మంత్రివర్గ విస్తరణ అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అన్నా బోలెడంత హడావిడి ఉంటుంది. రోజుల తరబడి చర్చలు.. సమావేశాలు ఉంటాయి.నెలల తరబడి లాబీయింగ్ లు ఉంటాయి.కోటరీల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఆశావహుల లిస్ట్ చాంతాడంత ఉంటుంది. బోలెడు హడావుడి ఉంటుంది. మీడియాకు లైకులు ఉంటాయి. పుకార్లు ఉంటాయి. నాయకుల మధ్య గుసగుసలు ఉంటాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో మంత్రివర్గ మార్పులు చాలా సింపుల్ గా జరిగిపోయాయి.ఊహకు అందని వారికి, ఊహించని వారికి మంత్రి పదవులు వచ్చిపడ్డాయి. ఎటువంటి మొహమాటాలు, లాబీయింగ్ లు లేకుండా సింపుల్ గా తాను అనుకున్న వారికే మంత్రి పదవులు ఇచ్చి విమర్శలకు, వివాదాలకు తావులేకుండా చేసుకున్నారు సీఎం జగన్. అందుకే జగన్ దగ్గర అటువంటి లాబీయింగ్ లు ఏమి పని చేయవని మరోసారి ప్రూవ్ అయ్యింది.
ఆశావహులంతా మరో ఏడాది చూడాల్సిందే..!
అనంత వెంకటరామిరెడ్డి, రోజా, అంబటి రాంబాబు, ఆర్ కే రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సామినేని ఉదయభాను, కొలుసు పార్ధసారధి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, స్పీకర్ తమ్మినేని సీతారాం లాంటి సీనియర్లు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్నారు. ఇప్పుడు రెండు స్థానాలు ఖాళీ కావడంతో తమకు కచ్చితంగా దక్కుతుంది ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. వీరంతా మరో ఏడాదిన్నర కాలం పాటు ఆగాల్సిందే. అదే వేరే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు లాంటి ప్రభుత్వం ఉంటే బోలెడు లాబీయింగ్ లు, లీకులు ఉండేవి. చాలా పుకార్లు, చాలా ప్రచారం నడిచేది. సామాజిక వర్గాల లెక్కలు అంటూ బయటకు చెబుతూనే లోపల తతంగం చాలా జరిగేది. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏమీ లేకుండా ఏ సామాజికవర్గం బయటికి వెల్లిందో అదే సామాజిక వర్గాన్ని లోపలికి తీసుకొచ్చి జగన్ తన మార్కు మరోసారి చూపించుకున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?