గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను తీవ్రంగా పరిగణిస్తున్న భారతీయ జనతా పార్టీ, పార్టీ ప్రచారం కోసం ఒకరి తరువాత ఒకరిని దిల్లీ నుండి బరిలోకి దింపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసేందుకు మొన్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవ్దేకర్ వచ్చి కొద్ది రోజుల క్రితం నగరంలో ఉండగా, ఇక బుధవారం స్మృతి ఇరానీ వంతు అయింది.
రోజుకొకరు
రాబోయే మూడు రోజుల్లో పలువురు సీనియర్లు బిజెపి తరపున ప్రచారం కోసం హైదరాబాద్ సందర్శించనున్నారు. వీరిలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. బిజెపి అగ్ర నాయకుల పర్యటనలను టిఆర్ఎస్ వారు కనీసాం పట్టించుకోను కుడా పట్టించుకోవడాం లేదు. హైదరాబాద్లో స్థానిక మునిసిపల్ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న బిజెపి అగ్ర నాయకత్వాన్ని తమ పార్టీ స్వాగతిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి మంత్రి కె టి రామారావు చాలా వ్యంగ్యంగా తెలిపారు.
అప్పుడు కనపడలేదే…? సరే దయచేయండి!
“నగరం భారీ వర్షాలు మరియు వరదలను ఎదుర్కొంటున్నప్పుడు అదే నాయకులు హైదరాబాద్కు వచ్చి ఉంటే చాలా బాగుండేది” అని కెటిఆర్ ఉప్పల్ లో తన రోడ్ షో సందర్భంగా చెప్పారు. “వారు నగరాన్ని సందర్శిస్తున్నందున, వారు దుర్గాం చెరువు వంతెన, అన్నపూర్ణ కేంద్రాలు మరియు బస్తీ దవాఖానాలను కూడా సందర్శించవచ్చు” అని కెటిఆర్ చెప్పారు. “ఖాళీ చేతులతో రావడానికి బదులు, సిఎం కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కోరిన 1350 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం (వర్షం ప్రభావిత కాలనీలలో సహాయక చర్యల కోసం) తీసుకురావాలని నేను వారిని అభ్యర్థిస్తున్నాను” అన్నాడు ఐటి శాఖా మంత్రి కేసీఆర్.
ఈ అత్యుత్సాహమే కొంప ముంచేది
దుబ్బాక ఉప ఎన్నికల్లో వచ్చిన విజయంతో అత్యుత్సాహానికి పోతున్న బిజెపి అనవసరంగా జాతీయ నాయకులందరినీ హైదరాబాద్ కు కలిసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపణలు దీంతో ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలతో బిజెపి నాయకులు తమ పరువు తీసుకుంటున్నట్లు అయిందని అంటున్నారు. కేటీఆర్ అన్న మాటలలో సరైన పాయింట్లు ఉన్నాయని… అంత మందిని తీసుకొని వచ్చి ప్రచారం చేయించడం మరీ అంత మంచిది కాదని అంటున్నారు. వీరి మాటలు తప్పో కరెక్టో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వరకు ఆగాల్సిందే.