Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో గీతు రాయల్, ఆది రెడ్డి గేమ్ ఒకో వారంలో ఒకో రకంగా ఉంటూ ఉంది. ఇద్దరూ రివ్యూర్స్ కావడంతో ప్రతి పరిస్థితిని అంచనా వేస్తూ ఆడుతూ ఉన్నారు. మొదటి వారంలో చాలా వరకు కెమెరా ఫోకస్ వీరిద్దరికి లభించింది. ప్రతి ఒక్కరి ఆట గమనిస్తూ ఇద్దరు మాట్లాడుకునే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఈ సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు సగం గేమ్ పూర్తి కావడంతో..గీతు రాయల్, ఆది రెడ్డి ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ హౌస్ లో జరుగుతుంది. ఇక ఇదే సమయంలో హౌస్ లో ఇంటి సభ్యులు సరిగ్గా గేమ్ ఆడే పరిస్థితులు కనిపించని నేపథ్యంలో… బిగ్ బాస్ ఇంటి సభ్యులపై సీరియస్ కావడం తెలిసిందే. ఎవరు కూడా సరిగ్గా గేమ్ ఆడటం లేదని.. బిగ్ బాస్ హౌస్ లో ఉండటానికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని మంగళవారం ఎపిసోడ్ లో మండి పడటం జరిగింది. దీనిలో భాగంగా ఇంటి సభ్యులకు ఫుడ్ ఇవ్వకుండా..టాస్క్ గెలిచి తినాలని కండిషన్ పెట్టారు.
ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులకు కబాడీ గేమ్ పెట్టడం జరిగింది. అయితే గెలిచిన సభ్యులు ఓడిపోయిన సభ్యులకు… ఫుడ్ పెట్టకూడదని కండిషన్ పెట్టారు. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాన్ని గీతు రాయల్… ఆది రెడ్డి ఉల్లంఘించడం జరిగింది. గెలిచిన టీం మెంబెర్ అయిన ఆదిరెడ్డి ప్లేటులోని ఆహారాన్ని గీతూ తినేసింది. దీంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యి గీతు రాయల్… ఆది రెడ్డి..చేత అంట్లు తోమించారు. బయట నుంచి గిన్నెలు పంపించి మరి తోమాలని ఆదేశించి పనిష్మెంట్.. ఇవ్వటం జరిగింది.