలేజ్ పట్టించుకోవట్లేదు. పనులు జరుగుతున్నాయా లేదా అన్న విషయం పైనే తన దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో కరోనా ను సమర్థంగా ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అన్నీ పనుల్లో కూడా తాను వెనక ఉండి ముందు సంబంధిత మంత్రులను పెడుతున్నారు. కరోనా నివారణకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి మంత్రులను రంగంలోకి దించుతున్నారే తప్ప ఇటువంటి ప్రచారం కోసం పాకులాడలేదు. అంతెందుకు మొన్న విశాఖలో జరిగిన ఘోరమైన ఎల్ జి పాలిమర్స్ దుర్ఘటనలో జగన్ కోటి రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం నుంచి బాధితుల కుటుంబాలకు ప్రకటించిన తర్వాత దేశం మొత్తం అతనిని ప్రశంసించింది. అయితే తన వంతు బాధ్యతను నిర్వహించిన ఆయన రాజకీయ లాభాల కోసం మరియు తన మైలేజ్ పెంచుకోవడానికి తప్న పడకుండా మంత్రుల చేత చెక్ లు ఇప్పించి మొత్తం ఆపరేషన్ జరిపించారు. ముందు నుండి జగన్లో ఈ లక్షణం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో అవసరం లేకపోయినా హుద్ హుద్ సమయంలో వారానికి పైగా హడావిడి చేశారు. ఇకపోతే తిత్లీ తుఫాను సమయంలో సహాయ కార్యక్రమాల దగ్గరే వారం రోజులు తిష్ట వేసిన చంద్రబాబు పాలన కార్యక్రమాలను చూసుకోకుండా ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ గడిపారు. ఇక బస్సుల మీద అయితే తాను సాయం చేస్తున్న పోస్టర్లు వేయించుకుని నానా హంగామా చేశారు. ఇక అప్పుడు అతను లక్షల్లో సాయం అందిస్తే చంద్రబాబు వచ్చేదాకా ఆ డబ్బులు ఇవ్వకుండా ఆయన చేతుల మీదనే సాయం అందిస్తామని అధికారులు చెప్పి నిలిపి వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు జగన్ మాత్రం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్క బాధితునికి కోటి రూపాయలు సహాయం అందించి కూడా ఎటువంటి పొలిటికల్ మైలేజ్ కోరుకోకుండా మంత్రుల చేతి మీద గాని ఆ చెక్కుల పంపిణీ జరగడం గమనార్హం. చంద్రబాబు గతంలో అంతా తానే అన్నట్లు వ్యవహరించారు. ఆయన పైనే ఫోకస్ ఉండాలని పరితపించే వారు. అదీ కాకుండా మంత్రుల పైన నమ్మకం తక్కువ. ఇదే మంత్రి అవంతి మాట్లాడుతూ మా నాయకుడు జగన్ అని చెప్పుకోవడానికి తమకు ఎంతో ఆనందిస్తామని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తమ ప్రభుత్వం చేసిన పనిని పదింతలు గొప్పగా చెప్పుకుంటే రాజకీయ స్వలాభం గా మారుతుంది. చంద్రబాబు చాలాసార్లు అటువంటి ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. అయితే ఇపుడు జగన్ అచ్చమైన పాలన చూపిస్తున్నా జనాలకు ఏదో వెలితిగా ఉంటోంది. జగన్ తెర వెనక ఉండి ఎంత చేస్తున్నా ఏమీ చేయనట్లుగా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. మరీ బాబులా కాకపోయినా జగన్ కూడా అవసరం అయిన సందర్భాల్లో జనంలోకి ఎక్కువగా వస్తే అది పార్టీకి, ఆయనకూ కూడా లాభమేనని వైసీపీలో వినిపిస్తున్న మాట....
5th ఎస్టేట్

కరోనా కేకల కంటే గట్టిగా వినపడుతున్న ‘ వివక్ష అరుపులు ‘ 

siddhu
ఇప్పుడు ప్రపంచమంతా కరోనా మయం. ఏ నోట చూసినా అదే పేరు. లాక్ డౌన్ అనే ఒకే ఒక ఆప్షన్ తో ప్రపంచ దేశాలన్నీ దానిని అరికట్టేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ఉండగా ఎంతోమంది అభాగ్యులు...
బిగ్ స్టోరీ

జగన్ గ్రాఫ్ కిందకా పైకా?

siddhu
  కొద్ది రోజులు కరోనా అటు ఇటుగా ఊగిసలాడిన జగన్ ఇమేజ్ ను చూసి వైసిపి మద్దతుదారులు మరియు కార్యకర్తలంతా కొద్దిగా డీలా పడ్డారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా అధికార పార్టీకి వ్యతిరేకంగా మారగా…. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పోలుస్తూ జగన్ ను తక్కువ చేసి చూపించడం మీడియా వారు బాగా వంట పట్టించుకున్నారు. అయితే జగన్ మాత్రం కరోనా ఈరోజు ఉంటుంది రేపు వెళ్లిపోతుంది కానీ తాను ముఖ్యమంత్రిగా చేయవలసిన అభివృద్ధి పనులు మరియు జరగాల్సిన కార్యక్రమాలే తనను నాయకుడిగా నిలబడతాయని గట్టిగా నమ్మారు. ఆ సంకల్పబలంతోనే జగన్ అనేక సంక్షేమ పథకాలను ఆర్థిక సంక్షోభంలో కూడా నడిపిస్తూ తన లోని మరో కోణాన్ని చూపించారు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా అభినందనల వర్షం వెల్లువెత్తుతోంది. జగన్ ధైర్యానికి మెచ్చుకుంటూ మొన్నటివరకూ విమర్శలు చేసిన సోషల్ మీడియానే ప్రశంసలు కురిపిస్తోంది. పోతిరెడ్డి ప్రాజెక్టు తెలంగాణలో కేసీఆర్ కు ఎంత వరకు నష్టం కలిగిస్తుందో తెలియదు కానీ జగన్ కు మాత్రం మరొక ఐదేళ్లకు సరిపోయేంత మైలేజీని తెచ్చిపెట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు యొక్క పాలనను పోల్చి చూస్తే గత ఐదేళ్లలో బాబు ఏ ఒక్క పని చేయలేకపోయాడు. పట్టిసీమ తప్పించి ఆయన చేపట్టిన మరో కొత్త ప్రాజెక్టు లేదు. 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన నిధులు లేవంటూ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయకపోవడం గమనార్హం. ఓటుకు నోటు కేసు లో జరిగిన రచ్చ గురించి ఎత్తకపోవడం మంచిది. కానీ తన ఏడాది పాలనలో జగన్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆర్థిక సంక్షోభంలో కూడా వేల కోట్లు ఖర్చు చేయవలసిన సంక్షేమ పథకాలపై ఎటువంటి ఆంక్షలు విధించకుండా కెసిఆర్ లాంటి లీడర్ నే ఢీకొనేందుకు సిద్ధపడ్డాడు. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేసిన జగన్ పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 40వేల క్యూసెక్కుల నుండి 80 వేల క్యూసెక్కులకు పెంచగలిగితే రాయలసీమలో జగన్ ను కొట్టేవారే లేరంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు జగన్ కేసీఆర్ ను సయితం థిక్కరిస్తుండం ఏపీలో జగన్ కు హీరో వర్షిప్ లభించినట్లేనంటున్నారు. కేసీఆర్ ను ఢీకొనగలిగే సత్తా ఒక్క జగన్ కే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి. పోతిరెడ్డి పాడు విషయంలో ఏం జరిగినా ఇప్పటికే జగన్ మైలేజీ పెరిగిందన్నది కాదనలేని వాస్తవం....
5th ఎస్టేట్

జగన్ అధికారం లోకి వచ్చాక ఇదే అతిపెద్ద పాజిటివ్ వైబ్?

siddhu
  దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకతకు గురైన మద్యం అమ్మకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. ఒకపక్క కరోనా బారిన పడి ప్రజలంతా అలాడిపోతుంటే ఈ సమయంలో మందు షాపులు తెరవడం వల్ల ఆ వ్యాధిని మరింత వ్యాపించినవారు అవుతారని ప్రభుత్వాలపై ప్రజలు విరుచుకు పడుతుంటే జగన్ మాత్రం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఇప్పుడు పలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఒక్కసారిగా మద్యం పెంచడం వల్ల మందు తాగే వాళ్ళ సంఖ్య మెల్లగా తగ్గిపోతుంది అన్న జగన్ ఆలోచనలను ప్రతిపక్ష నేతలు ఎంత ఎగతాళి చేశారో అందరికీ తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో నుండి రిపోర్టులు వచ్చాక వారి ఆరోపణల్లో మరియు విమర్శల్లో ఎటువంటి పస లేదు అన్న విషయం స్పష్టంగా అర్థం అయిపోయింది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపు లతో రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం షాపులను తెరిచారో.. మందుబాబులు అంతా ఒక్కసారిగా మద్యం షాపుల పై ఎగబడ్డారు. అయితే మొదటి రోజు జగన్ అప్పటి ధరలపై 25 శాతం అదనంగా పెంచగా…. రెండవ రోజుకు మరో 50 శాతం పెంచారు. అలా లాక్ డౌన్ ముందు ఉన్న ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 75% ధరలను ప్రభుత్వం పెంచేసింది. ఈ విషయం ఎలా ఉన్నా జనాలు షాపుల ముందు మీద మీద పడి మ్ద్యం కొనుగోలు చేయడంతో సామాజిక దూరం సాధ్యం కాలేదు. అయితే కొద్దిరోజులుగా మద్యం షాపుల దగ్గర జనాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఆశ్చర్యకరంగా నాలుగవ రోజు నుండే రాష్ట్రంలోని మెజారిటీ మద్యం షాపుల ముందు క్యూలు కనిపించలేదు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా 4వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 70 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. తర్వాత మరో నాలుగు రోజులు పర్వాలేదనుకున్న అమ్మకాలు మొన్నటి 9వ తేదీన బాగా పడిపోయింది. 9వ తేదీన 41 కోట్ల విలువైన మద్యం మాత్రమే అమ్ముడైంది. అంటే 4వ తేదీ నుండి చూస్తే 9వ తేదీకి 30 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు పడిపోయాయని లెక్కలు చెబుతున్నాయి.  ఇంకా 10వ తేదీ లెక్కలు రావాల్సుంది. మొత్తం మీద ధరలు పెంచేసి మందుబాబులకు షాక్ ఇవ్వాలన్న జగన్ ప్లాన్ సక్సెస్ అవుతున్నట్లే అనిపిస్తోంది....
5th ఎస్టేట్

నిర్మాణాత్మక పోరాటం వదిలేసి – బ్యాడ్ నేమ్ దిశగా చంద్రబాబు! 

siddhu
  అధికార పక్షం చేసే ప్రతి పని లోని లోపాలను ఎత్తి చూపే నాయకులుగా పేరు తెచ్చుకున్న ది గ్రేట్ కామ్రేడ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల దెబ్బకు ఏం చేయాలో పాలు పోక ఇంటికే పరిమితమయ్యారు. జగన్ ప్రభుత్వం వరుసగా అమ్మఒడి, పేదలకు ఇళ్ల పంపిణీ, రైతు భరోసా మరియు స్థానికులకు 70 శాతం పరిశ్రమల్లో ఉద్యోగాలు వంటి నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల మన్నన పొందుతుండగా…. కామ్రేడ్స్ ఏ పనీ లేక మౌనం పాటిస్తున్నారు. ఇక ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఉన్న ఒకే ఒక ఆయుధం రాజధాని మార్పు. అమరావతి విషయంలో కొద్ది రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సిపిఎం నేతలకు కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన సమాచారంతో వారు కూడా అది విరమించుకున్నారు. ఇక సీపీఐ వారు మాత్రం ఇక కనీస వ్యతిరేక ప్రభావం చూపించ పోతే బాగోదు అన్నట్లు కనిపించీ కనిపించని పోరాటం చేస్తున్నారు. అంతెందుకు తాజాగా విశాఖ లో గ్యాస్ లీక్ ప్రమాదంపై సీఎం జగన్ స్పందించిన తీరుకి కామ్రేడ్ సైతం విస్తుపోయారు. ఏ సీఎం అయినా ఇంతకన్నా ఏం చేస్తారని సిపిఐ పార్టీ నాయకుడు నారాయణ అభిప్రాయపడడమే ఇందుకు ఉదాహరణ. ఇక రాష్ట్ర చీఫ్ రామకృష్ణ కూడా ఎటువంటి విమర్శలు చేయక పోవడం గమనార్హం. జగన్ కోటి రూపాయల పరిహారం ప్రకటించిన తర్వాత వారి నోట మాట రాలేదు. ఇలా కామ్రేడ్లు జగన్ పాలన చూసి అత్యధిక సందర్భాల్లో మౌనం వహించి ఆచితూచి అడుగులు వేస్తున్న సమయంలో చంద్రబాబు మాత్రం కూసింత విచక్షణ లేకుండా జగన్ కోటి రూపాయలు ఇచ్చిన దానిపై కూడా తీవ్రమైన విమర్శలు చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డబ్బులు ఇస్తే సరిపోదు అంటూ కొత్త పల్లవి అందుకున్న బాబు ప్రభుత్వం స్పందించడం కాదు పరిశ్రమ స్పందించేలా చేయాలని విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ముందు ప్రభుత్వమే స్పందిస్తుంది అని తెలియని చంద్రబాబు పద్నాలుగేళ్ల అనుభవానికి ఏం చెప్పాలో ఎవరికీ పాలుపోవడం లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కామ్రేడ్ లతో కలిసి ముందుకు వెళ్తానని పదే పదే చెప్పిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కనీసం వారు ఆలోచిస్తున్న విధంగా కూడా ఆలోచించలేకపోవడం గమనార్హం. చంద్రబాబు పాలనలో ఏర్పేడు లో ఇసుక తవ్వకాల నేపథ్యంలో హత్యలు, గోదావరి పుష్కరాలు బాధితులకు పరిహారం చాలా తక్కువ అన్న అభిప్రాయం ఉంది. అవి కూడా కొన్ని సరిగ్గా అందలేదు అన్నా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశాఖ అదే స‌మ‌యంలో కంపెనీ నుంచి వ‌చ్చేదీ రానిది ప‌క్కన పెడితే.. జ‌గ‌న్ ప్రభుత్వం వెంట‌నే స్పందించి కోటి న‌ష్ట ప‌రిహారం ప్రక‌టించింది. వెంటనే చెల్లించింది కూడా. దీనిని కూడా ఏమీ చేయ‌న‌ట్టుగా ప్రొజెక్టు చేయ‌డాన్ని చూస్తే.. చంద్రబాబు క‌న్నా కామ్రేడ్లు బెట‌ర్ అనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. సో.. బాబు గారు ఇకనైనా నిర్మాణాత్మక పోరాటం మొదలెట్టి అసలైన పాయింట్ తెర మీదకు తెస్తే మంచిది.లేకపోతే ఆయన మాతలు వినే వారే కరువైపోతారు....
బిగ్ స్టోరీ

తెల్లవారుజామున 3.28 గంటల సమయంలో ఏం జరిగింది… చిన్న కుర్రాడు లేటుగా బయటపెట్టిన ఫోటో నిజాలు 

siddhu
  విశాఖ ఎల్ జి పాలిమర్స్ నుండి వెలువడిన గ్యాస్ లీక్ వల్ల జరిగిన ఘోరం గురించి అందరికీ తెలిసిందే. 12 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఆ కంపెనీ కి సంబంధించిన యజమానులు మరియు స్టాఫ్ ఇప్పటికీ ఎటువంటి కేసులు నమోదు చేయకపోవడం గమనార్హం. వందల మంది ఆసుపత్రి పాలవగా వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అసలు ఫ్యాక్టరీని తమ ప్రాంతం నుండి తొలగించమని ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసులు విరుచుకుపడింది తీరు కూడా ఇప్పుడు ఎవరికీ మింగుడుపడటంలేదు. అయితే ఈ గ్యాస్ లీక్ విషయం పై మరి కొద్దిగా లోతుగా తవ్వగా కొన్ని ఆసక్తికరమైన ఆధారాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ దారుణం లో అత్యంత కీలకమైన విషయం…. బయటకు విడుదలైన స్టైరీన్ గ్యాస్ అంత వేగంగా విస్తరించింది? అసలు గ్యాస్ లీక్ అయ్యేందుకు కారకులు ఎవరు? ఇవి అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఇందులో రసాయనం ఎంత వేగంగా వ్యాప్తి చెందింది అన్న విషయాన్ని తెలియజేసేలా కీలక ఆధారం ఒకటి బయటకు వచ్చింది. తెల్లవారుజామున ఘాటు వాసన తో ఒక యువకుడు నిద్రలేచాడు. కళ్ళముందు ఎల్జి పాలిమర్స్ ప్లాంట్ నుండి ఒక వాయువు విడుదల అవుతుండడం గమనించి దానిని ఫోటోలు తీశాడు. కొద్దిసేపటికే అతనికి అది ప్రమాదకర వాయువు అని అర్థమైంది. ఆ ఫోటోలను చూస్తే క్షణాల వ్యవధిలోనే వాయువు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంత వేగంగా చుట్టివేసింది అన్న విషయం మనకి అర్థమవుతుంది. అసలు ఎంత మొత్తంలో గ్యాస్ బయటకు వచ్చింది…. ఎంత వేగంగా మిగతా గ్రామాలకు విస్తరించింది అన్న విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎక్కడైనా గ్యాస్ లీక్ అయినప్పుడు మొదటిగా ఒక ప్రాంతం లో వాసులు దాని బారిన పడితే…. ఈరోజు ఉన్న ఫోన్లు మరియు టెక్నాలజీ కమ్యూనికేషన్ ద్వారా వెంటనే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ అప్రమత్తమైపోయి జాగ్రత్త పడతారు. కానీ అది తెల్లవారుజామున సూర్యోదయం ముందే జరిగింది కనుక ఆరుబయట నిద్రపోతున్న వారంతా దీని బారిన పడ్డారు. ఈ సమయంలోనే ఒక అపార్ట్ మెంట్ లోని ఐదో అంతస్తులో ఉండే యువకుడు గ్యాస్ లీక్ అయిన విషయాన్ని గుర్తించి.. వెంటనే తన దగ్గరున్న కెమేరాతో.. ఆ ఫోటోల్ని తన ఫ్లాట్ నుంచి తీశాడు. అతడు ఫోటోలు తీసే సమయానికే గ్యాస్ ప్లాంట్ అంతా వ్యాపించింది. కాసేపటికే ఆర్.ఆర్. వెంకటాపురం గ్రామంలోకి ప్రవేశించింది. క్షణాల్లో గ్యాస్ గ్రామాల్ని చుట్టుముట్టిన వైనం తాజా ఫోటోలతో బయటకు వచ్చింది....
5th ఎస్టేట్

నిర్లక్ష్యమే అసలు డేంజర్… కే‌టి‌ఆర్ కూడా మూర్ఖంగా ప్రవరిస్తే ఎలా?

siddhu
ఈరోజుల్లో అవతలి వారిని అదరగొట్టాలంటే కత్తులతో.. కర్రలతో బెదిరించాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా ఒకసారి దగ్గినా లేక “హాచ్చి…!“ అని తుమ్మినా చాలు… జనాలు వణికిపోతారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి. అలాంటిది ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మాయదారి రోగం యొక్క లక్షణాల్లో జలుబు మరియు దగ్గు చాలా కీలకం. అయితే అలాంటి వేళలో జాగ్రత్తగా వ్యవహరించి సామాన్య ప్రజలకు స్ఫూర్తిగా నిలవాల్సిన నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు తమ ఆరోగ్యం తో పాటు అవతలి వారి ఆరోగ్యాన్ని కూడా రిస్క్ లో పడేస్తే ఏమనాలి? వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు ఎంతో మంచి నాయకుడిగా పేరున్న విషయం అందరికీ తెలిసిందే. అతనిపై మరియు అతని స్ఫూర్తిదాయకమైన నాయకత్వంపై ఎప్పుడూ ప్రశంసల వర్షం కురుస్తూ ఉంటుంది. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం చర్చనీయాంశం అయింది. మంత్రి కేటీఆర్ తీవ్రమైన జలుబు మరియు తుమ్ములతో ఇబ్బంది పడుతూ ఉండగా అదే సమయంలో అయినా సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి లో టెక్స్ టైల్స్ పార్కులో పనులను ప్రారంభించారు.  అయితే ఆ సందర్భంగా చాలా మంది ప్రజల మధ్యలో ఉన్న అతను పదేపదే తుమ్ముతూ మరియు కర్చీఫ్ తో ముక్కుని తుడుచుకుంటూ కనిపించారు.  అసలు చేతిలో ఏనాడూ తువ్వాలు కానీ కర్చీఫ్ కానీ పట్టుకొని తిరిగే అలవాటులేని కేటీఆర్ అందుకు భిన్నంగా ఒక గులాబీ రంగు తువ్వాలుని పట్టుకొని పదేపదే తుమ్మడం మరియు జలుబు వల్ల ముక్కు ని శుభ్రం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. బాధ్యతారాహిత్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తీరును పలువురు తప్పుబడుతున్నారు. లాక్ డౌన్ పీరియడ్ లో వీలైనంత వరకూ ఎవరిని గుమిగూడవద్దు వద్దు అని ఆదేశించాల్సిన నాయకులే స్ఫూర్తిని మరచి అందుకు భిన్నంగా తుమ్ముతూ…. దగ్గుతూ…. చీదుతూ ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే వివ్వెరపోవడం ప్రజల వంతు అయింది. నాలుగు రోజుల పాటు డెవలప్ మెంట్ పనుల్లో పాల్గొనకుంటే ఏమైనా నష్టం వాటిల్లుతుందా? అన్న ప్రశ్నల్ని పలువురు సంధిస్తున్నారు. నలుగురికి చెప్పాల్సిన స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్.. తన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టనట్లుగా వ్యవహరించటం సరికాదంటున్నారు. మరి దీనికి మంత్రి గారి సమాధానం ఏంటో..? ...
బిగ్ స్టోరీ

రాజకీయ జీవితం లో అతిపెద్ద డైలమా లో ఉండిపోయిన గంటా!

siddhu
  రాజకీయాల్లో కొంతమంది నాయకులు ఉంటారు. పేరుకి పార్టీలో ఉండి పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాలకు హాజరుకారు. కానీ మేము మాత్రం పార్టీ మనుషులమే దానికి ప్రత్యేకంగా ఎలాంటి రుజువులు అవసరం లేదని అంటుంటారు....
బిగ్ స్టోరీ

‘భవిష్యత్తు’ మీద చంద్రబాబు బెంగ?

siddhu
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరిదీ ఒక బాధ అయితే మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడుది మరొక బాధ. ఇప్పుడు కరోనా కంటే కొడుకు రాజకీయ భవిష్యత్తే చంద్రబాబు ని ఎక్కువగా భయపెడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…. నారా లోకేష్ రాజకీయంగా ఎదగలేకపోవడం మరియు అతని నాయకత్వం పార్టీ వర్గాల్లో నమ్మకం కలిగించలేకపోవడం వల్ల బాబు గారికి ఎక్కువ దిగులు పట్టుకుంది. చివరికి రాజకీయాలంటే సరిగ్గా తెలియని బండ్ల గణేష్ ఇలాంటి వాళ్లు కూడా లోకేష్ పై సెటైర్లు వేస్తూ ఉంటే బాబు తీవ్రంగా చింతిస్తున్నారు. ప్రస్తుతం 40 రోజులకు పైగా తండ్రి కొడుకులు ఇద్దరూ లాక్ డౌన్ వల్ల హైదరాబాదు లోనే ఉండి పోయారు. ఇకపోతే రాజకీయంగా తన సత్తా చాటేందుకు మంచి అవకాశం ఉన్నప్పుడు నారా లోకేష్ తొలి అడిగే తప్పటడుగు వేశారు. మంగళగిరి నియోజకవర్గం ఎంచుకొని పెద్ద పొరపాటు చేసిన లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీచేసి ఘోరమైన ఓటమిని చవిచూశాడు. దీంతో విమర్శకులు అన్నట్లుగానే లోకేష్ లో నాయకత్వ పటిమ లేదని తేలిపోయింది. రానున్న ఎన్నికల్లో మళ్లీ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేయాలనుకుంటున్న లోకేష్ నియోజకవర్గం ప్రజల నుంచి 40 రోజులుగా దూరం అయిపోవడం కూడా పెద్ద దెబ్బే ఇకపోతే లోకేష్ కు తన తండ్రి లాగా చాకచక్యంగా వ్యవహరించడం రాదని ఎప్పటి నుంచి విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో అతను సరిగ్గా వ్యవహరించాడని అంటుంటారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు లోకేష్ గురించి మీడియాకు ఈ విషయాన్ని వివరించడం గమనార్హం. అంతేకాకుండా క్లిష్ట పరిస్థితుల్లో లోకేష్ కనీసం స్పందించిను కూడా లేదని సదరు నేత ఆరోపించారు. జగన్ తొమ్మిదేళ్ళ పాటు పార్టీని ఒంటి చేత్తో ఒక్కడే ముందుగా నడిపించాడు. చివరికి అసాధారణ పోరాటపటిమ కనబర్చిన అధికారంలోకి వచ్చారు. వైసిపి మద్దతుదారులు అందరికీ ఏదో ఒక రోజు జగన్ రాష్ట్రాన్ని ఏలుతాడు అని విశ్వాసం ఉన్నది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లో లోకేష్ పైన ఇటువంటి భావన రవ్వంతైనా లేదు అనే చెప్పాలి. పొరుగున ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తండ్రి నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకున్నారు. కానీ నారా లోకేష్ విషయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కన్పిస్తుండటం చంద్రబాబును ఆందోళనలోకి నెట్టిందనే చెప్పాలి. మరి రానున్న రోజుల్లో నారా లోకేష్ పార్టీకి గుదిబండగా మారతారా? ఫైర్ అవుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి....
5th ఎస్టేట్

‘కామాంధుల’ కరోనా… ఇదేమి దరిద్రం…? 

siddhu
ఒకపక్క దేశమంతా కరోనా దెబ్బకు అల్లాడిపోతుంటే కొంతమందికి మాత్రం ఎవరి సరదాలు వారికి తీరాలి.. వాళ్ళ సరసాలు వారికి కొనసాగాలి. విషయం లోకి వస్తే దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోకి తెలంగాణ రాష్ట్రంలోనే కరోనా వైరస్ నిర్థారణ టెస్టులు తక్కువగా చేస్తున్నారని అంతా వాపోతుంటే కొంతమంది బాధ్యత రాహిత్యం ఆ రాష్ట్రాన్ని మరింత పెద్ద ప్రమాదంలో పడేస్తోంది. ఒకపక్క వైద్య పరీక్షలు నిర్వహించకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటే మరొకవైపు లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత ఏవీ సక్రమంగా జరగడం లేదు అన్నా ఆరోపణలు కూడా భారీగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వనస్థలిపురం మున్సిపల్ వైస్ చైర్మన్ యొక్క రాసలీలల విషయం బయటికి వచ్చింది. తెలంగాణలో రోజు నమోదవుతున్న కేసుల్లో 90 శాతం హైదరాబాద్ పరిధిలోనివే అందులో అతి కీలకమైన వనస్థలిపురం సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటి. అధికారులు దానిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి అనుమానిత రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు కూడా. ఒక పక్క పరిస్థితి ఇలా ఉంటే మన వైస్ చైర్మన్ అనిల్ తన సరదాలు తీర్చుకుంటూ ఉన్నాడు. రోజూ టైం కి కరెక్టుగా బయటికి వెళ్తాడు. కీలక పదవిలో ఉన్నాడు కదా బయట పనులు ఉంటాయి అని అనుకుంది భార్య. అయితే కొద్ది రోజులకే భర్త మరి బిజీ అయిపోవడం గమనించింది. అతని వాలకం చూస్తే కరోనా విధుల్లో మిగతా వారికి సహకరించడానికి వెళ్లినట్లు లేదు. తీరా ఆరా తీస్తే అతను చేసేవి కరోనా సహాయక చర్యలు కావని గ్రహించింది. ఏంటి విషయమని కొంచెం లోతుగా వెళితే అప్పుడు అసలు విషయం బయటపడింది తన ఇంటికి దగ్గరలోనే లాడ్జి లోని ఒక రూం తీసుకుని అందులో అతను అమ్మాయిలతో జల్సా చేస్తున్నాడు. దీనితో కోపం ఆపుకోలేక స్వయంగా వైస్ చైర్మన్ భార్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్ పై రైడ్ చేశారు. వైస్ ఛైర్మన్ తో పాటు ముగ్గురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు. వైస్ ఛైర్మన్ ఫ్రెండ్, లాడ్జ్ ఓనర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో రావడంతో హైదరాబాద్ వాసులు ఇవేమి పనులు రా దరిద్రుల్లారా అంటూ మండిపడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయినప్పుడు కరోనా ఉన్నా పట్టించుకోరనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ....
బిగ్ స్టోరీ

లాక్ డౌన్ 4.0 ప్రకటించనున్న మోడి ?

siddhu
  ఇప్పుడు దేశ ప్రజల అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే. మరొక వారం రోజుల్లో లాక్ డౌన్ తీస్తారా లేదా సడలింపులు పెంచుతారా? కథ కంచికి చేరనుందా లేకపోతే అంతరాయాలు అడ్డుకట్టలు ఇలాగే కొనసాగుతాయా? ఇక ఈ విషయానికి వస్తే ప్రజలు, యంత్రాంగానికే కాదు కనీసం రాజకీయ పార్టీలకి, కేంద్రానికి కి కూడా పరిస్థితి అర్థం కావట్లేదు. మోడీ చూస్తే ఏమో ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి అవసరమే అన్నారు. అసలు దేశంలో చూస్తే యాక్టివిటీ పెద్దగా లేదు. పల్లెల్లో పరవాలేదు గాని పట్టణాల్లో ఇప్పటికీ కఠినమైన ఆంక్షలు అమలు అవుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ యొక్క ప్రయోజనం సామాన్యులకు అంతుచిక్కడం లేదు. కేసులు తగ్గినట్లు వాళ్ళకి కనిపిస్తే కదా. ఇకపోతే మద్యం షాపులు తీసిన తర్వాత అదొక పెద్ద గొడవ. గుంపులుగుంపులుగా షాపుల ముందు నిలబడటం…. కనీస సామాజిక దూరం లేకపోవడం మందు తాగేసి రోడ్డులో చిందులు వేయడం. ఇక వారం రోజులు సరుకులు ఒక రోజే కొనడానికి సామూహికంగా గుమికూడటం, తోపులాటలు, సరుకుల కోసం ఎగబడటం అన్నీ రాష్ట్రాల్లో రోజు చూసేదే. వీటన్నింటి మధ్య మోదీ మే 17 తర్వాత దేశంలో నియంత్రణలను కొనసాగించి జూన్ 1వ తేదీ దాకా పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే 70 వేలకు దగ్గరగా దేశంలో ఉన్న పాజిటివ్ కేసులు నమోదు కాగా లాక్ డౌన్ 3.0 ముగిసే సమయానికి దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య లక్ష దాటుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నిర్ధారణ పరీక్షల సంఖ్య కూడా ఊహించనంత గొప్పగా ఏమీ లేదు. అంతా నామమాత్రంగానే సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి పది లక్షల మందికి కనీసం 20 వేల టెస్టులు చేయాలన్నది ఆరోగ్య నిపుణుల సూచన. కానీ మనం ఇంకా 2000 కూడా చేరకోకపోవడం గమనార్హం. ఇంకొక వైపు చూస్తే ఏమో తాజాగా నమోదవుతున్న కేసుల్లో లింకులు దొరకట్లేదు. ఎవరివల్ల కరోనా సోకిందో తెలియట్లేదు…. విదేశీ ప్రయాణం ఉండదు…. విదేశాలకు వెళ్లి వచ్చిన వాళ్ళతో కాంటాక్ట్ ఉండదు…. కరోనా సోకిన వారితో కాంటాక్ట్ ఉండదు. మరి వైరస్ ఎలా సోకినట్లు? ఈ ప్రశ్నలన్నింటికి నడుమ లాక్ డౌన్ ని పొడిగించడం ఉత్తమమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది అని సమాచారం. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు ఇలాగే కొనసాగేనో…?...
బిగ్ స్టోరీ

వామ్మో: జగదేక వీరుడు అతిలోక సుందరి… సినిమా కాపీనా ? 

siddhu
  అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా’ వచ్చి 30 ఏళ్లు అయిందట. అయితే దాని నిర్మాత తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ తీస్తానని కరాఖండిగా చెప్పేశారు కూడా. కొద్ది రోజులు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాహ్నవి జంటగా ఈ సినిమా తీస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఆ నిర్మాత తన ప్రతిజ్ఞను పునరుద్ధరించాడు. ఇకపోతే ఆ సినిమా యొక్క గొప్పతనం గురించి సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఆల్ టైమ్ క్లాసిక్ అని ఆ సినిమాకి చాలా పెద్ద ముద్ర వేయడమే కాకుండా చిరంజీవి అప్పట్లో 106 డిగ్రీల జ్వరంతో డ్యాన్సులు చేశారు అని కూడా రాస్తున్నారు. ఈ సినిమా బంపర్ హిట్.. అందులో తిరుగు లేదు. కానీ దానికి కల్ట్ క్లాసిక్ అనే ముద్ర వేసినప్పుడే సినిమా ప్రేమికుల మనసులు ఒప్పుకోవడం లేదట. అన్నీ కమర్షియల్ హంగులతో రంగరించిన ఒక సక్సెస్ ఫార్ములాతో ఫ్యాంటసీ సినిమాని తెరకెక్కించే లక్షలాది రూపాయలు ఈ చిత్రం వసూలు చేయగా పెద్ద పెద్ద సినిమా పండితులే ఆశ్చర్యపోయారు. అయితే ఆ సినిమాపై ఇప్పటికే అనేక మందికి కొన్ని తీరని అనుమానాలు ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన రెండు రోజులకు ఈనాడు తన ఎడిట్ పేజీలో సినిమాను వెక్కిరిస్తూ వ్యంగ్యంగా ‘మతిలేని వీరుడు గతి లేని సుందరి’ పేరిట ఒక ఆర్టికల్ కూడా వేసింది. ఆ చర్చ వచ్చినప్పుడు ఒక అతను చెప్పిన మాట ఏమిటంటే… సినిమా దర్శకుడు రేలంగి నరసింహారావు ఆ కథను ఒక నిర్మాతతో చెప్పారట. రాజేంద్రప్రసాద్ తో ఆ సినిమాను కూడా ప్రారంభించారు. చివరికి అదే కథను రాఘవేంద్రరావు చిరంజీవితో తీస్తున్నట్లు తెలుసుకుని ఆయనను కలుసుకుని మొరపెట్టుకున్నారు. అయితే తమ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది…. కాబట్టి రేలంగిని త్వరగా తన సినిమాను పూర్తిచేసి విడుదల చేసుకోమని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే రెండు సినిమాలు చిరంజీవి, రాజేంద్రప్రసాద్ మార్కెట్లను బట్టి ఆడాయి. ఒకరి దగ్గర కథ విని మరొకరికి చెప్పుకునే కథాచోరులు మన సినీ ఇండస్ట్రీలో మామూలే. అయితే చాలా మందికి ఇది కేవలం ఒక వార్త ఇక రాజేంద్రప్రసాద్ సినిమా కి వస్తే ఆ సినిమా పేరు రంభ-రాంబాబు. అందులో రాజేంద్రప్రసాద్ సరసన పారిజాత అనే ఒక అనామక హీరోయిన్ నటించింది. అందులో చంద్రమోహన్ నారద పాత్రధారి కాగా దాసరి నారాయణరావు యమధర్మరాజు. అందులో కథానాయకి పాత్ర దేవనర్తకి రంభ. నిజానికి ఈ సినిమాకి మరియు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి మానవుడు-దేవకన్య తప్ప వేరే పోలికలు లేవు. కథ మొత్తం వేరే…. ట్రీట్మెంట్ కూడా వేరే. అయితే రేలంగి ముందు వేరే కథ అనుకొని రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడు దెబ్బకు కథలో మార్పులు చేశారా అన్న అనుమానం ఇప్పటికీ చాలామందిలో ఉండిపోయింది. అయితే కమర్షియల్ సినిమాకు సంబంధించి రాఘవేంద్రరావు స్టైల్ మనకి తెలిసిందే. ఇక ఆ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికీ అందరి చెవుల్లో మోగుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమా కాపీయా కాదా…. అన్నది రెండు సినిమాల దర్శక-నిర్మాతలు నలుగురికే తెలియాలి. ఇక ఎన్నో మధ్య బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని క్లాసిక్ కన్నా కూడా ఒక కమర్షియల్ పెద్ద సక్సెస్ అయిన సినిమా గా చెప్పడం మంచిది. అచ్చం మొన్న వచ్చిన మన బాహుబలి లాగా....
బిగ్ స్టోరీ

వైజాగ్ కి అసలు సవాల్ మొదలైంది…

siddhu
  విశాఖలో ఎల్ జి పాలిమర్స్ నుండి గ్యాస్ లీక్ అయి పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆగమేఘాలమీద వైజాగ్ చేరుకొని బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్ కోటి రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించేశాడు. ఇక మంత్రి కన్నబాబు కి మిగతా బాధ్యతలు అప్పగించేసి వెంట వెంటనే తతంగం ముగించాను అనుకున్నాడేమో కానీ దీని వల్ల దీర్ఘకాల సమస్యలు చాలానే ఉన్నాయి అన్నది ఇప్పుడు అందరి మాట. ఈ గ్యాస్ ప్రభావం ఆ ప్రాంత ప్రజలపై చాలాకాలం ఉండబోతోందని మరియు మరిన్ని ఆందోళనకర అంశాలు ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నాయి. సాధారణంగా స్టైరీన్ గ్యాస్ అంత ప్రమాదకరమైనది ఏమీ కాదు. మామూలు మనం నివసించే టెంపరేచర్ లో చాలా సురక్షితం కూడా. మరి గ్యాస్ వ్యాపించిన ఊళ్ళలో అంతమంది ఆస్పత్రి పాలు ఎందుకు అయ్యారు? చుట్టూ ఉన్న పచ్చదనం మొత్తం ఎందుకు కాలిపోయింది? వీటన్నింటికి చాలామంది దగ్గర సమాధానం లేదు. గ్యాస్ లీక్ అయినా శాస్త్రీయంగా ఒక అర కిలోమీటరు కన్నా ఎక్కువ వ్యాపించదు. దాని సాంద్రత ఎక్కువ కాబట్టి ఇప్పుడు వ్యాపించినంత దూరం అయితే వ్యాపించే అవకాశం లేదు. కానీ స్టైరీన్ ను 200 నుండి 300 డిగ్రీల మధ్య వేడి చేయడం ఏమిటి? ఐదు కిలోమీటర్ల దాకా వ్యాప్తి చెందడం ఏమిటి? శాస్త్రవేత్తల దగ్గరనుండి ఈ ప్రశ్నలన్నీ వస్తుంటే సమాధానం చెప్పలేక అంతా తెల్ల ముఖం వేసుకొని చూస్తున్నారు. అసలు స్టైరీన్ లో ఏవైనా కొత్త రసాయనాలు కలిపితే ఏ అవసరం కోసం కలిపారు అన్నది ఇంకా తేలాల్సి ఉంది. జగన్ వేసిన కమిటీలు అసలు కారణాన్ని బయటకు తీస్తాయో లేదో వేచి చూడాల్సిందే. ఈలోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. గాలి కాలుష్యం అయింది…. కానీ అది మెల్లమెల్లగా కంట్రోల్ లోకి వస్తుంది. ఇక దాని బారిన పడి ఆసుపత్రి పాలైన వారందరిలో చాలాకాలం అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదీ కాకుండా వారికి పుట్టబోయే బిడ్డలు కూడా అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే ఐదారు ఊర్లలో ప్రతి ఇంటిలో ఉన్న ఏ కూరగాయలు ఉపయోగపడవు. పారేయాల్సిందే. చివరికి బియ్యం, పప్పులు, ఉప్పులు కూడా అంటే. ఆ ఊర్లలో చెట్లకు కాసిన కాయలు.. పొలాల్లో పండిన పంట ఏది చేతికి రాదు. ఇక ఇంటింటికీ ఒక లక్ష రూపాయలు ఇచ్చాను అన్నీ కొత్తవి కొనుక్కోండి అని జగన్ అంటాడేమో. ఇక భూగర్భ జలాలు కూడా బాగా కలుషితం అయిపోయాయి అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విశాఖకు నీళ్లు ఇచ్చే సమీప రిజర్వాయర్ పరిస్థితి ఏమిటో అయితే ఇంకా స్పష్టత రాలేదు. అది కలుషితం అయి ఉంటే చాలా పెద్ద సమస్య వస్తుంది. ఆ నీరు ఇంకిపోదు ఆవిరి అయిపోదు. అసలు రిజర్వాయర్ కు కొత్త నీళ్లు వచ్చేదాకా వ్చాటిని ఎండబెట్టడం సాధ్యమేనా? రాబోయే రోజులు విశాఖ వాసులకి చాలా క్లిష్టతరం కానున్నాయి అన్నది మాత్రం వాస్తవం....
బిగ్ స్టోరీ

‘నేను ఉండి ఉంటే అసలు ….’ చంద్రబాబు పాండిత్యం మొత్తం బయటకొచ్చింది

siddhu
  నిన్న విశాఖ గ్యాస్ లీక్ ఘటన జరిగిన తర్వాత జగన్ హుటాహుటిన వైజాగ్ కు తరలిపోయారు. అయితే చంద్రబాబునాయుడు గారు మాత్రం విశాఖకు వెళ్లేందుకు ఎన్నో విఫలయత్నాలు చేశారు. అదలా ఉంచితే మొన్నటి నుండి వైరల్ అవుతున్న వ్యాఖ్య ఏమిటంటే ‘మోడీకి ఏపీలో నో ఎంట్రీ అని ఉరిమిన చంద్రబాబే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేందుకు మోడీని అడుక్కుంటున్నాడు’ అని. విశాఖ వెళ్లడానికి చంద్రబాబు ప్రధాని మోదీ సాయాన్ని మరియు అనుమతి కోరిన దాన్ని చూపిస్తూ బయటకు వచ్చినా వ్యాఖ్య ఇది. రాజకీయాల్లో ఇంత అస్థిరమైన శత్రుత్వాలు మరియు చంచలమైన స్నేహ బంధాలు ఒక్క చంద్రబాబు దగ్గర మనం చూస్తూ ఉంటాం. ఇక ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండవలసి రావడం వల్ల తన రాజకీయ లబ్ధి కోసం చేయవలసిన ప్రయత్నాల అవకాశాల్ని కోల్పోవాల్సి వస్తుందని అసహనంతో ఊగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ఫ్రస్టేషన్ లో అతనే మాట్లాడుతున్నాడు అతనికే అర్థం కావట్లేదు. తనకు ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోగొట్టుకుంటున్న తీరు ఇప్పుడు తెదేపా వర్గాలకు అంతుచిక్కడం లేదు. నిన్నటి విశాఖ గ్యాస్ లీక్ తర్వాత బాబు అన్న మాటలివి — “ఐఏఎస్ లు ఏం చేస్తారు? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా…. స్టైరిన్ అంటే నాకే తెలియదు ఐఏఎస్ లకు ఏం తెలుస్తుంది? జగన్ ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావడం లేదు. చెబితే వినడు. సబ్జెక్ట్ కమిటీ కదా వేయాల్సింది జగన్ తో సంబంధం లేకుండా మా నాయకులు రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్ప లతో నేనే ఓ కమిటీ వేస్తున్నాను” జగన్ వేసిన కమిటీ ని కాదని తమ సొంత ఎమ్మెల్యేలతో కమిటీ వేయడం ఏందో చంద్రబాబుకే తెలియాలి. సాంకేతికంగా రసాయన పరిశ్రమల గురించి ఐఏఎస్ అధికారులు, నిపుణులకు కాకపోవచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో పరిశ్రమలను ఏం చేయాలి…. తదుపరి ప్రమాదాలను నివారించాలన్న విషయం పై వారి కన్నా బాగా ఎవరికి తెలుసు? కంపెనీ వైఫల్యం మరియు మొన్న చోటుచేసుకున్న తప్పిదాలను పరిశీలించి ఆయా నిపుణులతో చర్చించి తగిన నిర్ణయాలు నివేదికలను వివరించాల్సిన బాధ్యత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు…. అందులోనూ ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులకు కాకుండా ఇంకా ఎవరికి ఉంటుంది? అటువంటి కమిటీని బాబు తప్పుబట్టడం ఏందో అతనికే తెలియాలి. ఇంతకీ రామానాయుడు, అచ్చెన్నాయుడు, చినరాజప్ప ఏఏ సబ్జెక్టుల్లో పట్టబధ్రులో బాబు గారే సెలవివ్వాలి. ఇదిలా ఉంటే, “కోటి రూపాయలతో మనిషి బ్రతుకి వస్తాడా..? అసలు కోటి రూపాయలు ఎవరు అడిగారు? అవి అయినా సరిపోతాయా?” అంటూ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం బాబు గారు ఎంతవరకు సబబు? ఉదారంగా పరిహారాలు ఇవ్వడం చంద్రబాబు కి ఎప్పుడూ చేతకాలేదు… పైగా మళ్లీ అర్ధరహితమైన వ్యాక్యాలు. పుష్కరాల ప్రమాదం సందర్భంలో బాబు చేసిన నిర్వాకం ఎవరికీ తెలియంది కాదు. రేపు పొద్దున లీగల్ ఫైట్ లో కంపెనీ నుండి ఎక్కువ మొత్తం రాబట్టలేకపోయినా కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇస్తామన్నా కోటి రూపాయలు అయినా పరిహారంగా వస్తాయి అన్న భావంతో జగన్ కోటి రూపాయలు ప్రకటించి ఉండవచ్చు. దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అది వేరే విషయం. ఇకపోతే…. “ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. నేను ఉండి ఉంటే నేరుగా ఫ్యాక్టరీలో కి వెళ్ళే వాడిని. ప్రభుత్వం హ్యాండిల్ చేసిన తీరు సరిగా లేదు” అని బాబు వ్యాఖ్యానించడం కొసమెరుపు. బాబు ఉంటే ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఏం చేసేవాడు? సేఫ్టీ వాల్వ్స్ స్వయంగా క్లోజ్ చేసేవాడా లేదా అప్పటికప్పుడు ఇంజన్లు రిపేర్ చేసేందుకు బోల్టు లు, నట్లు విడదీసి ఎక్కడ తప్పు జరిగిందో కన్నుక్కొని చివరికి ధ్రవ పదార్థాన్ని వాయువుగా మారకుండా ఉందేందుకు పాలిమరైజేషన్ చేసేవాడా?  ఒక రాజకీయ నాయకుడు ప్రమాదం జరిగేటప్పుడు ఫ్యాక్టరీలకు వెళ్లి చేయగలిగింది ఏముంటుంది? ఏదో వినే వాళ్ళు వెర్రి మాలోకాలు అన్నట్లు పిచ్చి వ్యాఖ్యలు చేయడం కాకపోతే....
బిగ్ స్టోరీ

జగన్ సైలెంట్ ఉన్నా… టీడీపీ నే హైలైట్ చేస్తోంది 

siddhu
  కరోనా ప్రబలిన మొదట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పైన చాలా విమర్శలు వచ్చాయి. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో అతనిని పోచి చాలా దారుణమైన రీతిలో పాలనను కొనసాగిస్తున్నారని…. ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే జగన్ మాత్రం ఏ మాత్రం తడబాటు లేకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూపోయాడు. ఇకపోతే మొదట్లో జగన్ కరోనా మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని మరియు దానితో కలిసి జీవించాల్సిన రోజులు ముందు ఉన్నాయని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేసుకుంటే అప్పుడు పచ్చ బ్యాచ్ విపరీతమైన గగ్గోలు పెట్టింది. అసలు సహజీవనం అనే మాటను జగన్ ఎలా అంటారు అని ఎగిరెగిరి పడ్డారు. పచ్చ చొక్కా లోపల దాచి పెట్టి పైకి ఎర్ర చొక్కాలు.. కాషాయం చొక్కాలు ధరించిన వాళ్లు కూడా జగన్ మాటలకు రుసరుసలాడారు. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వ‌మూ అదే మాటే చెప్పింది. క‌రోనాతో క‌లిసి జీవించ‌డాన్ని నేర్చుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. మే 17 త‌ర్వాత ప‌రిస్థితి ఏమిటి? అనే ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ విధంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. క‌రోనాతో లాక్ డౌన్ ను ఇంకా పొడిగిస్తూ పోవ‌డం జ‌రిగే పని కాద‌నే విష‌యం కేంద్రానికి పూర్తిగా అర్థం అవుతున్న‌ట్టుగా ఉంది. మ‌రి ఇప్పుడేమంటారు?  వీళ్లంద‌రి క‌న్నా ముందు జ‌గ‌న్ ఇదే మాటే చెబితే, వెర్రిమాట‌లు మాట్లాడిన‌ట్టుగా ఇప్పుడూ మాట్లాడ‌తారా! మాట్లాడ‌గ‌ల‌రా? ఇక ఆ విషయం పక్కన పెడితే ఆంధ్ర రాష్ట్రంలో రోజూ నమోదు అవుతున్న కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ముందునుండి ఈ విషయమై ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. ఇక ముందు నుండి ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ డేంజర్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో రోజుకి 10 అంతకన్నా తక్కువ కేసులు నమోదు అవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 50 కేసులు నమోదు కావడం తో అంతా జగన్ పై ఫైర్ అయ్యారు. అయితే లోపల అసలు నిజం ఏంటో ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా ద్వారా నిజం వారి కళ్ళముందు కనపడుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకి 3 వేల నుండి 5 వేల మధ్య కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతూ ఉంటే తెలంగాణలో మాత్రం రోజుకి 150 నుండి 200 మధ్యలో మాత్రమే నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు పాత్రికేయులు మరియు ప్రజలు నిలదీసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రోజుకి ఎన్ని టెస్టులు జరుగుతున్నాయో చూపించడం కూడా మానేసింది. సాధ్యమైనన్ని ఎక్కువ పరీక్షలు చేస్తూ ఎంతోమంది కరోనా బాధితులను బయటకు తీసుకు వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నందుకు ప్రశంసించడం పోయి అసలు పారదర్శకత లేని ప్రభుత్వం తో పోల్చి విమర్శించడం ఏమిటనే భావనలో ప్రజలు ఉన్నారు. అలాగే విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు ఏపీ ప్రభుత్వం కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు కోటి రూపాయలు సరిపోవని అంతకు రెండు రెట్లు మూడు రెట్లు ఇవ్వాలని అడగడం తెలుగుదేశం పార్టీ వారి దయనీయమైన పరిస్థితి తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అసలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవ్వనంత మొత్తాన్ని జగన్ ప్రకటించినప్పటికీ చింతిస్తూ ఉంటే వారు ఇలా మాట్లాడడం చివరికి జగన్ హైలెట్ చేసినట్లే అవుతోంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ వ‌ర్గాల తీరు వ‌ల్ల జ‌గ‌న్ లోని దార్శానిక‌త మ‌రింత‌గా బ‌య‌ట‌ప‌డుతున్న‌ట్టుగా ఉంది!...
5th ఎస్టేట్

కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి బాంబు పేల్చిన డబ్ల్యూహెచ్ఓ..! 

siddhu
భారతదేశంలో లాక్ డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని మరియు ఇక మిగిలిన వారందరికీ వ్యాక్సిన్ ద్వారా నయం చేస్తారని భావిస్తున్న ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇచ్చింది. ఇటీవల కాలంలో వస్తున్న కొన్ని వార్తల ప్రకారం కొద్ది రోజులకి కరోనా ను నయం చేసే వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చేస్తుందని… ఇక ఆ మహమ్మారి కి విరుగుడు వచ్చినట్టే అని…. ఇక ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆశతో ఉన్న ప్రజలందరూ ఇప్పుడు నిర్ఘాంతపోయే విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ బయటపెట్టింది. ప్రపంచ ప్రజలందరూ త్వరలోనే కరోనా మందు అందుబాటులోకి వస్తుందని ఆశించడం తప్పు అని చెప్పిన డబ్ల్యుహెచ్వో…. ఇప్పట్లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. కరోనా కు వ్యాక్సిన్ కనుగొనడం ఇప్పట్లో జరిగే పనిగా తాము భావించడం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శాస్త్రవేత్త డేవిడ్ నబారో తెలిపారు. ఒక వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ ను తయారు చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పిన ఆయన…. ఇందులో ఎన్నో దశలు ఉంటాయని వాటన్నింటిని ఖచ్చితత్వంతో పూర్తి చేస్తేనే వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు అనుమతి వస్తుందని వివరించారు. మొదటి దశలోనే వ్యాక్సిన్ ను మనిషికి ఇస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని చెప్పిన ఆయన ప్రస్తుతానికి మనిషికి ప్రయోగించి ఆ వ్యాక్సిన్ వైరస్ ను చంపుతుందా లేదా అని గుర్తించారని అన్నడు. దీని తర్వాత మూడో దశలో వ్యాక్సిన్ వల్ల మనిషికి ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా వస్తాయా అని పరీక్షిస్తారని.. ఇక నాలుగో దశ విషయానికి వస్తే వ్యాక్సిన్ వల్ల ఇప్పటికే ఒక మనిషికి ఉన్న జబ్బుల పై ఎలాంటి ప్రభావం పడుతోందని పరిశీలించిన తర్వాత ఇవన్నీ పాస్ అయితే చివరి దశలో ఈ వ్యాక్సిన్ ఏ వయసు వారిపై ఎలా పనిచేస్తుందో పరిశీలించి అప్పుడు మార్కెట్లోకి వదులుతారు అని వివరించారు. ఈ ఐదు దశల్లో ఏ ఒక్క చోట విఫలమైనా మళ్ళీ మొదటినుంచి పరిశోధన చేసి అన్ని దశలలో పాస్ అయితేనే మందు బయటికి తీసుకుని రావడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే డెంగ్యూ, హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమైన వైరస్ లకు వ్యాక్సిన్ కనిపెట్టలేదని…. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా అదే పరిస్థితి ఏర్పడిందని ఆయన చెప్పారు.ఎయిడ్స్ వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచంలో 3.2 కోట్ల మంది మరణిస్తున్నారని.. ఇప్పుడు కరోనాది అదే పరిస్థితి అని వివరించారు. అందుకే ఇప్పట్లో కరోనా వైరస్కు మందు రాదని.. జాగ్రత్తలు పాటించి సమాజం నుంచి ఆ వైరస్ను వెళ్లగొట్టడమే తక్ష కర్తవ్యమని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) శాస్త్రవేత్త డేవిడ్ నబారో మాటల వెనుక ఉన్న అర్థం....
బిగ్ స్టోరీ

కరోనా విషయం లో భారీ బ్యాడ్ న్యూస్ చెప్పిన సైంటిస్ట్ లు 

siddhu
  భారతదేశంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా…. పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. అయితే ఈ సమయంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యల్లో ఇప్పటివరకు కీలక పాత్ర పోషించిన ఎయిమ్స్ విశ్వవిద్యాలయ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కరోనా వ్యాప్తిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న అన్ని ప్రణాళికలు మరియు కంటైన్మెంట్ కోవిడ్ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన తన వంతు పాత్ర పోషించారు.   ఇకపోతే ఇప్పటిలో ఈ కరోనా వైరస్ మనల్ని వదిలి వెళ్ళదు అని స్పష్టం చేసిన ఆయన వచ్చే శీతాకాలంలో భారతదేశంలో కరోనా వైరస్ రెండవసారి విజృంభించే అవకాశం ఉందని తేల్చి చెప్పారు. ఇలా మరికొన్ని రోజులు మనం ఈ మహమ్మారి తో కలిసి జీవించాలని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా జనాలు తిరగడం వల్ల కరోనా వ్యాప్తి జరుగుతోందని చెప్పిన ఆయన ఈ పోరాటంలో ప్రైవేటు రంగం కూడా తనవంతు పాత్ర పోషించారని పిలుపునిచ్చారు. అలాగే దేశంలోని హాట్ స్పాట్ లలో ఉన్న కేసులు తగ్గించడం పై ప్రత్యేక దృష్టిసారించాలని కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ గులేరియా సూచించారు. దీనికి సంబంధించిన వ్యూహాలను ప్రత్యేక ప్రాంతాల్లో అమలు పరచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా ఈ ప్రాంతానికి తగ్గట్టు మన ఆలోచనా సరళి కూడా మారాలని. ఒకే ఆలోచనను అన్ని ప్రాంతాలలో అమలు చేయడం కుదరదు అని చెప్పిన ఆయన హాట్ స్పాట్ లపై ప్రత్యేక నిఘా ఉంచి దగ్గరుండి పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా దేశంలో రానున్న శీతాకాలం భారతదేశ భవిష్యత్తును నిర్దేశించనుందని చెప్పిన ఆయన లాక్ డౌన్ ను ఎత్తివేసిన తరువాత కూడా శీతాకాలంలో ఉన్నట్లుండి కేసుల భారీగా పెరిగే అవకాశం ఉందని అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బెడ్స్ పారామెడికల్ సిబ్బంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ వెంటిలేటర్స్ లాంటి వసతులు సిద్ధం చేయాలన్నారు. ఇకపోతే ఇప్పటివరకు భారతదేశంలో ఇప్పటికే 46605 కేసులు నమోదు కాగా 12948 మంది కోలుకున్నారు. 1573 మంది మరణించారు. 32080 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు...
5th ఎస్టేట్

రాజకీయాల్లో ‘అది’ లేకపోతే ఎలా… కే‌సి‌ఆర్ నుంచి జగన్ నేర్చుకోవాల్సింది ఇదే ! 

siddhu
  రాజకీయ జీవితంలో అయినా…. వ్యక్తిగత జీవితంలో అయినా మనం ఏ పని చేసినా దానిని అవతలివారికి మన అజెండా అర్థమయ్యేలాగా లౌక్యంగా పని చేయడం ముఖ్యం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి చాలా వ్యత్యాసం ఉంది. ఒక వైపు కేసీఆర్ లౌక్యంగా మాట్లాడుతూ ప్రజలను మెప్పిస్తూ విపక్షాలకు నోట మాట లేకుండా చేస్తుంటే…. జగన్ మాత్రం అతను తీసుకున్న ప్రతి నిర్ణయానికి తీవ్రంగా విమర్శల పాలు అవుతూ ఉన్నారు. కానీ ఇద్దరూ చేస్తున్న పని ఒక్కటే అయినా మాటకారితనం లేకపోవడం మరియు పరిస్థితిని అర్థం అయ్యేలా చెప్పలేకపోవడంతో జగన్ కెసిఆర్ కన్నా ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాడు అనే చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు అన్నీ ఒకటే. ఇద్దరు చేస్తున్నది ఒకే రకమైన పాలన. అయితే అన్ని విషయాల్లో కేసీఆర్ తరువాత తన నిర్ణయాన్ని తెలిపిన జగన్…. సరిగ్గా మినహాయింపుల విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం కన్నా ఒక రోజు ముందు ఉన్నారు. దాంతో ఎలాంటి మీడియా సమావేశం లేకుండా ఉన్నట్టుండి మద్యం దుకాణాలు తెరవగా… రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు ప్రజల మందు కోసం ఎగబడితే అతను విమర్శల పాలయ్యారు. ఇక ఇదే పనిని కేసీఆర్ ఒక రెండు రోజులు ఆగి చాలా లౌక్యంగా చేశారు. మరీ ముఖ్యంగా రెండు గంటల మీడియా సమావేశంలో చివరి అంశంగా మద్యం షాపులు తెరవడం గురించి ప్రస్తావించిన ఆయన తెలంగాణలో గుడుంబా, అక్రమ మద్యం, సారా మరియు కల్తీ మద్యం ఏరులై పారకుండా మద్యం షాపులు తెరుస్తున్నామని కారణంగా చెప్పి ఈ విషయాన్ని చాలా సాఫ్ట్ గా వ్యవహరించారు. జగన్ లాగే రెడ్ జోన్ లలో కూడా మద్యం షాపులు తెరిచిన కేసీఆర్ ఈ విషయంలో మాత్రం తన వ్యక్తిగత నిర్ణయం ఏమీ లేదని కేంద్రం ఆదేశాలతోనే ఇవన్నీ చేస్తున్నానని చెప్పి అటు విపక్షాల నోర్లు మూయించేశారు. ఇకపోతే జగన్ మొదటి రోజు లిక్కర్ పై 25 శాతం మరియు రెండవ రోజు 50% రేట్లు పెంచి ప్రజలను దోచుకుంటున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు. కెసిఆర్ మాత్రం 16 శాతం మాత్రమే మద్యం ధరలు పెంచి చీప్ లిక్కర్ పై 11 శాతానికి పెంచారు. మద్యపాన నిషేధం లో భాగంగా జగన్ ఈ పనిని చేశామని చెబుతున్నా…. ప్రజల బలహీన సమయాన్ని చూసి దోచుకుంటున్నారని ఇప్పటికే విమర్శకులు మీద ఎక్కేశారు. కాబట్టి ఇకనైనా జగన్ మేలుకొని ఒక ఇష్యూ ని సాఫ్ట్ గా ఎలాంటి రిస్క్ లేకుండా ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటే మంచిది....
5th ఎస్టేట్

టీవీ9 మీద తెలంగాణ ప్రజలకు చిర్రెత్తుకొచ్చింది…!

siddhu
  రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మీడియా సంస్థలలో టీవీ9 చాలా కాలం నుండి అగ్రగామిగా వెలుగొందుతోంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మధ్యన పొద్దున లేచినప్పటినుండి సోషల్ మీడియాలో టీవీ9 ఛానల్ కు ఒకటే తిట్లు.. శాపనార్ధాలు. వారి వార్తలు ప్రజెంటేషన్ మరియు డిబేట్ కోసం తీసుకునే అంశాలు… వారు వేసే వార్తల్లో ఉండే కంటెంట్ చాలామందికి నప్పదు. అంతేకాకుండా జాతీయవాదులు ఈ ఛానల్ ని ఎక్కువగా ద్వేషిస్తుంటారు అని అపవాదు కూడా ఉంది. ఇక నాస్తికుడిగా చెప్పుకునే రవి ప్రకాష్ నాటి నుండి ప్రస్తుతం ఆస్తికుడిగా కనిపించే మై హోమ్ రామేశ్వరరావు వరకూ ఎవరి చేతుల్లోకి వచ్చినా కూడా ఛానల్ పైన ప్రజలకు అభిప్రాయం మారలేదు అనే చెప్పాలి.   ఇక తాజాగా ఈ ఛానల్ పైన వచ్చిన విమర్శ ఏమిటంటే… వారు మొన్ననే ఒక స్క్రోలింగ్ వేశారు. “హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ…. ప్రాంతం ఏదైనా మరే ఛానల్ కి అందనంత దూరంలో మా టీవీ9 తెలుగు” అని. దీంతో తెలంగాణ వాసులకి ఈ ఛానల్ పై చిర్రెత్తుకొచ్చింది. తెలంగాణ పోరాట సమయంలో కూడా ఆ ఛానెల్ పై తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉండేది. ఎక్కువగా ఆంధ్ర జర్నలిస్టులు ఉండటం మరియు ప్రజల ఆకాంక్షల మేరకే మా పంథా అని రవి ప్రకాష్ అన్నా అటువంటి భావాన్ని ఎప్పుడూ ఆచరణలో చూపించకపోవడం దానికి కారణాలు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ వారి పాలనను వెక్కిరిస్తూ చాలా రోజులు ప్రభుత్వ ఆగ్రహానికి గురై కనిపించకుండాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ మరియు తెలంగాణ లను వేర్వేరుగా చూపించడం ఏమిటని వారిపై తెలంగాణ ప్రజలకు గుస్సాయిస్తున్నారు. అసలు వారి పబ్లిసిటీ కోసం ఈ హెడ్డింగ్ వాడడం కూడా కొంచెం ఓవర్ అనే చెప్పాలి. టీవీ9 కి సెల్ పబ్లిసిటీ అవసరమే లేదు. ఎంతోకాలంగా నిజంగానే రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ గా ఉంటూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. అయితే ఇక్కడ చాలా మందికి తెలియని నిజం ఏమిటంటే… హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు వేరు వేరు అన్నది టీవీ9 చేసిన సొంత వర్గీకరణ అయితే కాదు. బార్క్ అనే రేటింగ్ సంస్థ మూడు విభాగాలుగా రేటింగ్ లు ఇస్తూ వస్తోంది. పత్రికలకు ఏబీసీ, ఐఆర్ఎస్ ఎలాగో…. టీవీ చానళ్లకు బార్క్ అలాగ. రేటింగ్స్ నిర్ధారణకు లెక్కలోకి తీసుకునే ప్యారామీటర్ల సంఖ్యపై, ఎంచుకునే ప్రతిపాదనల శాస్త్రీయత పై విమర్శలు ఉన్నప్పటికీ టీవీ9 లాంటి చానెళ్లకు బార్క్ మాత్రమే ప్రామాణికం. ఈ బార్క్ రేటింగ్స్ ఆధారంగా పెద్ద పెద్ద కంపెనీలు యాడ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, హైదరాబాద్ లను విడివిడిగా చూస్తూ ఉంటారు. అంతేతప్ప విషయంలో టీవీ9 కు ఎటువంటి కక్ష మరియు ద్రోహం బుద్ధి కానీ లేవు. ఆ విమర్శలు సరైనవి కావు. పాపం టీవీ 9 ప్రజల ఆగ్రహానికి అనవసరంగా గురై తిట్లు తిన్నది....
5th ఎస్టేట్

‘కుల’ పిచ్చి రాజకీయాలకి జగన్ మార్క్ సంకెళ్ళు…! 

siddhu
  రాజకీయాల్లో అవతలి వారు వేయబోయే ఎత్తును ముందుగానే పసిగట్టి దానికి పైఎత్తు ను సిద్ధం చేసుకోవడం చాలా కామన్. అయితే ఎవరి ఊహకు అందకుండా ఒక మాస్టర్ ప్లాన్ వేసి అవతల వారిని సందిగ్ధతలో పడేయడం అన్నది కేవలం కొద్దిమంది వల్ల మాత్రమే అవుతుంది. అటువంటి కోవకే చెందుతారు వైసిపి పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి అత్యంత పట్టు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎలాంటి అడ్డు లేకుండా నడిపించేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇన్ని రోజులు కులాల పరంగా రాజకీయాలు చేసేందుకు మొగ్గు చూపిన విపక్షాలకు చెక్ పెట్టేందుకు తగిన ఈక్వేషన్ లతో జగన్ సన్నద్ధమయ్యారు. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో కూడా ఒక మంచి వ్యూహంతో అడుగుపెట్టిన జగన్ ముఖ్యంగా మెట్ట ప్రాంతంలో ఎక్కువగా ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని పెద్దపీట వేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారు. మెట్ట ప్రాంతం క్రిందకు వచ్చే నియోజకవర్గాల్లో కమ్మ వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తనకు అత్యంత సన్నిహితులైన దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి కి ఆయన అధిక ప్రాధాన్యతను ఇవ్వడం ఇప్పటికే గమనించాం. అదే కాకుండా చింతలపూడి, దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో మండల స్థాయిలో కమ్మవారికి ప్రాధాన్యతను పెంచారు. ఏలూరు మరియు పోలవరం నియోజకవర్గంలో కూడా వ్యూహాత్మకంగా కమ్మ వర్గం వారికి ఎక్కువ పదవులు ఇస్తూ వైసీపీ వైపు తిప్పుకోవడానికి మరియు తన వ్యక్తిగత ఓటు బ్యాంకు పెంచుకోవడానికి కూడా జగన్ శ్రీకారం చుట్టారు. ఇక ఈ జిల్లాలోని మరో కీలక ప్రాంతమైన డెల్టా రీజియన్ లో కూడా జగన్ అడ్డు లేకుండా చెలరేగి పోతున్నాడు. డెల్టా ప్రాంతం క్రిందకు వచ్చే నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్షత్రియ మరియు బిసి వర్గాలు బలంగా ఉన్నాయి. అక్కడ బలంగా ఉండాలంటే వారి ఓటు బ్యాంకు అత్యంత కీలకం. నిజానికి టీడీపీకి క్షత్రియ బలం పెద్దగా లేదు. అంతే కాకుండా తూర్పు కోనసీమలో కూడా రాజకీయాల్ని శాసించేది క్షత్రియులే. ఈ విషయాన్ని గమనించిన జగన్ గారికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఇక బీసీ వర్గానికి చెందిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు కి మంత్రి పదవి కట్టబెట్టిన జగన్ అదే ప్రాంతంలో వైసిపి సమర్థవంతంగా ముందుకు సాగేందుకు కృషి చేసిన ముదునూరి ప్రసాదరాజు రాబోయే రోజుల్లో కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసేసారు. ఇక జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల త‌ర్వాత చైర్మన్ ప‌ద‌వి సైతం కౌరు శ్రీనుకే ద‌క్క‌నుంది. ఇక బీసీ వ‌ర్గానికే చెందిన య‌డ్ల తాతాజీకీ డీసీఎస్ఎంఎస్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. ఇలా జ‌గ‌న్ టీడీపీకి చెక్ పెట్టే క్రమంలో ప‌శ్చిమ‌లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనికి ప్రతిగా టీడీపీ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి...
బిగ్ స్టోరీ

ఓపెన్ చేసి తీరాల్సిందే – కే‌సి‌ఆర్ పీక మీద కూర్చున్నారు వారంతా!

siddhu
ఆర్థికంగా సంపన్నమైన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే లాక్ డౌన్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన ఇష్టం వచ్చినన్ని రోజులు పొడిగించుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఎలాగోలాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు కానీ ముందు ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఆయన చాలా గట్టిగానే ఉన్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వారాలు లాక్ పొడిగిస్తున్నట్లు చెప్పిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టిన సడలింపుల కింద మద్యపానాన్ని విక్రయించడం మొదలుపెట్టొచ్చు అని తెలియజేసిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క షాపు కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. కానీ కొన్ని పత్రికలు మాత్రం పాలకుడి అభిప్రాయానికి భిన్నంగా మద్యం షాపులు తెరవాలి అన్నది ప్రజల అభిప్రాయం అన్న ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సదరు పత్రిక వాదన ఏమిటంటే మద్యం షాపులు తెరిచేందుకు ఏపీ, మహారాష్ట్ర మరియు కర్నాటక ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చారని అయితే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షల వల్ల మద్యం ఇక్కడ పొంగిపొర్లే అవకాశం ఉందట. అదే కనుక జరిగితే రాష్ట్రంలో జనం జేబులు గుల్ల అయిపోవడం ఖాయమని…. అధిక రేట్లకు ఇక్కడ విక్రయిస్తారు అని వారు భవిష్యత్తును చెప్పేశారు. అదే కాకుండా దీని వల్ల కల్తీ మద్యం ప్రవేశించి ప్రజల ప్రాణాలకు ముప్పు తేవచ్చు అని మరియు గుడుంబా బట్టీలు కూడా అప్పుడే మొదలైపోయాయని కళ్ళకు కట్టినట్లుగా వార్తల్లో ప్రచురించారు. ఇటువంటి వార్తలతో ప్రజల్లో కొద్దిగా అసహనాన్ని రగిల్చి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారి అజెండా ఏమో. అంతేకాకుండా ఆమధ్య లిక్కర్ షాపులపై ఒక ప్రశ్న అడిగిన పాపానికి ఒక జర్నలిస్ట్ పై కేసీఆర్ విరుచుకుపడిన తీరు మనకి తెలిసిందే. ఇక పక్క రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతూ తమ రాష్ట్రంలోని పత్రికలే ప్రభుత్వ మద్యం పై తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నట్టు వార్తలు రాస్తూ ఉంటే సీఎం గారు మాత్రం ఏం చేస్తారు. ఈరోజు సాయంత్రం ఒక అత్యవసర మీటింగ్ కు ఆదేశించి గ్రీన్, ఆరెంజ్ మరియు రెడ్ జోన్ లలో మద్యం విక్రయాల విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. చివరికి అతి త్వరలోనే తెలంగాణలో కూడా మద్యం విక్రయాలు మొదలైపోతాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంత మంది గొంతు మీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తే ఎంత సీఎం అయినా ఏం చేస్తాడు లే…!...