కరోనా కారణంగా దెబ్బతిన్న పరిశ్రమల్లో సినీ ఇండస్ట్రీ ప్రప్రథమం అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండు నెలల షూటింగ్ ఆగిపోతే ఒక్కసారిగా సినీ పెద్దలు అప్రమత్తం అయిపోయి మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి షూటింగ్ లకు అనుమతి తీసుకున్నారు. అయితే షూటింగులు పునఃప్రారంభించడానికి అన్నీ రెడీ అయ్యే సమయానికి కారణంగా ముందు అడుగు వేయలేని పరిస్థితి.
చిరు కథ కొత్తగా ఉందే….
ఇలాంటి పరిస్థితుల్లో కరోనా తగ్గిన ప్రభావంతో గత రెండు నెలల్లో ఒక్కొక్కటిగా తిరిగి సినిమాల్లో కొన్ని షూటింగ్ లకు అనుమతుల కోసం ఇంకా తిరుగుతూ ఉండగా వాటిక్కన్నింటికీ వచ్చేశాయి. ఇక చిరంజీవి విషయానికి వస్తే అతని సినిమా మాత్రం ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్లే లేదు. కరోనాకు భయపడుతూ ఉండడమే ఈ ఆలస్యానికి కారణం అని చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పటికే చిరంజీవి లైన్ లో కొన్ని ఉన్నాయి. లేటెస్ట్ సినిమా అయితే ‘ఆచార్య’ అయితే ఎట్టకేలకు నవంబర్ 4వ తేదీ నుండి చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోబోతున్నాడని…. ఆచార్య పట్టాలెక్కుతోంది అని వార్తలు వచ్చాయి. దీంతో మెగా అభిమానుల్లో ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చింది.
మరీ అప్పుడంటే కష్టమే…!
అయితే మళ్లీ బయటికి వచ్చిన సమాచారం ప్రకారం ఈ వారంలో కూడా ఆచార్య షూటింగ్ ప్రారంభం కావటం లేదని అంటున్నారు. ఏకంగా సంక్రాంతి తర్వాత ఈ సినిమా తిరిగి పట్టాలెక్కుతోంది అన్న వార్తలు మొదలయ్యాయి. మధ్యలో చిరంజీవి తన లైన్లో లూసిఫర్ లేదా వేదాళం రీమేక్ ను పెట్టుకొని ఉన్నాడు. ఈ లోపల అయినా అవి మొదలౌతాయా అంటే అది కూడా సందేహాస్పదమే. ఇలాంటి సమయంలో అసలు ఆచార్య తో వచ్చిన ఇబ్బంది ఏమిటి అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
డౌట్లే డౌట్లు….
ఇక ఇన్ని రోజులు ఆలస్యం జరగడానికి ఆశ్చర్య స్క్రిప్ట్ విషయంలో జరిగిన కాంట్రవర్సీ కి ఏదో లింక్ ఉందని జనాలు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఒకతను వచ్చి ఈ స్క్రిప్ట్ నాదని లైవ్ లో కొరటాలతో గొడవ పడ్డాడు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నారని కాబట్టి షూటింగ్ కి వెళ్ళడం కుదరదు అని టాక్ నడుస్తోంది. రాజేష్ అనే ఒక రచయిత చేసిన పెద్ద గొడవ కారణంగానే స్క్రిప్ట్లో మార్పులు జరుగుతూ కావాలని షూటింగ్ జాప్యం చేస్తున్నారని అంటున్నారు.
ఇక ఈ జాప్యం ఆ రైటర్ ఆరోపణల నేపథ్యంలో జరుగుతుందా లేదా చిరంజీవిని మెప్పించేందుకు మార్పులు చేయడంలో ఆలస్యం అవుతుందా అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. అలాగే ఆలస్యం అవుతుంటే మరికొన్ని సందేహాలు రావడం మాత్రం ఖాయం.