Pushpa 2: గత ఏడాది పాండమిక్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ గా “పుష్ప” విజయం సాధించడం తెలిసిందే. “పుష్ప” సినిమా డైలాగులు ఇంకా పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కోసం భారీగానే డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నరు. “పుష్ప” మొదటి భాగం సాధించిన విజయంతో సెకండ్ పార్ట్ మరింత హిట్ అయ్యేలా… స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకోవడం జరిగింది. వాస్తవానికి “పుష్ప” గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ అయితే.. సెకండ్ పార్ట్ ఈ ఏడాది మార్చి నెలలోనే షూటింగ్ ప్రారంభం కావాలి.
కానీ అనూహ్యంగా ఏడాది ప్రారంభంలో.. కరోనా కేసులు భారీగా పెరగటంతో మొత్తం లెక్కలు తారు మారయ్యాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సుకుమార్ రెడీ అయ్యారు. ఇటువంటి తరుణంలో సినిమాలో ఒకేలక పాత్రకి హీరోయిన్ సాయి పల్లవిని.. సుకుమార్ తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో లేటెస్ట్ వార్త వైరల్ అవుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. “పుష్ప 2” మొదటి భాగం కంటే ఎక్కువ భాషలలో విడుదల చేస్తున్నారు.
అంతేకాదు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున చేయనున్నట్లు సమాచారం. డాన్స్ పరంగా సాయి పల్లవి ఇంకా అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరి జోడి ఓకే అయితే.. సరిగ్గా మాస్ సాంగ్ పడితే.. ఇద్దరికిద్దరు పోటీపడి డాన్స్ చేస్తే మాత్రం ధియేటర్లు దద్దరిల్లిపోతాయి అంటూ ఈ వార్తపై సినీ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ “పుష్ప” కి సంబంధించి సాంగ్స్ విషయంలో ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ కొన్ని బాణీలు డైరెక్టర్ సుకుమార్ కి వినిపించి ఓకే చేయించినట్లు సమాచారం.