బిగ్ బాస్ లో ప్రతి కంటెస్టెంట్ ను పార్క్ హయత్ హోటల్ వాళ్ళ స్టార్ క్వారంటైన్ కు పంపించిన విషయం మొన్న మనం చెప్పుకున్నాం. అదీ కాకుండా సింగర్ కు అప్పుడు కరోనా పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా టీం అంతా ఉలిక్కిపడింది. ఇక ముందు జాగ్రత్త గా హోటల్ కి క్వారంటైన్ కోసం పంపించడం చాలా మంచి పని అయింది అని అందరూ రిలాక్స్ అయ్యారు. అయితే ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే బిగ్ బాస్ అసలు ఇప్పట్లో జరుగుతుందా లేదా అన్న అనుమానం మాత్రం అందరికీ అలానే ఉండిపోయింది.
ఎవరా ఇద్దరూ..?
ఇక వివరాల్లోకి వెళితే…. నోయల్ తో పాటుగా మరో ఇద్దరికి కూడా కరోనా బయటపడిందని సమాచారం. అయితే ఇద్దరి పేర్లు బయటకి రానివ్వడం లేదట. దీంతో ఇతర కంటెస్టెంట్ ల లో ఆందోళన మొదలైంది. ఏకంగా ప్రధాన మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వస్తుంటే అందరూ వెల్లడిస్తున్నారు కానీ బిగ్ బాస్ వారు మాత్రం ఈ విషయాన్ని కొంచెం గోప్యంగానే ఉంచుతూ ఉన్నట్లు సమాచారం. ఇక కంటెస్టెంట్ల విషయంలో కూడా టీం పునరాలోచనలో పడింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అతను ఇంకో ప్రాబ్లం..!
ముందు ఆగస్టు నెల ఆఖరున ఈ షో స్టార్ట్ చేద్దామని అనుకున్నారు అయితే దాన్ని సెప్టెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అప్పుడైనా స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. ఈ లోపల సింగర్ గీతామాధురి భర్త నందు విషయం బిగ్ బాస్ కు తలనొప్పిగా మారింది. అతను హైపర్ యాక్టివ్, స్మార్ట్ అని మొదట్లో ఎంపిక చేశారు కానీ ఇప్పుడు లిస్టు నుండి అతని పేరుని తీసేద్దామని అనుకుంటున్నారట. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను అని అర్థం వచ్చేలా రకరకాల పోస్టులు షేర్ చేయడం ఇప్పుడు వారికి నచ్చడం లేదు. బిగ్ బాస్ టీం తో ఒప్పందం ప్రకారం షో మొదలయ్యే వరకు వ్యక్తిగతంగా ప్రచారాలు చేసుకోవడానికి వీలులేదు.
పెద్దాయన ఏమంటారో….?
ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే కింగ్ నాగార్జున ఇలా కరోనా కలకలం క్వారంటైన్ లో చెలరేగిన తర్వాత హోస్ట్ గా చేసే ఉద్దేశం లోనే ఉన్నాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ముందే ఈ సమయంలో తను హోస్ట్ గా వ్యవహరించలేనని బెట్టు చేసిన నాగార్జున ఇప్పుడు ఇన్ని అవాంతరాల మధ్య కొనసాగించడం కొద్దిగా కష్టమైన విషయమే. అయితే మొత్తానికి బిగ్ బాస్ వాయిదా మాత్రం అనివార్యం అని స్టార్ మా లో టాక్ నడుస్తుంది. చూద్దాం చివరికి ఏమవుతుందో….