Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారం వీకెండ్ రసవత్తరంగా సాగింది. హోస్ట్ నాగార్జున.. వారంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇచ్చిన షాకుల విషయంలో గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఇదే సమయంలో వారంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్లకి చివాట్లు ఇంకా బాగా ఆడిన వాళ్ళని మెచ్చుకోవటం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సత్య ఆట తీరుపై నాగార్జున షాకింగ్ కామెంట్లు చేశారు. శుక్రవారం ఎపిసోడ్ లో తన టీం ఓడిపోవడంతో బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలు.. ఓడిపోయిన టీమ్ లో నుండి నేరుగా ఒకరు నెక్స్ట్ వీక్ కి నామినేట్ కావాలని ముందుగానే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో తాను నామినేట్ అవుతున్నట్లు తన టీమ్ మెంబర్స్ అందరికీ శ్రీ సత్య తెలియజేసింది. ఓటమికి బాధ్యతగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా పేర్కొంది.
అయితే కొద్ది నిమిషాలకే మనసు మార్చుకుని చీటీల గేమ్ ఆడింది. అందులో కూడా శ్రీ సత్య పేరే రావటం జరిగింది. ఆ తర్వాత ఇది కూడా కాదు.. టీం లో ఉన్న సభ్యులంతా డిస్కషన్ చేసుకొని.. డిసైడ్ అవ్వాలని కోరింది. ఈ క్రమంలో శ్రీ వాసంతి తర్వాత వారానికి నామినేట్ అయింది. మొత్తానికి ఈ రీతిగా తాను నామినేషన్ నుండి తప్పించుకుంది. ఈ విషయాన్ని శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ప్రస్తావించారు. ముందుగా పప్పు విషయంలో తప్పు ఎవరిదని నాగ్ ప్రశ్నించారు. దీనికి ఫ్రెండ్స్ నలుగురు ఉన్నప్పుడు వారు ఏం అనుకున్నా ఓకే అని.. కానీ ఒక గేమ్ జరుగుతున్న సమయంలో అలా అనడం తప్పేనని చెప్పింది. ఆ తరువాత చిట్టీల విషయం తీశారు. ‘చిట్టీల్లో నీ పేరు వచ్చింది.
చిట్టీల నుంచి ఓటింగ్కు మార్చడం అన్నది మీరు కరెక్ట్గా ఫీల్ అయ్యారా?’ అని నాగ్ ప్రశ్నించారు. దీనికి శ్రీ సత్య అసలే హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం లేదని తిడుతున్నారు. ఇక చీటీల గేమ్ ఆడితే.. మళ్లీ మీతో శనివారం తిట్టించుకోవలసి వస్తుందని. డిస్కషన్ పెట్టుకొని శ్రీ వాసంతిని నామినేట్ చేసినట్లు తెలిపింది. మొత్తానికి చివరాఖరికి నన్ను ఇరికించారన్నమాట అంటూ నాగార్జున శ్రీ సత్య ఇచ్చిన వివరణకు సెటైర్ వేశారు. ఇదిలా ఉంటే తన టీం ఓడిపోవడానికి తానే కారణం అని ముందు ఒప్పుకున్న శ్రీ సత్య తర్వాత చీటీలకు ఏమని నాటకం ఆడి.. నెక్స్ట్ వీక్ నామినేషన్ నుండి తప్పించుకోవటం..పై ఆడియన్స్ నుండి నెగెటివిటీ వినపడుతోంది. శ్రీ సత్య కన్నింగ్ గేమ్ ఆడుతుందని విమర్శలు చేస్తున్నారు.