ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడిగా ఉ న్నప్పుడు టిడిపి మాజీ నేత మరియు బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ మరియు మాజీ మంత్రి బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాసులు కలవడం చాలా పెద్ద సంచలనంగా మారింది. అదీ కాకుండా వారంతా లాక్ డౌన్ సమయంలో అంత రిస్క్ తీసుకుని హయత్ హోటల్ లో రహస్య భేటీ నిర్వహించుకోవడం ఎన్నో చర్చలకు దారి తీసింది. అయితే ఇప్పుడు తిరిగి తిరిగి ఈ వ్యవహారమంతా బిజెపి మెడకి చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది.
అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారు అన్న విషయంపై హుటాహుటిన స్పందించి కామెంట్లు చేసింది సుజనా చౌదరి. అతను చేసిన కామెంట్లు మరియు ఇచ్చిన వివరణ పరిస్థితికి అతకకపోగా… మరిన్ని సందేహాలు దారితీసింది. విషయం ఏమిటంటే నిమ్మగడ్డకు, ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ భేటీ జరిగింది. అదీ కాకుండా టిడిపి మాజీ మంత్రి అచ్చెన్న, జేసీ ప్రభాకర్ అరెస్టయి వెంటనే ఈ భేటీ జరగడంతో పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలుగులోకి వచ్చాయి
ఇకపోతే నిమ్మగడ్డ పక్షాన హైకోర్టులో పోరాడింది తానేనని…. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు మరియు ఏపీలో రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తాను ఉన్నానని… ఇదే క్రమంలో హైకోర్టులో పిల్ వేశానని కామినేని శ్రీనివాస రావు గతంలో చెప్పుకొచ్చారు. హైకోర్టులో ఈ విషయంలో కామినేని పోరాటానికి తగ్గట్టు పాజిటివ్ ఫలితం కూడా వచ్చింది. అయితే అదే కేసు సుప్రీంకోర్టులో విచారణ లో పెండింగ్ లో ఉన్నప్పుడు నిమ్మగడ్డ తో కామినేని కలవడం మరియు దీనికి సుజనాచౌదరి ఆశ్రయం ఇవ్వడం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది. అయితే సుజనాచౌదరి ఏమన్నా మీడియా ముందుకు వచ్చి సరైన వివరణ ఇచ్చాడా అంటే…. అతను చేసిన వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలని కలిగిస్తున్నాయి.
తనకు నిమ్మగడ్డ రమేష్ కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్ అని.. ఒకటిన్నర గంట రూమ్ లో కూర్చున్నా…. అసలు రాజకీయాల ఊసే ఎత్తడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కామినేని ఇతనిని కొన్నాళ్ళ నుండి అపాయింట్మెంట్ అడిగాడని.. చివరికి పార్క్ హయత్ హోటల్లో అపాయింట్మెంట్ ఇచ్చానని…. ఆయనతో మాత్రం రాజకీయ పార్టీ కార్యక్రమాలపై చర్చించాను అని…. అందులో ఎటువంటి దాపరికం లేదని అన్నాడు.
అసలు క్లారిటీ మిస్ అవుతోంది ఇక్కడే. కలిస్తే సుజనాచౌదరి కామినేనిమి కలవాలి మధ్యలో నిమ్మగడ్డ ఎందుకు వచ్చినట్లు? పైగా ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. వీరిద్దరూ రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆయన రూంలో ఏం చేస్తున్నట్లు? లేకపోతే సుజనా మరియు నిమ్మగడ్డ ఫ్యామిలీ వ్యవహారాలు మాట్లాడుకున్నప్పుడు కామినేని రూమ్ లోనే ఉన్నాడు కదా. ఎక్కడా.. దేనికీ పొంతన కుదరడం లేదు. మొత్తంగా లోపల ఏదో విషయం జరిగిందని అంతగా అర్థమవుతునా… సుజనా మాత్రం అతకని లాజిక్ చెప్పి బాగానే ఇరుక్కున్నాడు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.