కొద్ది వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వారి దేశంలో లక్షలాది సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు నుండి తమ ప్రజలను కాపాడుకునేందుకు భారతదేశాన్ని మొదట భయపెట్టి, బెదిరించి.. ఆ తర్వాత బ్రతిమాలి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను ఇప్పించుకున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాధి ట్రీట్మెంట్ కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ చాలా బాగా పనిచేస్తుంది అన్న ఆ విషయం తెలిసి భారతదేశంలో ఆ మందు చాలా ఎక్కువగా నిల్వ ఉండటంతో అవసరమైనంత మేర ఉంచుకుని మోడీ ప్రభుత్వం మిగిలినది మిగతా దేశాలకు అందించింది.
అయితే ఇప్పుడు భారత శాస్త్రవేత్తలు నే అడ్డుపెట్టుకొని అమెరికా భారత్ కు వెన్నుపోటు పొడవడం జరిగింది. మొత్తం ఈ దారుణమైన చర్యకి నలుగురు శాస్త్రవేత్తలు ఒడిగట్టగా వారిలో ముగ్గురు భారత సంతతికి చెందిన వారు కాగా మరొకరు అమెరికా శాస్త్రవేత్త. వివరాల్లోకి వెళితే ప్రపంచ ప్రఖ్యాత లాన్సెట్ పత్రికలో ప్రచురింపబడిన ఈ వార్త ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకాన్ని అమెరికాలో ఆపేశారని…. రోగులకు ఆ మందులు ఇవ్వడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతాయని తెలిపారు. అయితే ఈ విషయంపై సుమారు 180 మంది వైద్య నిపుణులు దీనికి సంబంధించిన నివేదికను మరియు డేటాను ఇవ్వమని అడుగగా పత్రిక యాజమాన్యం తెల్లముఖం వేసింది.
అసలు ఈ తప్పుడు వాడు ఎక్కడ నుండి వచ్చింది అని ఆరా తీయగా పైన చెప్పబడిన నలుగురు శాస్త్రవేత్తలు ఇచ్చిన ఫేక్ సమాచారం ప్రకారం ఆ వార్త ప్రచురింపబడినది అని ఆ శాస్త్రవేత్తలను పత్రిక వారు డేటా, ఆధారాలు వారు అందించలేకపోయారు తెలిపారు. అయితే ఆ రిపోర్ట్ అందించిన విలేకరిని పత్రికా యాజమాన్యం తక్షణమే ఉద్యోగం నుండి తొలగించినా…. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది దీంతో శాస్త్రవేత్తలు తమ తప్పును ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు. అయితే వీరు ఈ రకమైన ప్రకటన చేయడం వెనుక ఎవరి ప్రభావమో తప్పకుండా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.