AP Politics: సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడం.. సీఐడీ పోలీసులు నోటీసులివ్వడం.. అరెస్టులు చేయడం.. కుర్రాళ్ళని అరెస్టు చేసి అవసరమైతే కొట్టడం.. ఇది ఇప్పుడే వింటున్నారా..!? అయితే తప్పులో కాలేసినట్టే. ఇదేమి ఇప్పుడు అమలవుతున్న కొత్త సబ్జెక్టు కాదు. ఓ మాజీ ముఖ్యమంత్రి దీనిలో ఆరంభం చేస్తే.. ఇప్పటి ముఖ్యమంత్రి దీన్ని పీక్స్ కి తీసుకెల్తూ.. ఆ మాజీ ముఖ్యమంత్రి బృందంపైనే ప్రయోగిస్తున్నారు. అందుకే మాజీ నేర్పిన విద్యని.. మాజీ పైనే భారీగా ప్రయోగిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీఎం జగన్..! కొంచెం లోతుగా వెళ్లి చెప్పుకుందాం..!!
AP Politics: అప్పట్లో కేసులు గుర్తున్నాయా..!?
ఈరోజు సీబీఎన్ ఆర్మీ లో ముగ్గురు కుర్రాళ్ళని గుంటూరు అర్బన్ ఎస్పీ అరెస్టు చేశారు. మీడియాకు ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. “వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు అరెస్టు చేసినట్టు తెలిపారు.” దీన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. టీడీపీ సోషల్ మీడియా గొగ్గోలు పెడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్ల వ్యవధిలో వందలాది మంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కేసుల పేరిట వేధిస్తున్నారని ఆరోపిస్తుంది.. సరే ఒప్పేసుకుందాం.. కానీ
* 2018 లో నెల్లూరు ఇద్దరు వైసిపి సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు.. 2015 లో విశాఖ, గుంటూరులో కొందరి అరెస్టు.. అలా ఆ అయిదేళ్ల టీడీపీ పాలనలో దాదాపు 40 మంది వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
సంఖ్య పెరిగింది.. సబ్జెక్టు మారలేదు..!
అప్పుడు 40 .. ఇపుడు 140 కావచ్చు. సంఖ్య మాత్రమే పెరిగింది. సబ్జెక్టు మాత్రం మారలేదు. అప్పుడు చంద్రబాబు కాస్త ముసలాడు కాబట్టి స్పీడ్ గా వెళ్ళలేదు. నెమ్మదిగా అరెస్టులు చేయించారు. ఇప్పుడు జగన్ స్పీడ్ కాబట్టి.. ఎడాపెడా అరెస్టులు చేయిస్తున్నారు. ఇప్పుడు గొగ్గోలు పెడుతున్న టీడీపీ అప్పుడెందుకు ఎంజాయ్ చేసింది..!? అప్పుడు కేసులు పెట్టినప్పుడు వైసిపి పడిన వేదనకి పది రేట్లు ఇప్పుడు టీడీపీకి అనుభవించేలా చేస్తున్నారు.
* టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు చురుకుగా ఉంది. జగన్ పై అనేక రకాల పేజీలు, మీమ్స్ తయారు చేసి వదులుతుంది. ఆ పార్టీ మంత్రులు, నాయకులపై కూడా మీమ్స్, వైరల్ న్యూస్, కామెడీ ఫోటోలు, వెటకారం, అప్పుడప్పుడూ శృతిమింది బూతులు కూడా పెడుతున్నారు. అందుకే టీడీపీ సోషల్ మీడియాపై నిఘా వేస్తూ పోలీసుల్లో ఓ బృందం ఉంది. టీడీపీ పేజీలపై నిత్యం నిఘా పెడుతూ పోస్ట్ చేసిన ఐపీ అడ్రెస్స్ లు ట్రేస్ చేసే పనిలో ఈ టీం ఉంటుంది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొందరు పోలీసులు ఇదే పనిలో ఉండేవారు. టిట్ ఫర్ టాట్ గేమ్ లాగా దీన్ని అప్పట్లో చంద్రబాబు నెమ్మదిగా మొదలు పెట్టారు. కొంచెం కొంచెం భయపెట్టి కేసులు పెట్టించారు. ఇప్పుడు జగన్ మొదలు పెట్టడమే సీరియస్ గా మొదలు పెట్టారు. వేటాడుతున్నారు. ఇది ఇక్కడితో ఆగేది కాదు. గడిచిన రెండేళ్లలో కేవలం వైసిపిని టార్గెట్ చేయడానికే టీడీపీ ఆధ్వర్యంలో దాదాపు 150 యూట్యూబ్ చానెళ్లు వచ్చాయి. దీనిలో ఒక లెక్క, పరిమితి మేరకు సబ్జెక్టు తో విమర్శిస్తున్న చానెళ్లు కొన్ని ఉండగా… కేవలం బూతులతో, దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్న చానెళ్లు కూడా ఉన్నాయి. వాటిపైనే పోలీసుల నిఘా ఎక్కువగా ఉంది..!