Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ గేమ్ దాదాపు చివరికి వచ్చేసింది. ఈరోజుతో 12వ వారం ఓటింగ్ పోల్స్ క్లోజ్ కానున్నాయి. 12వ వారం నామినేషన్ లో 6గురు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మరోపక్క హౌస్ లో టికెట్టు ఫినాలే టాస్క్ జరుగుతూ ఉంది. అయితే ఈ టాస్క్ లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బీబీ టీం పక్క ప్లానింగ్ తో ఫేవరెటిజం చూపిస్తున్నట్లు ఆడియోన్స్ నుండి వినబడుతున్న టాక్. విషయంలోకి వెళ్తే నెల్లూరు జిల్లాకు చెందిన కంటెస్టెంట్ ఆదిరెడ్డిని బీబీ టీం కావాలని గెలిపించడానికి.. సోలో ఇష్టానుసారంగా రూల్స్ పెడుతున్నట్లు ఆడియోన్స్ అంటున్నారు.
మరి కొంతమంది ఆదిరెడ్డిని గెలిపించడానికి రాజకీయ నేతలు సైతం షో నిర్వాహకులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఒక ప్రముఖ అధికార పార్టీకి చెందిన కుటుంబ సభ్యులు సైతం ఆదిరెడ్డి కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు కూడా.. సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. జనాల ఓటింగ్ తో సంబంధం లేకుండా…బీబీ యాజమాన్యం బస్టాండ్ సారంగా వ్యవహరిస్తుందని.. నిజాయితీగా ఆడుతున్న రోహిత్ ఇంకా పలు కాంటెస్టెంట్ల విషయంలో పక్క ప్లానింగ్ తో పక్కకు పెడుతున్నారని జనాలు మండిపడుతున్నారు. ఇలా ఫేవరెటీజం చూపిస్తూ మళ్ళీ జనాలని ఎందుకు ఓట్లు వేయమని అడుగుతున్నారు అంటూ మరి కొంతమంది నిలదీస్తున్నారు.
మీకు ఇష్టం వచ్చిన కంటెస్టెంట్ కి టైటిల్ ఇచ్చేయొచ్చుగా మధ్యలో జనాలను ఎందుకు మోసం చేస్తున్నారు అని విమర్శిస్తున్నారు. ఆది రెడ్డి సింపతి గేమ్ మరియు ఇతరులను ప్రభావితం చేసే రీతిలో గేమ్ ఆడుతున్నాడు. ఆదిరెడ్డి తో పోలిస్తే రోహిత్ చాలా నిజాయితీగా గేమ్ ఆడుతున్న గాని టికెట్టు ఫినాలే టాస్క్ లో రోహిత్ ఎక్కువ పాయింట్లు వచ్చిన సమయంలో… పాయింట్స్ డిస్ప్లే చేయకుండా ఆదిరెడ్డికి వచ్చిన టైంలో డిస్ ప్లే చేసి పక్షపాతం చూపిస్తున్నారని.. ఇది చాలా దారుణమ్మని బిగ్ బాస్ ఆడియోన్స్ అంటున్నారు.