Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ చివరాకరికొచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హౌస్ లో 8 మంది ఉండగా ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చని బయట వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే రోహిత్, కీర్తి, ఫైమా ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. బయట పరిస్థితి ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో “టికెట్ టూ ఫినాలే” టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టాస్క్ లో కొంతమంది కంటెస్టెంట్ లను కావాలని… బీబీ టీం పక్కన పెడుతున్నట్లు .. ఆడియన్స్ నుండి వస్తున్న టాక్.
ముఖ్యంగా రోహిత్ నీ టాప్ ఫైవ్ లో చేరకుండా బీబీ టీం కుట్ర పన్నుతుందని అంటున్నారు. అందువల్లే టికెట్టు ఫినాలే టాస్క్ “స్నో మెన్” టాస్క్ నుండి స్టార్ట్ కావటం జరిగింది. ఆ టాస్క్ లో అందరికంటే రోహిత్ ముందంజలో ఉండి గెలవడం జరిగింది. అయితే ఆ సమయంలో పాయింట్స్ బీబీ టీం ప్రకటించలేదు. కానీ ఈ టాస్కులు తర్వాత బీబీ టీం సపోర్ట్ చేసే కంటెస్టెంట్స్ ముందంజలో ఉండటంతో అప్పటినుండి పాయింట్స్ డిస్ ప్లే చేశారు. ఇదంతా పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ కోటకి చెందిన కంటెస్టెంట్లను గెలిపించడానికి కుట్ర జరుగుతుందని బయట ఆడియన్స్ అంటున్నారు. ఈ క్రమంలో టికెట్లు ఫినాలే టాస్క్ స్టార్ట్ అయిన సమయంలో… చివరి పాయింట్స్ కలిగిన కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అని .. రూల్స్ ప్రకటించిన గాని స్నోమాన్ టాస్క్ లో.. కావాలని బీబీ టీం పాయింట్స్ డిస్ ప్లే చేయలేదట.
ఆ తర్వాత రోహిత్ మరియు కీర్తి అవుట్ అయ్యాక పాయింట్స్ డిస్ ప్లే… చేయటం స్టార్ట్ చేశారు. బీబీ టీం పక్కా ప్లానింగ్ తో తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించుకోవడం కోసం కుట్రగా ఆడుతుందని విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వారం రోహిత్ మెరీనా యానివర్సరీ సమయంలో.. హౌస్ లో విషెస్ చెప్పడానికి మెరీనా రిక్వెస్ట్ చేసిన గాని బీబీ టీం ఒప్పుకోలేదట. ఏది ఏమైనా స్ట్రాంగ్ కంటెంట్ ఎటువంటి నెగెటివిటీ లేకుండా ఆడుతున్న రోహిత్ నీ… ఎలాగైనా హౌస్ నుండి బయటకు పంపించడానికి బీబీ టీం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆడియోన్స్ నుండి నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.