చంద్రబాబుకి ఇప్పుడు అర్జంటుగా “శ్రీమంతుడు సినిమాలో శివాజీరాజా పాత్రధారుడు” కావాల్సిందే. ఆ సినిమాలో ఊరు నుండి వెల్లిపుతున్న కుటుంబాలను శివాజీ లెక్కిస్తుంటారు. అలాగే ఇప్పుడు బాబు నుండి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలను లెక్కేసుకోవాల్సిందే..! అఫ్ కోర్స్ బాబు దగ్గర అంత సైన్యం లేదులే..!! అయితే ఈ గంట మాత్రం అందరూ ఊహించిందే. “న్యూస్ ఆర్బిట్” ముందే చెప్పినదే.
గంటకి ముహూర్తం కుదిరిందోచ్..!!
ఈ నెల ౩ న గంటా శ్రీనివాసరావు జగన్ ని కలుస్తారు. తన కుమారుడికి కండువా కప్పించి., తను ఓ అనధికార వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతారు. మిగిలిన నలుగురిలాగానే ఈయన కూడా అన్నమాట. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ మొత్తం నలుగురు వైసీపీ పంచన చేరిన పోయారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్న అయిదవ టీడీపీ ఎమ్మెల్యే.
అయితే ఈయన చేరికకు గతంలోనే వైఎస్ జగన్ అంగీకరించినప్పటికీ… గంటా పెంచి పోషించిన నేత మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆయనకు తోడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా గంటా చేరికను అడ్డుపడుతూ వచ్చారు. కానీ… జగన్చం ఏకైక లక్ష్యం ముందు ఇవేమి నిలబడలేదు. చంద్రబాబుకి ఎమ్మెల్యేలను దూరం చేయడం ద్వారా బలహీనపర్చాలన్న జగన్ లక్ష్యం మరింత పదునెక్కింది.
విశాఖ కోసమూ..! కలిసి వచ్చేలా..!!
ప్రధానంగా విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించుకున్న వైఎస్ జగన్ ముందుగా ఆ ప్రాంతంలోని టీడీపీ ఎమ్మెల్యేలందరినీ చేర్చుకుని అక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకోవాలని ఆలోచన చేస్తున్నారుట. విశాఖలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ఒక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ చెంతకు చేరారు. గంటా చేరికతో మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉంటారు. సాధారణంగా గంటా ఎప్పుడు ఏ పార్టీలో చేరినా తన వర్గీయులతో వెళుతుంటారు. ఆయన వెంట ఒకరిద్దరు ఎమ్మెల్యేలను చేర్చే అవకాశం కూడా ఉందని టాక్. చూడాలి ఆయన ఒక్కరే వైసీపీలోకి చేరనున్నారా టీడీపీలో ఆయన స్నేహితులనూ బయటకు తీసుకువస్తున్నారో వేచి చూడాలి. కానీ ఇప్పటికీ గంటా స్నేహితులు, మాజీలు పంచకర్ల రమేష్, రసూల్ వంటి నేతలు వైసీపీలో చేరిపోయారు.