Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ శ్రీ సత్య విజయవంతంగా రానిస్తున్న సంగతి తెలిసిందే. ప్రారంభంలో చాలా స్లోగా గేమ్ ఆడిన గాని మూడో వారం నుండి చాలా దూకుడుగా గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా డివియేట్ అవ్వకుండా.. పక్కా స్ట్రాటజీలతో ఫేస్ టు ఫేస్ ఆట ఆడుతూ గెలవడానికి కష్టపడతోంది. ఇదిలా ఉంటే శ్రీ సత్య తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో శ్రీ సత్య గురించి ఇష్టానుసారంగా వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా అర్జున్ .. శ్రీ సత్యాల స్నేహాన్ని వక్రీకరించి.. మాట్లాడుతున్నారు.
వారిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. అయితే శ్రీ సత్య పై పిచ్చిపిచ్చిగా రాతలు రాస్తే.. సదరు యూట్యూబ్ ఛానల్స్ పై కేసు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. శ్రీ సత్య గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి.. తన భార్య ఏడిచిందని చెప్పుకొచ్చారు. కూతురు శ్రీ సత్య గురించి ఏది పడితే అది రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో శ్రీ సత్య తన తల్లి పక్షవాతానికి గురైతే దాదాపు 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ కూతురు కూడా తన తల్లికి ఈ రీతిగా డబ్బులు ఖర్చు పెట్టలేదని స్పష్టం చేశారు. తన తల్లి ఆరోగ్యం బాగుపడాలని బిగ్ బాస్ షోలో డబ్బు కోసమే శ్రీ సత్య గేమ్ ఆడుతుందని స్పష్టం చేశారు. అసలు బిగ్ బాస్ షోలోకి వెళ్ళొద్దని చెప్పిన.. తన తల్లి ట్రీట్మెంట్ కి కావలసిన డబ్బు కోసం శ్రీ సత్య… షోలో పాల్గొన్నట్లు తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.