రోడ్లు వేయడం ప్రభుత్వ బాధ్యత. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యతను ప్రజల మీదే నెట్టేసింది. పెట్రోల్, డీసెల్ మీద రూపాయి సుంకాన్ని పెంచి వచ్చే డబ్బుతో రోడ్లు వెయ్యాలని ప్లాన్ వేసింది. పెట్రోల్ డీసెల్ ధరలు 86 రూపాయలు ఉన్నా సమయంలో ధర పెంచింది. మారం చేయకుండా వాహనదారుడు పెట్రోల్ ద్వారా రోడ్ల బాధ్యత తీసుకున్నాడు. సరేలే రోడ్లు బాగుపడతాయి అనుకున్నాడు. ఎప్పుడు ప్రభుత్వం ఆ రోడ్లు కూడా వేయం . పెట్రోల్ పై పెంచిన రూపాయి సుంకం డబ్బుని అప్పులకు వడ్డీలు కట్టుకుంటా.. రోడ్లు ఏమి లేవు అని మాట తప్పుతోంది.
సుంకం పెంచారు.. సుఖమేది?
నవరత్నాల అమలుకు పూర్తి నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం దగ్గర మౌలిక వసతులు అయినా రోడ్లు వేసేందుకు డబ్బు లేదు. రహ దారులు భవనాల శాఖ గత ఏడాది ఎలాంటి పనులు చేపట్టలేదు. అయితే వర్షాలు వాళ్ళ రాష్ట్రంలోని రోడ్లు అన్ని దాదాపు పాడయ్యాయి. దీనికి ప్రభుత్వం పెట్రోల్ లో లీటరుకు రూపాయి సుంకం పెంచి ఆ డబ్బుని రోడ్లు వేసేందుకు ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థకు ఇచ్చేలా ప్లాన్ వేసింది. ఏడాదికి 50 కోట్ల వరకు సుంకం రూపంలో రావొచ్చని లెక్క కట్టారు. దీనివల్ల రాష్టంలో కొంతలో కొంత మేర అయినా రహదారులు బాగుపడతాయని అనుకున్నారు. సుంకం పెంచేందుకు నిమిషం ఆలోచించని ప్రభుత్వం గత నెలలుగా సుంకం డబ్బులు దండుకున్న ప్రభుత్వానికి అసలు నిజం ఇప్పుడే తెలిసింది.
అప్పు బోలెడు!!
రాష్ట్రరహదారుల అభివృద్ధి సంస్థ రహదారులు భవనాలా శాఖ పరిధిలో ఉండే సంస్థ. రాష్ట్ర రహదారుల నిర్వహణ అంతే దీనిం కిందనే ఉంటుంది. కొత్త రోడ్లు నిర్మాణం, మరమ్మతులు అంత దీని మీదనే చేస్తారు. రాష్ట్ర రహదారులు కింద 24 రహదారులున్నాయి. 14 , 722 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వీటి బాధ్యత చూడాల్సిన అభువృద్ది సంస్థ గతంలో నిధుల్లేక, ఉన్నా నిధులు వేరే కారక్రమాలకు మళ్లించడంతో అప్పులు పలు అయ్యింది. రోడ్ల నిర్వహణకు గతంలో సుమారు ఆర్డీసీ ఋణం కింద 3 వేళా కోట్ల మేర ఋణం 5 బ్యాంకు ల నుంచి సేకరించారు. దీనికి ప్రతి నెల 20 కోట్ల మేర వడ్డీలు చెల్లిస్తున్నారు. అయితే అసలు, వడ్డీ కలిపి చెల్లించే ప్లాన్ ఈ నెల నుంచి అమలు కాబోతుంది. అంటే బ్యాంకులు ఇచ్చిన అప్పుకి కేవలం వడ్డీ చెల్లిస్తే సరిపోదు, అసలు డబ్బును దానిలో చేర్చి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం నెలకు కడుతున్న 20 కోట్ల అసలుకు అదనంగా మరో 20 కోట్లను ప్రిన్సిపల్ అమౌంట్ కి కచ్చితంగా జమచేయాలి. అంటే నెలకు పెట్రోల్ సుంకం మీద వచ్చే 50 కోట్లలో 40 కోట్లు అప్పు తీర్చడానికే సరిపోతాయన్న మాట. మిగిలే 10 కోట్లకు రాష్ట్ర రహదారుల నిర్వహణ సాధ్యం కాదు. కనీసం ఎక్కడ కొత్త రోడ్డు వేసే అవకాశం ఉండదు.
టోల్ గేట్లు పెట్టి దోచుకువాలని ప్లాన్
ప్రభుత్వం ఎదో తన డబ్బుతో వేసినట్లు పెట్రోల్ సుంకం డబ్బుతో కొన్ని రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసి, కొన్ని దారుల్లో టోల్ గేట్లు పెట్టి వాసులు చేయాలనీ ప్రణాళిక వేసింది. ఇప్పటివరకు జాతీయ రహదారుల్లో ఉన్నా టోల్ విధానం రాష్ట్ర దారికి తీసుకురావాలని పన్నాగం పన్నింది. అంటే ప్రజల డబ్బుతో రోడ్లు వేసి, మల్లి వారి వద్దనే డబ్బు లగే కుట్ర. అంటే రెండు పర్యాయాలు ప్రజల జేబు నుంచి లాక్కునే కుట్ర. అయితే ప్రస్తుతం రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థకున్న అప్పు వాళ్ళ అసలు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అంతుపట్టకుండా ఉంది. సుంకం నిధులు మాత్రం అడగొద్దని ఆర్థికశాఖ ను రహదారుల అభివృద్ధి సంస్థ కోరడానికి సిద్ధం అవుతుంది.