జగన్మోహన్రెడ్డి ఏదైనా అనుకుంటే పట్టువదలని విక్రమార్కుడిలా దానిని సాధించే వరకూ నిద్రపోరు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ లో ఎన్నో మలుపులు తిరుగుతున్న 3 రాజధానులు విషయం చివరికి ఒక కొలిక్కి వచ్చేలాగే ఉంది. ఇక దీనికి సంబంధించి జగన్ వేసుకున్న ప్లాన్ కు ఒకసారి చూస్తే….
పెద్దాయనతోనే మొదలెట్టాడు….
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే 3 రాజధానుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించింది. ప్రభుత్వం తరఫున రాజధాని తరలింపు వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నుండి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ వెళ్లింది. రాజధానుల శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించేందుకు జగన్మోహన్రెడ్డికి అపాయింట్మెంట్ కావాలని లేఖలో కోరారు. అయితే ఈ ప్రక్రియను 16వ తేదీ పెట్టుకున్న జగన్ ఆన్లైన్ పద్ధతిలోనైనా ప్రధాని పాల్గొనవచ్చు అని ఈ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఆ రోజే ఎందుకు?
ఇది ఇప్పటికే శాసనపరమైన ప్రక్రియ అంతా పూర్తి చేసిన ప్రభుత్వం గవర్నర్ బిల్లులపై సంతకాలు పెట్టడంతో గెజిట్ కూడా వెంటనే విడుదల చేసింది. అయితే జగన్ ఈ ఆగస్టు 16న మంచి రోజు ఉందని ఆ రోజు దాటితే మళ్లీ దగ్గరలో మంచి ముహూర్తం లేదని అంటున్నారు. హైకోర్టు ఈ నిర్ణయంపై స్టేటస్కో విధించిం అలాగే జగన్ ప్రభుత్వానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా ఇచ్చింది. అయితే జగన్ మాత్రం కచ్చితంగా ఆగస్టు 16 ని తన జీవితంలో ఒక మరిచిపోలేని రోజుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు..
ఎవరైతే నాకేంటి..?
జగన్ నడుచుకుంటున్న తీరు ఎలా ఉంది అంటే ఎవరు ఏం చేసినా 16వ తేదీ తాను ఎట్టి పరిస్థితుల్లో రాజధానిగా విశాఖ కు శంకుస్థాపన చేస్తానని ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నాడు. అందుకే సుప్రీంకోర్టు కూడా వెళ్లి ధైర్యంగా హైకోర్టు విధించిన స్టేటస్కో పైన స్టే ఇవ్వాలని అలాగే విచారణ వీలైనంత త్వరగా జరపాలని పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దీనిని స్పెషల్ లీవ్ పిటిషన్ గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినందువల్ల దీనికి సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.
శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, గవర్నర్ తో వ్యవహరింఛినట్లు జగన్ 16వ తేదీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని సుప్రీం కోర్టు వారిని డిమాండ్ చేయడం మొదలు పెట్టినట్లైంది. మరి జగన్ దూకుడు కి కోర్టు అడ్డం పడుతుందా లేదా ఆగస్టు 16వ తేదీ తన రాజకీయ జీవితంలో మరిచిపోలేని రోజుగా మిగులుస్తుందా అన్నది వేచి చూడాలి.