Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఏనిమిదో వారంలో ప్రెజెంట్ కెప్టెన్సీ టాస్క్ జరుగుతోంది. చెరువులో చేపలు పేరిట జరుగుతున్న ఈ టాస్క్ చాలా రసవత్తరంగా సాగింది. హౌస్ లో ఉన్న 14 మందిని జంటలుగా ఏడు టీములుగా విభజించి ఆడించారు. అయితే తొలి రౌండు మంగళవారం ఎపిసోడ్ లో గీతూ, ఆదిరెడ్డి ఇద్దరు కూడా అనర్హులుగా మిగిలిపోయారు. మంగళవారం ఎపిసోడ్ లో ఈ ఇద్దరికీ చాలా బలమైన గాయాలు కూడా తగిలాయి. ఇద్దరూ కూడా తోటి కంటెస్టెంట్లపై మొదట రెచ్చిపోవటం మిగతా వాళ్ళు కూడా వీళ్ళిద్దరిపై రెచ్చిపోవటంతో చివరఖరికి మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే వీరిద్దరి దగ్గర చేపలు తక్కువ ఉండటంతో మంగళవారం అనర్హులుగా బిగ్ బాస్ ప్రకటించారు.
కానీ బుధవారం ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్విమ్మింగ్ పూల్ వద్ద గీతూ రాయల్ కి ఒక నల్ల చేప దొరికింది. అది స్పెషల్ పవర్ కావటంతో.. బుధవారం గేమ్ చివర ఆఖరికి చేపలు లెక్కింపు ప్రారంభం అయ్యాక ఎవరికి వారు ప్రకటించారు. అందరిలో కంటే ఎక్కువగా 129 చేపలు రేవంత్, ఇనాయా వద్ద ఉన్నాయి. అయితే నల్ల చాప దొరికిన గీతూకి స్పెషల్ పవర్ రావడంతో … ఇద్దరినీ స్వైప్ చేయాలని బిగ్ బాస్ ఆదేశిస్తారు. దీంతో రేవంత్, ఇనాయా దగ్గర ఉన్న చేపలను శ్రీహన్, శ్రీ సత్యాల చేత స్వైప్ చేయటంతో రేవంత్, ఇనాయా జంట దగ్గర 67 ఉంటాయి.
ఈ పరిణామంతో ఈ రౌండ్ లో శ్రీహాన్, శ్రీ సత్య టీమ్ గెలిచినట్లయింది. ఈ రీతిగా గీతూ రాయల్ తన దగ్గర ఉన్న.. స్పెషల్ పవర్ తో రేవంత్, ఇనాయాకి షాక్ ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ అప్పటికే మొదటి రోజు చేపల చెరువు టాస్క్ లో మొదటిరోజు అందరికంటే ఎక్కువ కలిగి ఉన్నారు. అదే ఆట తీరుతో చివరి వరకు ఉండగానే గీతూకి స్పెషల్ పవర్ రావడంతో రేవంత్ టీం ఓడిపోయింది.