ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం సీరియస్..!! చర్యలకు నిర్ణయం…!!
న్యాయవ్యవస్థకు.. ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా..
చట్టపరమైన అన్ని చర్యల పైనా కసరత్తు
నిత్యం ఏపీ ప్రభుత్వం పైన వ్యతిరేక కధనాలు..ఆధార రహత వార్తలు ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి పైన ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటి వరకు అనేక రకాలుగా కధనాలు రాసినా..చూసీ చూడనట్లుగా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు ఇక ఉపేక్షించవద్దనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా శనివారం ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ వార్తగా ప్రచురించిన ఒక కధనం పైన ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇక, ప్రభుత్వంలోని ముఖ్య నేతలు దీని పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ పత్రిక పైన చట్టపరమైన అన్ని చర్యలూ తీసుకోవలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా దెబ్బతీసేందుకు పక్కా వ్యూహంతోనే ఈ కథనాన్ని అల్లారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో..నేరుగా న్యాయ వ్యవస్థ పై నేరుగా సంప్రదింపులు జరిపి దీని వెనుక కుట్రను బయటకు తీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం సీరియస్..చర్యలు తప్పవ్
ఆంధ్రజ్యోతిలో శనివారం న్యాయదేవతపై నిఘా అంటూ ప్రచురితమైన కధనం పైన ఏపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సీరియస్ అయింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన తరువాత దీని పైన ప్రభుత్వంలోని ముఖ్యులు చర్చ చేసారు. ఇది కుట్ర పూరితంగా అల్లిన కధనంగా తేల్చారు. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనంపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అవ్వటంతో పాటుగా..చట్టపరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని నిర్ణయించారు.న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను కుట్రపూరితంగా దెబ్బతీసేందుకు పక్కా వ్యూహంతోనే ఈ కథనాన్ని అల్లారన్న ప్రభుత్వం…ఈ కధనం వెనుక ఉన్న ఉద్దేశాల ను బయటకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రాజకీయశక్తులు, కొన్ని మీడియా సంస్థలు ఓ పక్కా వ్యూహాంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. న్యాయవ్యవస్థను పక్కదారి పట్టించేందుకు కుట్రపన్నాయంటున్న ప్రభుత్వం…దీనిపై చట్టప్రకారం, న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఈ కథనంపై న్యాయవ్యవస్థపై నేరుగా సంప్రదింపులు జరిపి దీనివెనుక కుట్రను వివరించాలని నిర్ణయించిన ప్రభుత్వం…ఇందు కోసం న్యాయ నిపుణులకు బాధ్యతలు అప్పగించింది.