ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అసలు నరేంద్ర మోడీ అనే అతను ఎవరు? మిగిలిన దేశ ప్రజలందరికీ లాగానే ప్రధానమంత్రా? లేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదో ముందుగా గుర్తించి వారికి సపోర్ట్ చేసే ప్రత్యేక శక్తి నా? లేకపోతే సరైన సమయం చూసి పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ లీడర్ తో చేతులు కలిపి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న అవకాశవాదా?
ఈ దూకుడు ఎందుకోసం?
కొద్దిరోజుల క్రితమే ఏపీ బీజేపీ నూతనాధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు చేపట్టారు. దీంతో మోడీ స్టాండ్ క్లియర్ గా తెలిసిపోయింది. టార్గెట్ టిడిపి..! రాష్ట్రంలో ఎంతో బలహీనంగా కనిపిస్తున్న ఈ పార్టీని వచ్చే ఎన్నికల నాటికి చిన్నాభిన్నం చేయడమే వారి అజెండా. దానికి తగ్గట్టు సోము వీర్రాజు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. దూకుడే మంత్రంగా కొనసాగుతూ నేడు ఏబీఎన్ ఆర్కేకు చురకలు అంటిస్తూ ఒక లేఖను కూడా రాశాడు. కాబట్టి తెలుగు తమ్ముళ్ళను తన వైపు ఎలా తిప్పుకోవాలి అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు తెలుగు తమ్ముళ్లకు వారి పార్టీపై నమ్మకం పోగొట్టడమే ప్రధాన లక్ష్యం. మిగిలినవారికి తామొక ప్రత్యామ్నాయ శక్తి గా ఉన్నామని తెలియజేయడమే వారి అజెండా.
పావులు మన నేతలంతా
మొత్తానికి బిజెపి అధికారపక్షాన్ని అయితే టార్గెట్ చేసే ప్రసక్తే లేదు. అదను చూసి దెబ్బ కొట్టడం లో మోదీ-షా ద్వయం ది అందవేసిన చేయి. అలాంటిది తొందరపడి వైసిపి పైన విమర్శలు చేస్తే.. జగన్ తనకున్న ఆవేశంతో అసలు ఏపీలో బిజెపిని కనబడని ఇవ్వకుండా చేయడం వంటి పరిస్థితులకు అసలు కేంద్రం మొగ్గు చూపట్లేదు. ఎంతసేపటికి బిజెపిని టీడీపీని టార్గెట్ చేస్తోంది. అందుకే మూడు రాజధానులు విషయంలో మౌనం వహించింది. అలాగని పార్లమెంట్ లో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించలేదు. ఇక్కడే మోడీ తనదైన శైలిలో రాజకీయం చేశారు. దీనిని అర్థం చేసుకోలేని కొంత మంది ఆంధ్ర ప్రజలు ప్రధానమంత్రిని దేవుడు అంటున్నారు… మరికొందరు రాష్ట్రానికి పట్టిన శని అని అంటున్నారు. కానీ అతను కింగ్ మేకర్ గా అవతరించేందుకు చదరంగం ఆడిస్తున్నా ఒక గ్రాండ్ మాస్టర్ అని కనుక్కోలేకున్నారు
పవర్ కావాలి కానీ ప్రయోజనాలు పట్టవు
సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం పోస్టు కొంచెం ఖాళీగానే ఉంది…. అధికారపక్షాన్ని సరిగ్గా ఢీకొంటే పవర్ కూడా వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి. మరి వ్యూహాత్మకంగా చక్రం తిప్పే బదులు ప్రజలకు మేలు చేసి మైలేజీ సంపాదించుకోవచ్చుగా. అసలు అలాంటి ఉద్దేశమే లేదు కమలనాథులకు లేదు. చేతిలో కావలసినంత పవర్ ఉంది కానీ మూడు రాజధానులు-అమరావతి విషయాన్ని పరిష్కరించరు. హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఇందుకు నిదర్శనం. కేసుకు సంబంధించిన ప్రమాణం కంటే రాజధానుల అంశమే అక్కడ హైలెట్ అయ్యింది.. కేంద్రం కోరుకునేది కూడా అదే. పునర్విభజన చట్టం ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన విద్యాసంస్థలు పోలవరం ప్రాజెక్టు వంటి అనేక అంశాలకు సంబంధించి కేంద్రం సమాధానం చెప్పవలసి ఉంటుంది.. ఇవేమీ లేకుండా అఫిడవిట్ వ్యూహాత్మకంగా దాఖలు చేశారు.
అధికారంలోకి వచ్చేందుకే ప్రజలకు మేలు చేసి వారిని తృప్తి పరచడం లేదు అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల బాగోగుల గురించి పట్టించుకుంటారు అంటే మనల్ని పిచ్చి పట్టిన వాళ్ళు అనుకుంటారు.