Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రేక్షకులకు తీవ్రస్థాయిలో చిరాకు తెప్పిస్తున్నాయి. సీజన్ స్టార్టింగ్ లో కంటెస్టెంట్స్ విషయంలో తీవ్రస్థాయిలో నెగిటివిటీ రావటం జరిగింది. ఇంకా గేమ్ పరంగా కూడా మొదటి మూడు వారాలు చాలా స్లోగా నడిచింది. ఇంటి సభ్యులు ఎవరు కూడా గేమ్ కోసం కష్టపడినట్టు ఎక్కడా కనిపించలేదు. తిన్నామా..? పడుకున్నామా..? తెల్లారిందా..? అన్న రీతిలో వ్యవహరించారు. గీతు రాయల్ ఒక్కతే చాలా సీరియస్ గా గేమ్ స్టార్ట్ చేసింది. మిగతావాళ్లు నైట్ బిగ్ బాస్ టాస్క్ లు ఇచ్చిన గాని ఎవరికి వారు నిద్రపోవడం జరిగింది.
అయితే మధ్యలో బిగ్ బాస్ తో పాటు హోస్ట్ నాగార్జున సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అప్పటినుండి ఇంటి సభ్యులందరూ సీరియస్ గేమ్ ఆడటం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సీజన్ చివరికి వచ్చేసరికి …బీబీ టీం వ్యవహరిస్తున్న తీరు ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా ఆదివారం ఇనాయానీ ఎలిమినేట్ చేయటం పట్ల విమర్శలు వస్తున్నాయి. లేడీ టైగర్ గా మగవాళ్ళతో సైతం తలబడిన కంటెస్టెంట్ గా.. నామినేషన్ లో ఉన్న ప్రతిసారి ఎక్కువ ఓట్లు రాబట్టిన ఇనాయానీ కావాలని.. టాప్ ఫైవ్ కి వెళ్లకుండా ఎలిమినేట్ చేసినట్లు జనాలు చివాట్లు పెడుతున్నారు.
ఇక ఇదే విషయంపై హోస్ట్ నాగార్జున సైతం బీబీ యాజమాన్యం పై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ నీ కావాలని ఎలిమినేట్ చేసినట్లు నాగార్జున కూడా భావించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో నెక్స్ట్ సీజన్ నుండి హోస్ట్ గా రాకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆడియన్స్ ఓటింగ్ పరంగా కాకుండా … యాజమాన్యం తమకి ఇష్టం వచ్చిన కంటెస్టెంట్లను హౌస్ లో కొనసాగించడం పై నాగార్జున ఫుల్ సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.