చైనా సరిహద్దుల్లో గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం భారత భూభాగంలోకి చైనా వచ్చాయి. ఆ తర్వాత గల్వాన్ లోయలో జరిగిన మారణకాండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా భారతదేశంలోని ఆ ప్రాంతం తమదేనని చైనా వితండవాదం చేస్తోంది.
రెండున్నర నెలల తర్వాత…
ఈ నేపథ్యంలో పలుమార్లు అధికారుల మధ్య చర్చలు కూడా జరిగాయి. ఇవి విడతలవారీగా సాగుతుంటే ఫలితం మాత్రం వస్తున్నట్టు లేదు. తాజాగా ఆదివారం కూడా మరొకసారి చైనా-భారత సైనికుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో చర్చలు జరగలేదు. దాదాపు రెండున్నర ఏళ్ల గ్యాప్ తర్వాత ఇవి జరిగినట్లు సమాచారం. చైనా భూభాగంలోని చూఘల్-మొల్దో సరిహద్దు శిబిరం వద్ద ఈ చర్చలు అనేవి జరిగాయి.
అక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందే…
భారతదేశం మరొకసారి చైనా వారికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివాదాస్పద ప్రాంతాలనుండి చైనా తన సైన్యాలను ఉపసంహరించుకోవాలని భారత్ మరొకసారి స్పష్టం చేసింది. ఇక సైనికాధికారులు కూడా పదేపదే ఈ విషయాన్ని చెబుతుంటే చైనావారు వినిపించుకోకుండా అక్కడే తమ శిబిరాలు వేసుకొని ఆక్రమించుకున్నారని తెలుస్తోంది. అందుకని చర్చలకు పిలిచి వారికి ఈ విషయాన్ని అధికారులు స్పష్టం చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ విషయం పై చైనా స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే పాంగాంగ్ సరస్సు, చూషుల్, గోగ్రా-హాట్స్పింగ్లో ప్రాంతాల వద్ద చైనా తన 16 బలగాలను మోహరించింది. ఆ ప్రదేశాల నుండి వెంటనే తమ సైనికులను వెనక్కి మళ్ళించాలని భారత ప్రభుత్వం కోరింది.
దాదాపు 10 గంటలు జరిగిన చర్చలు..!
భారత బృందానికి 14వ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ నేతృత్వం వహించాడు. చైనా తరఫున చర్చలకు సారథ్యం వహించేందుకు దక్షిణ జిన్జియాంగ్ మిలిటరీ డిస్ట్రిక్ట్ చీఫ్ మేజర్ జనరల్ లియూ లిన్ వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి 8:00 వరకు కొనసాగడం గమనార్హం. ఇక బలగాల ఉపసంహరణ, ఉద్రిక్త సడలింపు ప్రక్రియను సమర్థవంతంగా కలిసికట్టుగా తీసుకెళ్లాలని భారత బృందం చైనాకి స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాల నుండి సమాచారం. మరి చైనా నుంచి సానుకూల స్పందన ఉంటుందో లేదో వేచి చూడాలి.